J&Kలో నలుగురు ఉగ్రవాదుల అరెస్టు

జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా మాల్‌దేరా ప్రాంతంలో భద్రతా బలగాలు..

Published : 18 Aug 2020 13:20 IST

షోపియన్‌: జమ్మూ కశ్మీర్‌లోని షోపియన్‌ జిల్లా మాల్‌దేరా ప్రాంతంలో భద్రతా బలగాలు నలుగురు ఉగ్రవాదులను అరెస్టు చేశాయి. ఆ నలుగురు ఈ మధ్యే ఉగ్రవాద శిబిరాల్లో చేరినట్లు సైన్యం గుర్తించింది. వారి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. జమ్మూ కశ్మీర్‌లో సోమవారం ఉగ్రవాదులు సైన్యంపై కాల్పులకు తెగబడ్డారు. బారాముల్లా జిల్లా క్రీకి ప్రాంతంలో సెక్యూరిటీ సిబ్బందిపై కాల్పులు జరిపారు. ఈ ఉగ్ర దాడిలో ఇద్దరు జవానులు, ఓ పోలీసు మృతిచెందారు. ఘటన అనంతరం కాల్పులకు పాల్పడ్డ ఇద్దరు ఉగ్రవాదులను భద్రతాబలగాలు హతమార్చాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని