Serum: ఒక్క జూన్లోనే 10కోట్ల డోసుల ఉత్పత్తి!
వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. జూన్ నెలలో రికార్డుస్థాయిలో 10కోట్లకుపైగా కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది.
టీకా ఉత్పత్తి వేగం పెంచిన సీరం ఇన్స్టిట్యూట్
పుణె: వ్యాక్సిన్ ఉత్పత్తిలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న సీరం ఇన్స్టిట్యూట్ తాజాగా మరో మైలురాయిని చేరుకుంది. జూన్ నెలలో రికార్డుస్థాయిలో 10కోట్లకుపైగా కొవిషీల్డ్ డోసులను ఉత్పత్తి చేసినట్లు వెల్లడించింది. దేశంలో కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచివుందని నిపుణులు హెచ్చరిస్తోన్న వేళ.. వ్యాక్సినేషన్ పంపిణీ వేగవంతం చేయడంలో టీకా తయారీ సంస్థలు చేస్తోన్న ప్రయత్నాలు ఊరట కలిగిస్తున్నాయి.
డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ)కు సీరం ఇన్స్టిట్యూట్ అందించిన వివరాల ప్రకారం, జూన్ నెలలో ఇప్పటివరకు 45 బ్యాచ్లలో కొవిషీల్డ్ డోసులను పంపించింది. అందులో 10.80కోట్ల డోసులను కసౌలీలోని సెంట్రల్ డ్రగ్స్ ల్యాబ్కు సరఫరా చేసినట్లు సీరం ఇన్స్టిట్యూట్ వెల్లడించింది. మే నెలలో 6.5కోట్ల డోసులుగా ఉన్న ఉత్పత్తి సామర్థ్యాన్ని జూన్ నాటికి గణనీయంగా పెంచినట్లు సీరం ఇన్స్టిట్యూట్ తెలిపింది. జూన్ నుంచి ప్రతినెల పది కోట్ల డోసులను అందజేస్తామని కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని సీరం ఇన్స్టిట్యూట్ అభిప్రాయపడింది.
నిత్యం సరాసరి 69లక్షల డోసుల పంపిణీ..
ప్రస్తుతం దేశంలో 18ఏళ్ల వయసుపైబడిన వారందరికీ వ్యాక్సిన్ ఇచ్చే ప్రక్రియ నడుస్తోంది. దీంతో దేశవ్యాప్తంగా నిత్యం కనీసం 50లక్షల మందికి వ్యాక్సిన్ అందిస్తున్నారు. కేంద్ర ఆరోగ్యశాఖ గణాంకాల ప్రకారం, గడిచిన 24గంటల్లో 64లక్షల మందికి వ్యాక్సిన్ అందించారు. వ్యాక్సిన్ మెగా డ్రైవ్ ప్రారంభమైన (జూన్ 21) నుంచి గడిచిన ఆరు రోజుల్లో నిత్యం సరాసరి 69లక్షల డోసులను పంపిణీ చేశారు. ఇలా ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 32.17కోట్ల కరోనా వ్యాక్సిన్ డోసులను అందించారు.
ప్రపంచ దేశాలను కరోనా వైరస్ విలయతాండవం చేస్తోన్న వేళ.. చాలా దేశాలను వ్యాక్సిన్ కొరత వేధిస్తోంది. దీంతో వ్యాక్సిన్ ఉత్పత్తి సంస్థలపై తీవ్ర ఒత్తిడి పెరిగింది. అయినప్పటికీ డోసుల ఉత్పత్తిని పెంచేందుకు అన్ని వనరులను వినియోగించుకునేందుకు ఆయా సంస్థలు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా భారత్లో ప్రతి నెల 10కోట్ల డోసుల కొవిషీల్డ్ టీకాను ఉత్పత్తి చేయాలని సీరం ఇన్స్టిట్యూట్ లక్ష్యంగా పెట్టుకుంది. అటు మరో వ్యాక్సిన్ సంస్థ భారత్ బయోటెక్ కూడా టీకాల ఉత్పత్తిని గణనీయంగా పెంచేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
‘రాహుల్ భవిష్యత్తులో మహాసముద్రాల ఆవల నుంచి పోటీ చేయాల్సి రావొచ్చు’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (18/04/24)
-
జీవం పోసుకోకముందే.. వేలాది జంటల ఆశలు సమాధి!
-
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
-
‘నేను మంచి తల్లిని కానా?’.. మామాఎర్త్ సీఈఓ భావోద్వేగ పోస్ట్
-
ఏఐ ఫీచర్లతో శాంసంగ్ కొత్త టీవీలు.. 8K మోడల్స్ ధర ₹3 లక్షల పైనే..!