కొత్త కరోనా: శాస్త్రీయ సమాచారమిదే!
ఇటీవల పొడచూపిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ (రకం) కంటే కూడా ప్రజల్లో వేగంగా వ్యాప్తిస్తున్న సందేహాలివి.
వాషింగ్టన్: చాలా సులభంగా, త్వరితంగా వ్యాప్తిస్తుందా?మరింత హాని చేస్తుందా?చికిత్సలకూ, వ్యాక్సిన్కూ లొంగదా? ఇటీవల పొడచూపిన కరోనా వైరస్ కొత్త స్ట్రెయిన్ (రకం) కంటే కూడా ప్రజల్లో వేగంగా వ్యాప్తిస్తున్న సందేహాలివి. ప్రత్యేకించి ఇటీవల బ్రిటన్ తదితర విదేశాలకు వెళ్లి వచ్చినవారు, వారి సంబంధీకులు పలు అనుమానాలతో సతమతమౌతున్నారు. ఈ నేపథ్యంలో శాస్త్రవేత్తలు అందించిన శాస్త్రీయ సమాచారమిదే..
కొత్త కరోనా ఎక్కడ నుంచి వచ్చింది?
బ్రిటన్ కరోనా రకాన్ని తొలుత సెప్టెంబర్లో కనుగొన్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకటించింది. కాగా దక్షిణాఫ్రికాలో కూడా మరో రకం కొవిడ్ తలెత్తినట్టు తెలుస్తోంది. కొత్త పరివర్తనలు చోటుచేసుకోవటం అంటే స్వల్ప మార్పులకు గురికావటం వైరస్లలో సర్వ సాధారణం. సుమారు ఏడాది క్రితం చైనాలో వెల్లడైన నాటి నుంచి కొవిడ్-19 వైరస్లో అనేక వైవిధ్యాలు చోటుచేసుకున్నాయి. వేర్వేరు స్థలాలు, వ్యక్తులు, పరిస్థితులను బట్టి వాటిలో మార్పు వస్తూనే ఉంటుంది. ఐతే ఈ విధంగా వచ్చే మార్పులు చాలావరకు సామాన్యంగానే ఉంటాయి. వాటిని పూర్తి అక్షరమాలలో తొలుత వచ్చే అ,ఆ లతో పోల్చవచ్చని డాక్టర్ ఫిలిప్ లాండ్రిగన్ అనే అమెరికన్ శాస్త్రవేత్త అంటారు. అయితే కరోనా తన ఉపరితలంపై ఉన్న ప్రొటీన్లు మార్పుచెంది.. ఔషధాలకు, టీకాలకు లొంగని విధంగా మారితే మాత్రం సమస్యాత్మకమే.
ఇది ఎప్పుడు ప్రమాదకరమవుతుంది?
సూపర్ స్ప్రెడర్ ఈవెంట్లు వంటి వాటి ద్వారా ఒక ప్రాంతంలో విపరీతంగా వ్యాప్తి చెందితే.. సమస్యాత్మకంగా మారే అవకాశముంది. పరివర్తనల వల్ల వైరస్కు మరింత వేగంగా వ్యాప్తి చెందే సామర్ధ్యం లభించడం వంటి అదనపు సామర్థ్యం చేకూరటం ప్రమాద కారకం కావచ్చు. కాగా..బ్రిటన్లో తలెత్తిన కొత్త కరోనాకు ఈ మాదిరి శక్తి ఉందా అనే విషయాన్ని నిర్ధారించేందుకు ఇంకా పరిశోధనలు జరుగుతున్నాయి. కాగా, మిగిలిన కొవిడ్ మ్యుటేషన్స్తో పోలిస్తే దీనికి వేగంగా, ఎక్కువ మందికి సోకే శక్తి ఉందని డాక్టర్ లాండ్రిగన్ అంటున్నారు.
బ్రిటిష్ రకం కరోనాతో సమస్యేమిటి?
బ్రిటన్ కరోనా స్ట్రెయిన్లో సుమారు 24 రకాల పరివర్తనలు సంభవించాయి. వీటిలో ఎనిమిది.. మానవ కణాల్లో ప్రవేశించేందుకు ఉపకరించే అతి ముఖ్యమైన స్పైక్ ప్రొటీన్కు సంబంధించినవి. నిజానికి ఈ స్పైక్ ప్రొటీన్ను నిరోధించటమే లక్ష్యంగా వ్యాక్సిన్లు, యాంటీబాడీలతో కూడిన ఔషధాలను తయారుచేస్తున్నారు. ప్రస్తుతం ఇంగ్లండులో ఉన్న కరోనా, సాధారణ మహమ్మారి కంటే రెండు రెట్లు సోకే లక్షణాన్ని అధికంగా కలిగిఉందని డాక్టర్ రవి గుప్తా అనే వైరస్ నిపుణుడు తెలిపారు.
ఇది మరింత అనారోగ్యం, మరణాలకు దారితీస్తుందా?
నిజానికి ఈ విషయం ఇప్పటి వరకు రుజువు కాలేదు. అయితే ఆ విధమైన ప్రమాదం రాకుండా నివారించేందుకు అప్రమత్తంగా ఉండాలి. కొత్త రకం కరోనా ఎక్కువమందికి వ్యాప్తిస్తున్న నేపథ్యంలో.. ఇది మరింత ప్రమాదకరమా అనేది త్వరలోనే తెలియనుంది. ఐతే దీనివల్ల అనారోగ్యంలో కానీ, వ్యాధి తీవ్రతలో కానీ మార్పులేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వైద్య నిపుణురాలు మారియా వాన్ కెర్ఖోవే వెల్లడించారు.
చికిత్సపై పరివర్తనల ప్రభావం ఎలా ఉంటుంది?
ప్రస్తుతం వాడుతున్న ఔషధాలు శరీరానికి యాంటీబాడీలను అందించటం ద్వారా వైరస్పై పనిచేస్తాయి. ఇంగ్లాండులో బయటపడిన అనేక కేసుల్లో.. రెండింటిలో చోటుచేసుకున్న పరివర్తనలు.. కరోనా ఔషధాల సామర్ధ్యం విషయమై సందేహాలను రేకెత్తిస్తున్నాయి. కాగా, కొత్తరకంపై యాంటీబాడీల స్పందనను గురించి విస్తృత ప్రయోగాలు జరుగుతున్నాయి.
వ్యాక్సిన్లపై ప్రభావం సంగతేంటి?
ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు కొత్త కరోనాపై ప్రభావం చూపుతాయని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. కేవలం యాంటీబాడీలు తయారయ్యేందుకు దోహదం చేయటమే కాకుండా.. రోగనిరోధక శక్తి విస్తృతంగా స్పందించేలా ప్రేరేపించటం వ్యాక్సిన్ల లక్షణం. ఈ కారణం వల్లనే అవి కొత్త రకం కరోనాపై కూడా ప్రభావం చూపుతాయని పలువురు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. అయితే ఈ విషయాన్ని నిర్ధారించేందుకు ప్రయోగాలు జరుగుతున్నాయి. కొత్త కరోనా రకం, తాము వాడుతున్న వ్యాక్సిన్లపై ప్రభావం చూపటం లేదని బ్రిటన్ అధికారులు స్పష్టం చేశారు.
ఏ జాగ్రత్తలు తీసుకోవాలి?
సాధారణ కరోనా కట్టడికి ప్రజారోగ్య నిపుణులు సూచించే.. మాస్క్ ధరించటం, చేతులను తరచు శుభ్రం చేసుకోవటం, సామాజిక దూరం పాటించటం, జన సమూహాల్లోకి వీలైనంత వరకు వెళ్లకపోవటం తదితర మార్గదర్శకాలనే కొత్త కరోనా విషయంలోనూ పాటించాలి.
ఇవీ చదవండి..
మరోసారి బయటపడ్డ చైనా కుయుక్తులు!
కరోనా 2.0తో మనకు మళ్లీ భయం తప్పదా?
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal)కు సోమవారం రాత్రి జైల్లో ఇన్సులిన్ అందజేసినట్లు ఆప్ ప్రకటించింది. -
అంకుల్.. మా బడిని ఇలా చేశారేంటి?
పోలింగ్ విధులకు వచ్చి.. పాఠశాలను అపరిశుభ్రం చేసిన అధికారులను ఉద్దేశించి ప్రశ్నలు సంధించిన ఓ చిన్నారి వీడియో తమిళనాట వైరల్ అవుతోంది. -
మరో ఐదురోజులు భగభగలు.. ఐఎండీ వెల్లడి
దేశంలోని పలు ప్రాంతాల్లో మరో ఐదు రోజుల పాటు అధిక ఉష్ణోగ్రతలు కొనసాగొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం తెలిపింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి
అత్యాచారానికి గురై గర్భం దాల్చిన 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీంకోర్టు అసాధారణ నిర్ణయం తీసుకుంది. బాలిక సంక్షేమం, భవిష్యత్తుకు అత్యధిక ప్రాధాన్యమిస్తూ దాదాపు 30 వారాల ఆమె గర్భాన్ని తొలగించేందుకు అనుమతించింది. -
సీయూఈటీ-యూజీ, నెట్ స్కోర్ల నార్మలైజేషన్ ఎత్తివేత : యూజీసీ
కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ -యూజీ, నేషనల్ ఎలిజిబులిటీ టెస్ట్ (నెట్) స్కోర్ల నార్మలైజేషన్ (సాధారణీకరణ)ను ఈ ఏడాది నుంచి ఎత్తివేస్తున్నట్లు యూజీసీ చీఫ్ జగదీప్ కుమార్ తెలిపారు. -
అభిషేక్ బెనర్జీ ఇంటి ముందు రెక్కీ
పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ ఇంటిముందు రెక్కీ నిర్వహించాడన్న కారణంతో ఓ నిందితుడిని కోల్కతా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. -
బెంగాల్ పాఠశాలల్లో 25 వేల నియామకాలు రద్దు
పశ్చిమ బెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. -
కేజ్రీవాల్కు ఇన్సులిన్పై మెడికల్ బోర్డు ఏర్పాటు చేయండి
