‘అతడి తల ఫుట్బాల్లా వచ్చి నా ఛాతీపై పడింది’.. షాక్లో అస్సాం యువకుడు!
కోరమాండల్ బోగీలో (Coromandel Express) ప్రయాణిస్తున్న అస్సాంకు చెందిన యువకుడు ప్రమాదం జరిగిన వెంటనే బయటకు వచ్చేశాడు. అనంతరం దాన్ని మరో రైలు ఢీకొట్టడంతో అందులో ఉన్న మరో వ్యక్తి తల తెగి తనపై పడటంతో షాక్కు గురయ్యాడు.
గువహాటి: బాలేశ్వర్లో చోటుచేసుకున్న రైలు ప్రమాదానికి (Odisha rail accident) సంబంధించి ఒక్కో దీనగాథ వెలుగులోకి వస్తోంది. ఈ క్రమంలో కళ్లముందే జరిగిన ఘోర ప్రమాదంతో తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఓ అస్సాం యువకుడు.. జూన్ 2 నుంచి ఆహారం తినడమే మానేశాడట. కోరమాండల్ బోగీలో (Coromandel Express) నుంచి తప్పించుకొని బయటకు వచ్చిన వెంటనే.. అదే బోగీలో ఉన్న ఓ ప్రయాణికుడి తల తెగి ఫుట్బాల్లా ఎగిరి తనపై పడిందని వాపోయాడు. ఆ ఘటనతో షాక్కు గురైన ఆ యువకుడు ఇంకా తేరుకోలేదని వైద్యులు వెల్లడించారు.
‘ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది. మా రైలు పట్టాలు తప్పిందని అనుకున్నా. కిటికీ నుంచి బయటకు చూడగానే.. మా రైలు ఇంజిన్ గూడ్స్ రైలు మీద ఉండటాన్ని చూశా. వెంటనే అత్యవసర గ్లాసును పగలగొట్టి బోగీ బయటకు వచ్చేశా. మరో ఇద్దరు నాతోపాటే బయటకు వచ్చేశారు. మరికొన్ని క్షణాల్లోనే బెంగళూరు-హావ్డా ఎక్స్ప్రెస్ వచ్చి మా రైలును బలంగా ఢీకొట్టింది. దాంతో మా బోగీ మొత్తం నుజ్జునుజ్జయ్యింది. దాంతో అందులోని ఓ వ్యక్తి తల తెగిపోయి ఆ ఎమర్జెన్సీ కిటికీ నుంచి ఫుట్బాల్లా తిరుక్కుంటూ వచ్చి నా ఛాతీపై పడిపోయింది’ అని అస్సాం యువకుడు వెల్లడించాడు. ప్రస్తుతం గువహాటి మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న దాస్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు చెప్పారు. కానీ, రైలు ప్రమాదంతో షాక్నుంచి ఇంకా తేరుకోలేదని.. అతడికి కౌన్సిలింగ్ ఇస్తున్నామని చెప్పారు.
అస్సాంలోని సోనిత్పుర్ జిల్లాకు చెందిన రూపక్ దాస్.. పుదుచ్చేరిలోని ఓ ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. గర్భిణీ అయిన తన భార్యను స్వస్థలంలో విడిచిపెట్టి.. తిరిగి పుదుచ్చేరికి బయలుదేరాడు. అయితే, అతడు వెళ్లాల్సిన రైలు అందకపోవడంతో హావ్డా-చెన్నై కోరమాండల్లో టికెట్ బుక్ చేసుకున్నాడు. అనంతరం అతడు ప్రయాణిస్తోన్న రైలు ఘోర ప్రమాదానికి గురైనప్పటికీ.. దాస్ మాత్రం గాయాలతో బయటపడ్డాడు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?
-
గీత రచయిత పాటల హక్కు కోరితే ఏమవుతుంది?: ఇళయరాజా కేసులో హైకోర్టు ప్రశ్న
-
నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 22,350 దిగువకు నిఫ్టీ