Sharad Pawar: ఆస్పత్రిలో చేరిన రాజకీయ కురువృద్ధుడు శరద్ పవార్
రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad pawar) ఆస్పత్రిలో చేరారు. ఒంట్లో నలతగా ఉండటంతో చికిత్స కోసం ముంబయిలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చేరారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.
ముంబయి: రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్ పవార్(Sharad pawar) ఆస్పత్రిలో చేరారు. ఒంట్లో నలతగా ఉండటంతో చికిత్స కోసం ముంబయిలోని బ్రీచ్కాండీ ఆస్పత్రిలో చేరారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొద్దిరోజుల పాటు శరద్ పవార్ ఆస్పత్రిలోనే ఉంటారని.. ఆ తర్వాత నవంబర్ 3 నుంచి జరగబోయే పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే ఓ ప్రకటనలో వెల్లడించారు. ఒంట్లో అసౌకర్యంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకే ఆయన ఆస్పత్రిలో చేరారన్నారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంటారని.. నవంబర్ 2న డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పవార్ కోసం ఆస్పత్రి వద్ద గుమిగూడొద్దని ఎన్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, గతేడాది మార్చి నెలలో పొత్తికడుపులో నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చేరగా. ఆయనకు వైద్యులు గాల్ బ్లాడర్ శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని