చైనా నుంచి యాంగూన్కు రహస్యంగా విమానాలు!
ఒకవైపు తూర్పు లద్దాఖ్లో 9 నెలల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణ ఊరట కలిగిస్తున్నప్పటికీ..
మయన్మార్లో డ్రాగన్ కార్యకలాపాలు
దిల్లీ: ఒకవైపు తూర్పు లద్దాఖ్లో 9 నెలల పాటు సాగిన సైనిక ప్రతిష్టంభన తర్వాత బలగాల ఉపసంహరణ ఊరట కలిగిస్తున్నప్పటికీ.. పొరుగునున్న మయన్మార్లో గుట్టుచప్పుడు కాకుండా చైనా తన ప్రాబల్యాన్ని పెంచుకోవడం ఆందోళన కలిగిస్తోంది. అక్కడ సైన్యం.. అధికారాన్ని హస్తగతం చేసుకున్నప్పటి నుంచి డ్రాగన్ కదలికలు పెరుగుతున్నాయి.
‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’ (ఏఈపీ) విధానానికి భారత్ చాలా ప్రాధాన్యం ఇస్తోంది. ఇందులో భాగంగా ఆగ్నేయాసియా, తూర్పు ఆసియా దేశాలతో సంబంధాల కోసం మయన్మార్ను కీలక వారధిగా ఉపయోగించుకుంటోంది. అలాంటి ప్రాంతంలో డ్రాగన్ పాగా వేయడం భారత్కు ఆందోళనకర పరిణామం. దక్షిణ చైనాలోని కున్మింగ్ నుంచి మయన్మార్లోని యాంగూన్కు రాత్రి వేళ విమానాలు రహస్యంగా ప్రయాణిస్తున్నట్లు ఆస్ట్రేలియా మేధోమథన సంస్థ తాజాగా పేర్కొంది. ప్రతి రాత్రి ఐదు చొప్పున విమానాలు తిరుగుతున్నాయని వివరించింది. వీటిలో అన్రిజిస్టర్డ్ సర్వీసులు కూడా ఉన్నాయని తెలిపింది. ఈ నెల 1న అక్కడ సైనిక తిరుగుబాటు తర్వాత ఈ పోకడ మొదలైందని వెల్లడించింది. చైనా బలగాలు, సైబర్ నిపుణులను ఈ విమానాల్లో చేరవేస్తుండొచ్చని పేర్కొంది. సమాచారం, ఇంటర్నెట్పై మయన్మార్ సైనిక పాలకులు గట్టి నియంత్రణ కలిగి ఉండేలా చూడటానికి వీరిని పంపుతుండొచ్చని తెలిపింది. మయన్మార్కు రహస్యంగా ఆయుధాలను చేరవేస్తుండొచ్చని కూడా అనుమానం వ్యక్తం చేసింది. అయితే ఈ వార్తలను చైనా అధికార పత్రిక ‘గ్లోబల్ టైమ్స్’ ఖండించింది. ‘‘అవన్నీ నిరాధార, వక్రీకరణలతో కూడిన కథనాలు. మయన్మార్లోని సైనిక పాలకులను చైనా రహస్యంగా సమర్థిస్తోందన్న భావన కలిగించేలా వీటిని రాశారు’’ అని ఆరోపించింది.
భారత్కు సవాల్
మయన్మార్లో సైనిక తిరుగుబాటు భారత విదేశాంగ విధానానికి పెద్ద సవాల్ రువ్వుతోంది. సైనిక పాలకులను తీవ్రంగా విమర్శిస్తే వారు చైనా వైపు మొగ్గుతారన్న భావన ఉంది. దీనివల్ల ‘యాక్ట్ ఈస్ట్ పాలసీ’కి, అలాగే భారత ఈశాన్య ప్రాంతంలో ఉగ్రవాదుల ఏరివేత కార్యకలాపాలకూ ఇబ్బంది ఏర్పడుతుందని భావిస్తోంది. మరోవైపు మయన్మార్లో సైనిక తిరుగుబాటుపై అమెరికా, ఇతర పశ్చిమ దేశాలు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నాయి. ఇలాంటి సమయంలో ప్రజాస్వామ్య అనుకూల శక్తులకు కీలక మద్దతుదారు అయిన భారత్.. ఈ అంశంపై మౌనం వహింపజాలదు. ఈ నేపథ్యంలో ఒకింత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.