బదిలీ చేయగానే అదృశ్యం.. ఐఏఎస్ అధికారికి దిల్లీ సర్కారు నోటీసులు..!
దిల్లీ (Delhi) ప్రభుత్వంలోని సేవల విభాగం కార్యదర్శి ఆశిష్ మోరెను కేజ్రీవాల్ సర్కారు ఇటీవల బదిలీ చేసింది. అయితే ఈ బదిలీని కేంద్రం అమలు చేయలేదు. మరోవైపు అప్పటి నుంచి కన్పించకుండా పోయారు. దీంతో ఆయనకు ప్రభుత్వం షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
దిల్లీ: దేశ రాజధాని దిల్లీ (Delhi) సర్కారులోని సేవల విభాగం కార్యదర్శి ఆశిష్ మోరె (Ashish More)ను పదవి నుంచి తప్పించడంతో దిల్లీ, కేంద్రం మధ్య మరోసారి వివాదం రాజుకుంది. దిల్లీలో ఎన్నికైన ప్రభుత్వానికే పాలనపై నియంత్రణ ఉండాలంటూ సుప్రీంకోర్టు (Supreme Court) ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఆశిష్పై కేజ్రీవాల్ (Kejriwal) సర్కారు బదిలీ వేటు వేసింది. అయితే ఈ బదిలీని కేంద్రం అమలు చేయకపోవడాన్ని ఆప్ సర్కారు ప్రశ్నించింది. ఈ క్రమంలోనే బదిలీ వేటుకు గురైన ఆశిష్.. కన్పించకుండా పోవడం చర్చనీయాంశంగా మారింది. ఆయన ఫోన్ కూడా స్విచ్చాఫ్ వస్తోంది. దీంతో దిల్లీ ప్రభుత్వం ఆయనకు తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఐఏఎస్లు సహా ప్రభుత్వాధికారుల బదిలీలు, నియామకాలపై దిల్లీ ప్రభుత్వానికే (Delhi Govt) నియంత్రణ ఉంటుందని సుప్రీంకోర్టు గత గురువారం కీలక తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ తీర్పు వెలువడిన గంటల వ్యవధిలోనే.. దిల్లీ ప్రభుత్వంలోని సర్వీసెస్ విభాగం కార్యదర్శి (services secretary) ఆశిష్ మోరె (Ashish More)ను కేజ్రీవాల్ సర్కారు ఆ పదవి నుంచి తప్పించింది. ఆయన స్థానంలో దిల్లీ జల్ బోర్డు మాజీ సీఈవో ఎ.కె.సింగ్ను నియమించింది. అయితే ఆ తర్వాత నుంచి ఆశిష్ అదృశ్యమయ్యారు. నూతన అధికారి నియామకానికి సంబంధించిన ఫైల్ను సమర్పించాలని సర్వీసెస్ శాఖా మంత్రి సౌరభ్ భరద్వాజ్.. గత గురువారం ఆశిష్కు సూచించారు. కానీ, అప్పటికే ఆయన ఎవరికీ చెప్పకుండా సెక్రటేరియట్ నుంచి వెళ్లిపోయారు. ఆ తర్వాత నుంచి ఆయన ఆచూకీ కన్పించట్లేదు. ఫోన్ కూడా స్విచ్చాఫ్ చేసినట్లు సౌరభ్ భరద్వాజ్ కార్యాలయం వెల్లడించింది.
బదిలీకి సంబంధించిన అధికారిక ఉత్తర్వులను ఆశిష్ మోరె (Ashish More) ఇంటికి పంపగా ఎలాంటి స్పందన రాలేదు. వాట్సప్, ఈ-మెయిల్కు పంపించినా ఆశిష్ నుంచి సమాధానం రాలేదు. దీంతో ఆయన ‘పారిపోయాడని’ ఆరోపించిన దిల్లీ ప్రభుత్వం తాజాగా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. 24 గంటల్లోగా తన స్పందన తెలియజేయాలని ఆదేశించింది. లేదంటే ఆదేశాలను ఉల్లంఘించినందుకు గానూ క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని ఆ అధికారిని హెచ్చరించింది.
కాగా.. ఈ బదిలీ వ్యవహారంపై ఇప్పటికే ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) సర్కారు సుప్రీంకోర్టును ఆశ్రయించింది. కోర్టు ఆదేశాలను కేంద్రం ధిక్కరిస్తోందని ఆరోపిస్తూ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ను స్వీకరించిన సీజేఐ జస్టిస్ డి.వై. చంద్రచూడ్.. ఈ కేసులో వాదనలు వినేందుకు వచ్చేవారం ధర్మాసనం ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.