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు గల మధుమేహ వ్యాధికి ఇన్సులిన్ ఇవ్వాల్సిన అవసరముందా? లేదా? అని తేల్చేందుకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేయాలంటూ ఎయిమ్స్ డైరెక్టర్ను దిల్లీ కోర్టు సోమవారం ఆదేశించింది. -
2జీ స్పెక్ట్రమ్పై 2012 తీర్పును సవరించండి
వేలం ద్వారా మాత్రమే 2జీ స్పెక్ట్రమ్ కేటాయింపులు, బదిలీలు జరగాలంటూ 2012లో వెలువరించిన తీర్పును సవరించాలని సుప్రీంకోర్టుకు కేంద్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. -
ఎన్నికలకు ఎండల దెబ్బపై ఆందోళన వద్దు
లోక్సభ రెండోదశ ఎన్నికలకు ఎండల దెబ్బపై పెద్దగా కలవరపడాల్సిందేమీ లేదని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) సోమవారం కేంద్ర ఎన్నికల సంఘానికి తెలిపింది. -
‘దివ్యాంగుల హక్కుల చట్టం అమలు అత్యంత దారుణం’
దివ్యాంగుల హక్కుల చట్టం-2016ను అమలు చేయడంలో జరుగుతున్న జాప్యంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. -
‘హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేస్తే పోలే’
12వ తరగతి తర్వాత అయిదేళ్లు చదవాల్సిన ఎల్ఎల్బీ కోర్సును మూడేళ్లకు తగ్గించడంపై సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం, బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకు ఆదేశాలు జారీచేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. -
ఎన్కౌంటర్ మృతులపై రివార్డు రూ.1.85 కోట్లు
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లో సుమారు 29 మంది వివిధ క్యాడర్లకు చెందిన మావోయిస్టు నేతలు మృతి చెందిన సంగతి తెలిసిందే. -
అది బెయిల్ షరతుల ఉల్లంఘనే
లఖింపుర్ ఖేరి హింస ఘటనలో నిందితుడైన ఆశిష్ మిశ్ర రాజకీయ కార్యక్రమాలకు స్వయంగా హాజరైతే అది బెయిల్ నిబంధనల ఉల్లంఘనేనని సుప్రీం కోర్టు సోమవారం వ్యాఖ్యానించింది. -
మీది ఉక్కు సంకల్పం
భారత్కు సంబంధించి ధైర్యం, పట్టుదల, సంకల్పానికి సియాచిన్ రాజధానిగా ఉందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. -
దిల్లీ డంపింగ్ యార్డులో భారీ అగ్ని ప్రమాదం
దేశ రాజధాని దిల్లీలోని గాజీపుర్ డంపింగ్ యార్డులో భారీ మంటలు చెలరేగి ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. -
అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయానికి తొలి మహిళా వీసీ
వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ప్రఖ్యాత అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయం (ఏఎంయూ) ఉప కులపతి (వీసీ)గా నయీమా ఖాతూన్ నియమితులయ్యారు. -
రాహుల్పై పరువు నష్టం కేసు.. విచారణ మే 2కు వాయిదా
కేంద్ర హోం మంత్రి అమిత్షాను ఉద్దేశించి ఆరేళ్ల క్రితం కాంగ్రెస్ అగ్రనాయకుడు రాహుల్గాంధీ చేసిన వ్యాఖ్యలపై విచారణను ఉత్తర్ప్రదేశ్ ఎంపీ-ఎమ్మెల్యే కోర్టు మే 2కు వాయిదా వేసింది. -
మణిపుర్లో మానవహక్కుల ఉల్లంఘన
ఈశాన్య రాష్ట్రం మణిపుర్లో జాతుల ఘర్షణ అనంతరం గణనీయమైన మానవ హక్కుల ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని అమెరికా పేర్కొంది. -
భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నా - బాక్సర్ విజేందర్ సింగ్
కాంగ్రెస్ నుంచి భాజపాలో చేరి భావోద్వేగ మూల్యం చెల్లించుకున్నానని ఒలింపిక్ పతకం విజేత విజేందర్ సింగ్ పేర్కొన్నారు. -
ఐపీఎల్ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్ సెటైర్
తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్ వేదికగా స్పందించారు.
తాజా వార్తలు (Latest News)
-
రోహిత్తో ఓపెనింగ్ చేసేది ఎవరు? మీ ఛాయిస్ ఎవరు?
-
యాడ్ సైజ్లోనే ‘క్షమాపణలు’ ప్రచురించారా?.. పతంజలిని ప్రశ్నించిన సుప్రీం
-
తెలుగులో ‘నాయట్టు’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ వరదలకు ముందు.. తర్వాత: శాటిలైట్ చిత్రాల్లో ఇలా
-
ఇన్స్టంట్ ఇ-పాన్ కావాలా..? ఉచితంగా పొందండిలా..