Secret group of US military: ఆ ట్రంపరితనమే చైనాను భయపెట్టింది..
ట్రంప్ మూర్ఖుడు.. వాచాలత్వం ఎక్కువ.. తిక్క నిర్ణయాలు.. ఇలా వెక్కిరించిన వారంతా ఒక్క విషయంలో ఆయన్ను మెచ్చుకొంటారు. చైనాతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు నేర్పించారు..
ఏడాది క్రితమే నిశ్శబ్దంగా తైవాన్లో అడుగుపెట్టిన అమెరికా సైన్యం..!
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం
ట్రంప్ మూర్ఖుడు.. వాచాలత్వం ఎక్కువ.. తిక్క నిర్ణయాలు.. ఇలా వెక్కిరించిన వారంతా ఒక్క విషయంలో ఆయన్ని మెచ్చుకొంటారు. చైనాతో ఎలా వ్యవహరించాలో అమెరికాకు నేర్పించారు.. ఆయన అధ్యక్షుడిగా ఉన్నప్పుడు చేసిన ఓ పని తాజాగా వెలుగులోకి వచ్చింది.. ఇది తెలుసుకొన్న చైనాకు గొంతులో తడారిపోయింది..! డ్రాగన్ను అంత ఆందోళనకు గురిచేసిన ట్రంప్ నిర్ణయం ఏమిటో తెలుసా..? తైవాన్కు అమెరికా సైన్యాన్ని పంపించడం..! తాజాగా వాల్స్ట్రీట్ జర్నల్ ఇటీవల ఈ విషయాన్ని వెలుగులోకి తెచ్చింది. విషయం తెలుసుకొన్న చైనా గగ్గోలు పెట్టడం మొదలుపెట్టింది.
తైవాన్ సైన్యానికి శిక్షణ..!
అమెరికాకు చెందిన ఒక స్పెషల్ ఆపరేషన్స్ యూనిట్ సైనికులు, ఒక గ్రూపు మెరైన్స్ సిబ్బంది దాదాపు ఏడాది నుంచి తైవాన్లో ఉంటున్నారు. వీరు అక్కడి సైనికులకు, మెరైన్ సిబ్బందికి యుద్ధవ్యూహాలపై శిక్షణ ఇస్తున్నారు. వీరిలో డజను మంది కమాండోలు, గుర్తుతెలియని సంఖ్యలో మెరైన్లు ఉన్నారు. కొన్నేళ్లుగా దక్షిణ చైనా సముద్రంలో డ్రాగన్ దూకుడు పెరిగిపోవడం, తైవాన్ ఎయిర్ డిఫెన్స్ జోన్లోకి విమానాలను పంపడం వంటి దౌర్జన్యపూరిత చర్యలతో అమెరికా ఈ నిర్ణయం తీసుకొంది. ట్రంప్ హయాంలో కమాండోలను తైవాన్కు పంపించారు. ప్రస్తుతం వారు అక్కడ పనిచేస్తున్నారా..? లేదా..? అన్న విషయం బయటకు వెల్లడికాలేదు. కానీ, మెరైన్స్ మాత్రం ఇప్పటికీ అక్కడే ఉన్నట్లు సమాచారం.
ఇప్పుడెందుకు బయటకొచ్చింది..
గత వారం దాదాపు 50కి పైగా చైనా విమానాలు తైవాన్ గగనతల రక్షణ జోన్లోకి ప్రవేశించాయి. వీటిల్లో న్యూక్లియర్ బాంబర్లు, ఫైటర్ జెట్లు, ట్యాంకర్లు ఉన్నాయి. అదే సమయంలో ఈ వార్త బయటకి పొక్కింది. ఇప్పటి వరకు కొన్నేళ్లు తైవాన్తో చెలగాటం ఆడి.. ఆ తర్వాత తేలిగ్గా ఆక్రమించుకోవచ్చనుకున్న చైనాకు ఇదో పెద్ద షాక్. వాస్తవానికి చైనా వచ్చే ఆరేళ్లలో తైవాన్ను ఆక్రమించుకొనే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఇటీవల అమెరికా జనరల్స్ ఓ కాంగ్రెస్ కమిటీ విచారణలో అంగీకరించారు. తైవాన్లోకి సైన్యాన్ని పంపిన అంశంపై మాట్లాడేందుకు తాజాగా పెంటగాన్ తిరస్కరించింది. అటు తైవాన్ కూడా పెదవి విప్పలేదు. ట్రంప్ హయాంలో పెంటగాన్లో పనిచేసిన క్రిస్టఫర్ మాయర్ మాత్రం అమెరికా కాంగ్రెస్ విచారణలో మాట్లాడుతూ తైవాన్కు సైన్యాన్ని పంపే ప్రతిపాదనను బలంగా పరిశీలించామని పేర్కొన్నారు.
