Mukesh Ambani: అంబానీ ఇంటి వద్ద భద్రత కట్టుదిట్టం.. ట్యాక్సీ డ్రైవర్‌ ఫోన్‌తో అప్రమత్తం!

ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద మరోసారి కలకలం రేగింది.

Published : 08 Nov 2021 19:27 IST

ముంబయి: ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ ఛైర్మన్‌ ముకేశ్‌ అంబానీ ఇంటి వద్ద మరోసారి కలకలం రేగింది. ముకేశ్‌ అంబానీ ఇంటి గురించి గుర్తు తెలియని ఓ ఇద్దరు వ్యక్తులు ఆరా తీశారంటూ పోలీసులకు సమాచారం అందడంతో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇంటి చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలిస్తున్నారు. అంబానీ ఇంటికి సమీపంలో పేలుడు పదార్థాలతో కూడిన ఓ వాహనం గుర్తించిన కొన్ని నెలలు తిరగక ముందే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

అంబానీ నివాసం అయిన యాంటిలియా గురించి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు తనను సంప్రదించారంటూ ఓ ట్యాక్సీ డ్రైవర్‌ నుంచి సోమవారం పోలీసులకు ఫోన్‌ వచ్చింది. వారిద్దరూ తనను ఇంటి అడ్రస్‌ అడిగారని, వారి చేతిలో రెండు పెద్ద పెద్ద బ్యాగులున్నాయని సదరు డ్రైవర్‌ చెప్పినట్లు పోలీసులు మీడియాకు వెల్లడించారు. దీంతో హుటాహుటిన అంబానీ ఇంటి చుట్టూ భద్రతను కట్టుదిట్టం చేశారు. ట్యాక్సీ డ్రైవర్‌ వాంగ్మూలాన్ని నమోదు చేశారు. సీనియర్‌ అధికారులు అక్కడి పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని