సీరం, యూనిసెఫ్ వ్యాక్సిన్ ఒప్పందం
సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, యూనిసెఫ్ దీర్ఘకాల సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యూనిసెఫ్ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్ సంస్థలకు చెందిన 1.1 బిలియన్ వ్యాక్సిన్లను 100 దేశాలకు పంపనున్నట్లు వారు తెలిపారు.
దీర్ఘకాల సరఫరా ఒప్పందం కుదుర్చుకున్న ఇరుపక్షాలు
జెనీవా: సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా, యూనిసెఫ్ దీర్ఘకాల సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్లు యూనిసెఫ్ గురువారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆక్స్ఫర్డ్- ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్ సంస్థలకు చెందిన 1.1 బిలియన్ వ్యాక్సిన్లను 100 దేశాలకు పంపనున్నట్లు వారు తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సిన్లను పంపిణీ చేసేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ ‘కొవాక్స్’ అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో భాగంగా పలు పేద దేశాలకు తక్కువ ధరకే వ్యాక్సిన్ను అందించనున్నారు. ‘‘సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాతో దీర్ఘకాల వ్యాక్సిన్ సరఫరా ఒప్పందాన్ని కుదుర్చుకున్నాం. ఇందులో ఆస్ట్రాజెనెకా, నొవావాక్స్ సంస్థల వ్యాక్సిన్లు ఉన్నాయి.’’ అని యూనిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ తెలిపారు. కొవాక్స్ కార్యక్రమంలో భాగంగా 145దేశాలకు ఈ ఏడాది మధ్యలోగా వ్యాక్సిన్లను అందిస్తామని తెలిపారు. 336 మిలియన్ల ఫైజర్ బయోఎన్టెక్ వ్యాక్సిన్లను కూడా ఇందులో భాగంగా పంపిణీ చేస్తామని తెలిపారు. దీంతో ప్రపంచంలోని అన్ని దేశాల్లోని 3.3శాతం ప్రజలకు వ్యాక్సిన్లు అందుతాయని వారు తెలిపారు. ఇప్పటికే అన్ని దేశాల్లోని ఆరోగ్య కార్యకర్తలకు వ్యాక్సిన్ రవాణా, నిల్వ వంటి వాటిలో శిక్షణనిచ్చారని తెలిపారు. వ్యాక్సిన్లతో పాటు వాటికి అవసరమైన సిరంజిలు కూడా ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు యూనిసెఫ్ తెలిపింది. ఇప్పటికే వ్యాక్సిన్ల రవాణాకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు వారు తెలిపారు.
ఇవీ చదవండి..
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
‘హీరామండీ’తో నా కల నెరవేరింది: సోనాక్షి సిన్హా