కొవిడ్ ఎఫెక్ట్‌.. బెంగళూరులో 144 సెక్షన్‌ 

కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ఆంక్షలు అమలుచేస్తున్న ప్రభుత్వం..

Updated : 07 Apr 2021 16:17 IST

బెంగళూరు: కరోనా వైరస్‌ ఉద్ధృతి నేపథ్యంలో కర్ణాటక ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. ఇప్పటికే పలు ఆంక్షలు అమలుచేస్తున్న ప్రభుత్వం.. వైరస్‌ కట్టడి కోసం మరిన్ని కఠిన నిర్ణయాలను ప్రకటించింది. బెంగళూరు నగర పరిధిలో నేటి నుంచి 144 సెక్షన్‌ను అమలు చేయాలని నిర్ణయించింది. వీటితో పాటు అపార్ట్‌మెంట్లు, నివాస సముదాయాల్లోని ఈత కొలనులు, జిమ్‌లు, పార్టీ హాళ్లను తాత్కాలికంగా మూసివేయాలని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. 

కర్ణాటక రాష్ట్ర వ్యాప్తంగా నిన్న 6150 కొత్త కేసులు రాగా.. వాటిలో ఒక్క బెంగళూరులోనే 4266 కేసులు ఉండటం అక్కడి ఉద్ధృతికి అద్దంపడుతుతోంది. అలాగే నిన్న 39మంది మరణించగా.. వారిలో 26 మరణాలు నగరంలోనే కావడం గమనార్హం. ఇప్పటిదాకా రాష్ట్రవ్యాప్తంగా 10.26లక్షల పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 9,68,762మంది కోలుకోగా..  12,696 మంది కొవిడ్‌తో మృతిచెందారు. ప్రస్తుతం అక్కడ 45,107 క్రియాశీల కేసులు ఉన్నాయి. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని