Maharashtra: సీఎం శిందే, రెబల్ ఎమ్మెల్యేలను సస్పెండ్ చేయండి..!
తిరుగుబాటు నేతలపై మరోసారి సుప్రీంకు ఠాక్రే..
దిల్లీ: శివసేన ఎమ్మెల్యేల తిరుగబాటుతో అధికారాన్ని కోల్పోయిన ఉద్ధవ్ ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఏక్నాథ్ శిందే సహా కొంతమంది రెబల్ ఎమ్మెల్యేలపై అనర్హత విషయం తేలేంతవరకు వారిని అసెంబ్లీ సమావేశాలకు హాజరుకాకుండా సస్పెండ్ చేయాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. అయితే ఈ పిటిషన్ను అత్యవసరంగా విచారించేందుకు కోర్టు నిరాకరించింది. రెబల్ ఎమ్మెల్యేల అనర్హతపై దాఖలైన ఇతర పిటిషన్లతో కలిపి జులై 11నే విచారణ చేపడతామని కోర్టు స్పష్టం చేసింది.
ఏక్నాథ్ శిందే నేత్వత్వంలో పలువురు శివసేన ఎమ్మెల్యేలు పార్టీపై తిరుగుబాటు చేయడంతో అప్పటి ఠాక్రే సర్కారు వారిపై చర్యలు తీసుకుంది. శిందే సహా 16 మంది ఎమ్మెల్యేలపై డిప్యూటీ స్పీకర్ అనర్హత నోటీసులు జారీ చేశారు. ఈ నోటీసులపై జూన్ 27లోగా రెబల్ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలని ఆదేశించారు. అయితే, ఈ నోటీసులపై శిందే వర్గం సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. వారికి న్యాయస్థానం ఊరట కల్పించింది. అనర్హత నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు జులై 12 వరకు గడువు కల్పించింది. దీనిపై తదుపరి విచారణను జులై 11వ తేదీకి వాయిదా వేసింది.
ఈ నేపథ్యంలో ఠాక్రే సర్కారుకు బలపరీక్ష ఎదురవ్వడం.. మెజార్టీని నిరూపించుకోలేక విశ్వాస పరీక్షకు ముందే ఆయన రాజీనామా చేయడం చకచకా జరిగిపోయాయి. అనంతరం జరిగిన పరిణామాల్లో అనూహ్యంగా ఏక్నాథ్ శిందే ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టి అందర్నీ ఆశ్చర్యపర్చారు. అయితే శిందే ఇప్పుడు అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే ఠాక్రే వర్గం మరోసారి సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
శిందే సహా 16 మంది తిరుగుబాటు ఎమ్మెల్యేల అనర్హత అంశం పెండింగ్లో ఉన్నందున.. అప్పటిదాకా వారు అసెంబ్లీలోకి రాకుండా సస్పెండ్ చేయాలని కోరుతూ శివసేన చీఫ్ విప్ సునీల్ ప్రభు నేడు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. వారు సభా కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఆంక్షలు విధించాలని కోరారు. అంతేగాక, అసలైన శివసేన పార్టీ తమదేనంటూ శిందే వర్గం చేసిన వ్యాఖ్యలను కూడా ఠాక్రే వర్గం ఖండించింది. ‘‘శిందే వర్గం తిరుగుబాటు చేసినప్పటికీ.. అసలైన శివసేన రాజకీయ పార్టీ ఇప్పటికీ ఉద్ధవ్ ఠాక్రే నాయకత్వంలోనే ఉంది. 2018లో జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లో ఆయనే శివసేన అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు’’ అని ఠాక్రే వర్గం కోర్టుకు తెలిపింది. ఎమ్మెల్యేల సస్పెన్షన్ కోరుతూ దాఖలు చేసిన పిటిషన్పై అత్యవసర విచారణ చేపట్టాలని సునీల్ ప్రభు కోరారు. అయితే ఇందుకు నిరాకరించిన జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జేబీ పార్దీవాలాలతో కూడిన వెకేషన్ బెంచ్.. జులై 11న విచారణ చేపడతామని తెలిపింది.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
General News
Jaishankar: సరికొత్త ఆలోచనలతో చకచకా చేస్తున్నారు.. సిబ్బందికి కేంద్ర మంత్రి ప్రశంసలు
-
General News
Arthroscopy: మీ మోకీలుకు నొప్పి ఎక్కువగా ఉందా..? ఏం చేయాలో తెలుసా..!
-
India News
Bharat Jodo Yatra: సెప్టెంబర్ 7 నుంచి కాంగ్రెస్ ‘భారత్ జోడో యాత్ర’..!
-
Sports News
Rudi Koertzen : రోడ్డు ప్రమాదంలో దిగ్గజ అంపైర్ మృతి.. స్పందించిన సెహ్వాగ్
-
General News
Headaches: గర్భిణికి తలనొప్పా..? వస్తే ఏం చేయాలో తెలుసుకోండి..!
-
Sports News
Chess Olympiad: చెస్ ఒలింపియాడ్లో భారత్కు రెండు కాంస్య పతకాలు
ఎక్కువ మంది చదివినవి (Most Read)
- Money: వ్యక్తి అకౌంట్లోకి రూ.6వేల కోట్లు.. పంపిందెవరు?
- Andhra news: నడిరోడ్డుపై వెంటాడి కానిస్టేబుల్ హత్య
- Chile sinkhole: స్టాట్యూ ఆఫ్ యూనిటీ మునిగేంతగా.. విస్తరిస్తోన్న చిలీ సింక్ హోల్..!
- PM Modi: ఆస్తులేవీ లేవు.. ఉన్న కాస్త స్థలాన్ని విరాళంగా ఇచ్చిన ప్రధాని!
- Horoscope Today: ఈ రోజు రాశి ఫలం ఎలా ఉందంటే? (09/08/2022)
- Vijay Deverakonda: బాబోయ్.. మార్కెట్లో మనోడి ఫాలోయింగ్కి ఇంటర్నెట్ షేక్
- Railway ticket booking: 5 నిమిషాల ముందూ ట్రైన్ టికెట్ బుక్ చేసుకోవచ్చు..!
- Sita Ramam: బాలీవుడ్, టాలీవుడ్లో నాకు ఆ పరిస్థితే ఎదురైంది: రష్మిక
- Harmanpreet Kaur: ప్రతిసారి ఫైనల్స్లో మేం అదే తప్పు చేస్తున్నాం: హర్మన్ప్రీత్ కౌర్
- BSNL నుంచి లాంగ్ప్లాన్.. ఒక్కసారి రీఛార్జి చేస్తే 300 రోజులు బిందాస్