మరోవైపు చైనా మాత్రం నీతులు వల్లించడం మొదలుపెట్టింది. ఆ దేశ విదేశాంగ శాఖ మంత్రి మాట్లాడుతూ గతంలో చేసుకొన్న ఒప్పందాలను అమెరికా గౌరవించాలని, తైవాన్కు సైనిక సాయాన్ని నిలిపివేయాలని కోరారు. ‘‘తమ సార్వభౌమత్వాన్ని, భూభాగాలను కాపాడుకోవడానికి తగిన చర్యలు తీసుకోవడానికి సిద్ధం’’ అని పేర్కొన్నారు.
అప్పటి వరకు చైనాను ఎదుర్కొనేలా..!
యుద్ధ సన్నద్ధత అనేది కేవలం గంటల్లో జరిగే పనికాదు. హఠాత్తుగా జరిగే దండయాత్రలను ఎదుర్కోవడం దాదాపు అసాధ్యం. అందుకే దాడిలో ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేయడం చాలా ముఖ్యం. చైనా-తైవాన్కు మధ్య దూరం కేవలం 150 కిలోమీటర్లు మాత్రమే. అంటే మన హైదరాబాద్- కోదాడ కంటే తక్కువ దూరమన్నమాట. చైనా దళాలు వాయు, జల మార్గాల్లో ఈ దూరాన్ని దాటి తైవాన్లో ప్రవేశించడం అత్యంత తేలిక. అదే సమయంలో జపాన్లోని ఓకినావాలో ఉన్న అమెరికా సైన్యం అక్కడికి చేరే లోపే చైనా ఆక్రమణ పూర్తయ్యే అవకాశాలు ఉన్నాయి. పోనీ తైవాన్లో అమెరికా సైన్యాన్ని నేరుగా ఉంచడం సాధ్యంకాదు. ఎందుకంటే చైనాతో అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతింటాయి. అందుకనే తైవాన్ సైన్యాన్నే బలోపేతం చేస్తే.. వారే తొలి దాడిని సమర్థంగా ఎదుర్కొంటారు..! ఈ లోపు మిత్రపక్షాలు రంగంలోకి దిగేందుకు తగినంత సమయం లభిస్తుంది.
అమెరికా వ్యూహం ఇలా..!
తైవాన్ 2000-2015 వరకు రక్షణ రంగాన్ని బాగా విస్మరించింది. కేవలం అత్యంత ఖరీదైన ఆయుధాలు మాత్రమే కొనుగోలు చేసింది. ఇవి ఆ దేశాన్ని ఏమాత్రం కాపాడలేవని అమెరికా సైనికాధికారులు అంచనా వేస్తున్నారు. దళాల్లో పోరాట పటిమను, వ్యూహరచన సామర్థ్యాన్ని పెంచడంపై దృష్టిపెట్టాలని చెబుతున్నారు. వాస్తవానికి చైనాతో యుద్ధం మొదలైన కొన్ని గంటల్లోనే ఈ ఖరీదైన పరికరాలు మొత్తం ధ్వంసం అవుతాయని ట్రంప్ హయాంలో డిప్యూటీ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్గా పనిచేసిన మ్యాట్ పొటింగర్ పేర్కొన్నారు. ఆయన హార్వర్డు విశ్వవిద్యాలయంలోని హూవర్ ఇన్స్టిట్యూషన్లో పరిశోధకుడు. ఆయన అంచనా ప్రకారం.. తైవాన్ను కాపాడేవి నౌకా విధ్వంసక క్షిపణులు, స్మార్ట్ సీ మైన్స్, సుశిక్షుతులైన రిజర్వు, సహాయ దళాలు మాత్రమే. ఇవి చైనాను భారీగా దెబ్బతీయగలవని మ్యాట్ అంచనా వేశారు. ముఖ్యంగా చైనా దళాలు భూమిపై, జలాల్లో ప్రయాణించే యాంఫీబియూస్ వాహనలను వాడే అవకాశాలు ఉన్నాయి. ఇలాంటి పలు వ్యూహాలను ఎదుర్కొనేలా శిక్షణ ఇవ్వాలన్నది అమెరికా ప్లాన్.
ట్రంప్తో తైవాన్కు బలం..
అమెరికా-తైవాన్ సంబంధాలను కఠినంగా నియంత్రించే చట్టాలను ట్రంప్ అధికారం చేపట్టాక సడలించారు. ట్రంప్ ఆఫీస్ను వీడటానికి కొన్ని రోజుల ముందే 10 పేజీల ఇండో-పసిఫిక్ వ్యూహ పత్రాన్ని విడుదల చేశారు. ఇందులో తైవాన్తో సంబంధాలను, చైనాతో ముప్పును అమెరికన్లకు తెలియజేశారు. ముప్పులను స్వయంగా ఎదుర్కొనేలా తైవాన్ను బలోపేతం చేయాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు.
దీంతో ఆయన తర్వాత శ్వేతసౌధంలో అడుగుపెట్టేవారు.. తప్పనిసరిగా తైవాన్ను కాపాడాల్సిన పరిస్థితి కల్పించారు. ఆ తర్వాత బైడెన్ సర్కారు ఈ వ్యూహంలో ఇప్పటి వరకు ఎటువంటి మార్పులు చేయలేదు. వీటిల్లో కొన్ని విధానాలను కొనసాగిస్తోంది. ఏప్రిల్లో ఓ బృందాన్ని కూడా తైవాన్కు పంపింది. అంటే ఇప్పుడు రొమ్ము విరుచుకొని తైవాన్పైకి వెళ్లాలంటే చైనా ఒక్కసారి ఆలోచించుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
ప్రస్తుతం అమలవుతున్న అగ్నివీర్/అగ్నిపథ్ నియామక పథకంలో అవసరమైతే మార్పులు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం చేసిన ఎంపీ కన్నుమూత
ఎన్నికల ముంగిట తమిళనాడులో విషాదం చోటుచేసుకుంది. టికెట్ దక్కలేదనే మనస్తాపంతో ఈ నెల 24న ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ, ఎండీఎంకే సీనియర్ నేత ఎ.గణేశమూర్తి(77) కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గురువారం చనిపోయారు. -
తేజస్ ఎంకే1ఏ తొలి విహారం విజయవంతం
తేజస్ ఎంకే1ఏ శ్రేణిలో రూపొందిన యుద్ధ విమానం ఎల్ఏ-5003 తన తొలి ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో హిందుస్థాన్ ఏరోనాటికల్ లిమిటెడ్ (హెచ్ఏఎల్) ఈ యుద్ధ విమానాన్ని రూపొందించింది. -
ఐరాస సెక్రటరీ జనరల్ ప్రత్యేక ప్రతినిధిగా కమల్ కిశోర్
జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ(ఎన్డీఎంఏ) ఉన్నతాధికారి కమల్ కిశోర్ (55).. ఐక్యరాజ్యసమితి(ఐరాస) సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ప్రత్యేక ప్రతినిధిగా నియమితులయ్యారు. -
గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ గుండెపోటుతో ఆస్పత్రిలో మృతి
ఉత్తర్ప్రదేశ్ జైలులో శిక్ష అనుభవిస్తున్న గ్యాంగ్స్టర్, రాజకీయవేత్త ముఖ్తార్ అన్సారీ (63) గురువారం గుండెపోటుతో మృతిచెందినట్లు బాందాలోని రాణీ దుర్గావతి వైద్య కళాశాల ప్రిన్సిపల్ సునీల్ కౌశల్ ప్రకటించారు. -
‘కాలివేళ్లతో’ విధిరాత లిఖించుకున్న అపరబ్రహ్మ
సంకల్పబలం ఉంటే లక్ష్య సాధనకు ఏ వైకల్యమూ అడ్డుకాదని నిరూపిస్తున్నారు ఉత్తరాఖండ్కు చెందిన 58 ఏళ్ల దేవ్కీనందన్ శర్మ. -
ఎలాంటి తప్పూ జరగలేదు
నేషనల్ ఏవియేషన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్ఏసీఐఎల్) విమానాల లీజు అంశంలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సీబీఐ పేర్కొంది. -
ఈస్టర్ రోజున పనిదినం.. వెనక్కు తగ్గిన మణిపుర్ ప్రభుత్వం
ఈస్టర్ రోజును పనిదినంగా ప్రకటిస్తూ మణిపుర్ ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాలను గురువారం వెనక్కు తీసుకుంది. -
కేజ్రీవాల్ పాస్వర్డులు చెప్పలేదు
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ 4 డిజిటల్ పరికరాల పాస్వర్డులను చెప్పలేదని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) తెలిపింది. -
మరోసారి తండ్రైన పంజాబ్ సీఎం మాన్
పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్(50) మరోసారి తండ్రయ్యారు. ఆయన సతీమణి గుర్ప్రీత్ కౌర్ గురువారం పండంటి పాపకు జన్మనిచ్చారు. -
మేం జోక్యం చేసుకోలేం
మద్యం విధానానికి సంబంధించిన కేసులో అరెస్టయిన ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ను సీఎం పదవి నుంచి తప్పించాలంటూ దాఖలైన ప్రజాప్రయోజన వ్యాజ్యాన్ని (పిల్) దిల్లీ హైకోర్టు గురువారం కొట్టివేసింది. -
