Vaccine: చిన్నారులపై కొవావాక్స్ ప్రయోగాలు..!
కరోనా మహమ్మారి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్ ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే.
అనుమతులు కోరనున్న సీరమ్ సంస్థ
పుణె: కరోనా మహమ్మారి నుంచి చిన్నారులకు రక్షణ కల్పించేలా వ్యాక్సిన్లు అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు వేగవంతమవుతున్నాయి. ఇప్పటికే భారత్ బయోటెక్ పిల్లలపై ‘కొవాగ్జిన్’ క్లినికల్ ప్రయోగాలు జరుపుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరో ఫార్మా సంస్థ సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కూడా ఈ దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టింది. చిన్నారులపై ‘కొవావాక్స్’ ప్రయోగాలకు అనుమతి ఇవ్వాలని కోరుతూ కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ)కు దరఖాస్తు చేసుకోనుంది. త్వరలోనే ఈ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు తెలుస్తోంది.
అమెరికాకు చెందిన నొవావాక్స్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ను భారత్లో ‘కొవావాక్స్’ పేరుతో ఉత్పత్తి చేసేందుకు సీరమ్ సంస్థ ఒప్పందం కుదుర్చుకున్న విషయం తెలిసిందే. ఇటీవల ఈ వ్యాక్సిన్ క్లినికల్ ట్రయల్స్ను మన దేశంలో ప్రారంభించగా, శుక్రవారం నుంచి కొవావాక్స్ ఉత్పత్తిని కూడా మొదలుపెట్టినట్లు సీరమ్ అధినేత అదర్ పూనావాలా వెల్లడించారు. అమెరికాలో నొవావాక్స్కు అనుమతులు లభించిన తర్వాతనే భారత్లోనూ వినియోగానికి దరఖాస్తు చేసుకునే అవకాశాలున్నాయి.
ప్రస్తుతం దేశంలో మూడు టీకాలు అందుబాటులో ఉన్నాయి. అయితే చిన్నారుల కోసం ఏ టీకాకు ఇంతవరకూ అనుమతులు లభించలేదు. భారత్ బయోటెక్ మాత్రం చిన్నారులపై కొవాగ్జిన్ టీకా ప్రయోగాలు జరుపుతోంది. ప్రస్తుతం అవి తుదిదశలో ఉన్నాయి. సెప్టెంబరు - అక్టోబరు నాటికి పిల్లలకు కూడా టీకాలు అందుబాటులోకి రావచ్చని కేంద్ర ఆరోగ్యశాఖ ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.