Noida twin towers: ఆ నలుగురి పోరాటం ఫలించిన వేళ.. ఎట్టకేలకు నోయిడా ట్విన్ టవర్స్ నేలమట్టం!
దేశంలో అక్రమ కట్టడాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక..! నోయిడాలో అక్రమంగా నిర్మించిన ట్విన్ టవర్స్ను అధికారులు......
ఇంటర్నెట్ డెస్క్: దేశంలో అక్రమ కట్టడాలకు పాల్పడే వారికి ఇదొక హెచ్చరిక..! నోయిడాలో నిబంధనలను అతిక్రమించి నిర్మించిన ట్విన్ టవర్స్ను అధికారులు ఎట్టకేలకు కూల్చేశారు. దేశంలో తొలిసారి అత్యంత అధునాతన టెక్నాలజీని వినియోగించి ఎడిఫిస్ సంస్థ ఈ జంట భవనాలను పేల్చేసింది. అనధికారికంగా, అక్రమంగా గ్రీన్జోన్లో నిర్మించిన అత్యంత ఎత్తైన టవర్స్ను కూల్చేయాల్సిందేనంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలతో నోయిడా అథారిటీ అధికారులు ఆదివారం మధ్యాహ్నం 2.30గంటలకు నేలమట్టం చేశారు. అయితే, దేశంలోనే అత్యంత ఎత్తైన ఈ నివాస భవంతుల కూల్చివేత అంత సులువుగా ఏమీ జరగలేదు. అంతపెద్ద నిర్మాణ సంస్థ సూపర్టెక్తో కోర్టుల్లో కొట్లాడటం వెనక పర్యావరణవేత్తలతో పాటు నలుగురు వ్యక్తుల సుదీర్ఘ న్యాయ పోరాటం ఉంది.
పోరాటం అలా మొదలైంది..
ఈ అక్రమ కట్టడాల్ని కూల్చివేసేందుకు నలుగురు సీనియర్ సిటిజన్లు అలహాబాద్ హైకోర్టు, సుప్రీంకోర్టులలో దాదాపు దశాబ్ద కాలం పాటు అలుపెరుగని పోరాటం చేశారు. సూపర్ టెక్ నిర్మాణ సంస్థతో కొట్లాడేందుకు తమ స్థోమత సరిపోక విరాళాలు పోగుచేసుకుని మరీ కోర్టుల చుట్టూ తిరిగారు. వారి 12ఏళ్ల అవిశ్రాంత న్యాయ పోరాటానికి ఫలితమే ఈ రోజు. ఆ టవర్స్ కూల్చివేత. ఉత్తర్ప్రదేశ్ రాష్ట్ర పరిధిలోని నోయిడాలో గల సెక్టార్ 93 ప్రాంతంలో సూపర్టెక్ లిమిటెడ్ కంపెనీ 2009లో భారీ ప్రాజెక్టు చేపట్టింది. ఈ భవనాల నిర్మాణ సమయంలో రెసిడెంట్స్ వెల్ఫేర్ అసోసియేషన్కు ప్రణాళికను చూపాలన్న నిబంధనను బిల్డర్ పెడచెవిన పెట్టారు. దీంతోపాటు అధికారులతో కుమ్మక్కై నిబంధనల్ని గాలికొదిలేశారు. ఈ క్రమంలో స్థానికంగా ఉన్న నలుగురు వ్యక్తులు యూబీఎస్ టియోటియా (80), ఎస్కే శర్మ(74), రవి బజాజ్(65), ఎంకే జైన్(59).. ఓ లీగల్ కమిటీగా ఏర్పడి సూపర్టెక్ సంస్థకు వ్యతిరేకంగా కోర్టుకెళ్లారు.
తొలుత వీరు అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించగా.. ఆ టవర్లను వెంటనే కూల్చివేయాలని 2014 ఏప్రిల్లో హైకోర్టు తీర్పు వెలువరించింది. అయితే ఈ తీర్పును సవాల్ చేస్తూ సూపర్టెక్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో స్టేటస్కో విధించారు. దాదాపు ఏడేళ్ల విచారణ అనంతరం అలహాబాద్ హైకోర్టు తీర్పును సమర్థిస్తూ.. సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తుది తీర్పు వెలువరించింది. ఆ ట్విన్ టవర్లను బిల్డర్ సొంత ఖర్చులతోనే కూల్చేయాలని ఆదేశించింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల తర్వాత కూడా ఈ కూల్చివేతకు చాలా సమయం తీసుకున్నారు. ఇప్పటివరకు నాలుగుగైదు సార్లు కూల్చివేతకు సంబంధించి షెడ్యూల్ తయారు చేసినా పలు కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. అయితే, చివరకు ఆగస్టు 28వ తేదీ మధ్యాహ్నం 2.30 గంటలకు భారీగా పేలుడు పదార్థాలను వినియోగించి ఆ భవంతులను నేలమట్టం చేశారు.
అయితే గతేడాది సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన సందర్భంలో తమకు ఈ 12ఏళ్ల పోరాటం ఓ కఠిన ప్రయాణమని నాటి రోజులను గుర్తుచేసుకున్నారు కమిటీలో ఒకరైన ఎస్కే శర్మ. ఒక్క సుప్రీంకోర్టులోనే ఏడేళ్లపాటు 30 సార్లు విచారణ జరిగిందన్నారు. దానికి ముందు అలహాబాద్ హైకోర్టుకు అనేకసార్లు వెళ్లామని అప్పుడు రైళ్లలో థర్డ్ క్లాస్లో ప్రయాణించామని చెప్పారు. ఇక సాక్ష్యాల కోసం స్థానిక, రాష్ట్ర సంస్థల నుంచి డాక్యుమెంట్లు సేకరించడం కూడా చాలా కష్టమైందని చెప్పుకొచ్చారు. ఈ న్యాయపోరాటం కోసం దాదాపు రూ.కోటికి పైనే ఖర్చయిందట. ఇందుకోసం ఇంటింటికీ వెళ్లి సొసైటీ సభ్యుల నుంచి విరాళాలు సేకరించామని టియోటియా చెప్పారు. న్యాయం తమవైపు ఉందని, కోర్టులో తమకు అనుకూలంగా తీర్పు వస్తుందనే నమ్మకంతోనే పోరాటం చేశామన్నారు.
టియోటియా సీఆర్పీఎఫ్లో డీఐజీగా పనిచేసి రిటైర్ అయ్యారు. ఈయన నేతృత్వంలోనే ఈ న్యాయపోరాటం సాగింది. ఎస్కే శర్మ టెలికాం విభాగంలో డిప్యూటీ డైరెక్టర్ జనరల్గా పనిచేసి రిటైర్ అయ్యారు. కమిటీ సభ్యుల్లో ఒకరైన ఎంకే జైన్ ఈ ఏడాది ఆరంభంలో కొవిడ్తో మరణించారు. జైన్ చాలా ధైర్యవంతుడని, ఆయన బతికుంటే కోర్టు తీర్పుతో ఎంతో సంతోషపడేవారని ఆయన సతీమణి గతంలో సుప్రీంకోర్టు తీర్పు సందర్భంగా భావోద్వేగం వ్యక్తంచేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
అదేం కొట్టుడు.. పంత్ నువ్వేనా క్రికెట్కు ఏడాదిన్నర దూరమైంది?
-
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
కోటక్ బ్యాంకు షేరు ఢమాల్.. రూ.37,500 కోట్ల సంపద ఆవిరి!
-
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
-
ఆడి కార్ల ధర పెంపు.. ఎప్పటి నుంచంటే?