ఐరాస శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ ప్రారంభించిన భారత్
ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకులపై నమోదైన నేరాల నిక్షిప్తానికి, సదరు నిందితుల విచారణలో పురోగతిని పర్యవేక్షించడానికి భారతదేశం కొత్త డేటాబేస్ను రూపొందించిందని ఐరాస భారత ప్రతినిధి రుచిరా కాంబోజ్ గురువారం తెలిపారు. -
నెట్ మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు: యూజీసీ
వచ్చే విద్యా సంవత్సరం నుంచీ జాతీయ అర్హత పరీక్ష (ఎన్ఈటీ) మార్కుల ఆధారంగా పీహెచ్డీ ప్రవేశాలు కల్పించనున్నట్లు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) తెలిపింది. -
అండర్ గ్రాడ్యుయేట్ ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగుకు యోచన!
మెడికల్, ఇంజినీరింగ్ కోర్సుల తరహాలో సీయూఈటీ (కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్) మార్కుల ఆధారంగా అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల ప్రవేశాలకు కామన్ కౌన్సెలింగు నిర్వహించాలని యూజీసీ యోచిస్తున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. -
గురుద్వారా కర్ సేవా చీఫ్పై కాల్పులు
ఉత్తరాఖండ్లోని ఉధాంసింగ్ నగర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. నానక్మత్తా సాహిబ్ గురుద్వారాకు చెందిన డేరా కర్ సేవా చీఫ్ బాబా తర్సేమ్ సింగ్ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. -
కస్టోడియల్ మృతి కేసుల్లో.. పోలీసులకు బెయిల్ విషయంలో కఠినంగా వ్యవహరించాలి: సుప్రీం
కస్టోడియల్ మరణాల కేసులో పోలీసు అధికారులకు బెయిలిచ్చే విషయంలో న్యాయస్థానాలు కఠినంగా వ్యవహరించాలని సుప్రీంకోర్టు పేర్కొంది. -
నా భర్త అనుమానాస్పద మృతిపై దర్యాప్తు జరగాలి: సీతా సోరెన్
ఝార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) అధినేత శిబు సోరెన్ కుటుంబానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఆయన పెద్ద కోడలైన సీత తన భర్త దుర్గా సోరెన్ అనుమానాస్పద మరణంపై ఉన్నతస్థాయి దర్యాప్తు జరగాలని గురువారం డిమాండ్ చేశారు. -
సంక్షిప్త వార్తలు (10)
మాజీ ఐపీఎస్ అధికారి సంజీవ్ భట్కు 1996 నాటి డ్రగ్స్ కేసులో గురువారం గుజరాత్లోని బనాస్కాంఠా జిల్లా కోర్టు 20 ఏళ్ల కఠిన కారాగార శిక్ష విధించింది. -
స్కైరూట్ ఏరోస్పేస్ రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతం
హైదరాబాద్కు చెందిన స్టార్టప్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్ బుధవారం నిర్వహించిన రాకెట్ స్టేజ్-2 పరీక్ష విజయవంతమైంది. -
4 వాంగ్మూలాలతో సీఎం అరెస్టా?
ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)ని అణచివేసేందుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ప్రయత్నిస్తోందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. -
నిరంతర ప్రేరణ శక్తి.. స్వామి స్మరణానంద
రామకృష్ణమఠం, రామకృష్ణ మిషన్లకు 16వ అధిపతిగా ఉన్న స్వామి స్మరణానంద కన్నుమూత తనను నిర్ఘాంతపరిచిందని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు.
తాజా వార్తలు (Latest News)
-
భయపెడుతున్న భువన్.. శివారు మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను నాలుగైదు రెట్లు పెంపు
-
నకిలీ కరెన్సీ నోట్లతో దొరికిన వైకాపా నేత బంధువు
-
రేటింగుల పేరుతో మోసం కేసులో రూ.32 కోట్ల జప్తు
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
కన్నారా.. ఇది విన్నారా?
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్