Sharad Pawar: ఆస్పత్రిలో చేరిన రాజకీయ కురువృద్ధుడు శరద్‌ పవార్

రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad pawar) ఆస్పత్రిలో చేరారు. ఒంట్లో నలతగా ఉండటంతో చికిత్స కోసం ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి.

Published : 31 Oct 2022 17:47 IST

ముంబయి: రాజకీయ కురువృద్ధుడు, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌(Sharad pawar) ఆస్పత్రిలో చేరారు. ఒంట్లో నలతగా ఉండటంతో చికిత్స కోసం ముంబయిలోని బ్రీచ్‌కాండీ ఆస్పత్రిలో చేరారని పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. కొద్దిరోజుల పాటు శరద్‌ పవార్‌ ఆస్పత్రిలోనే ఉంటారని.. ఆ తర్వాత నవంబర్‌ 3 నుంచి జరగబోయే పార్టీ సమావేశాల్లో పాల్గొంటారని ఎన్సీపీ ప్రధాన కార్యదర్శి శివాజీరావు గార్జే ఓ ప్రకటనలో వెల్లడించారు. ఒంట్లో అసౌకర్యంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకే ఆయన ఆస్పత్రిలో చేరారన్నారు. మూడు రోజుల పాటు ఆస్పత్రిలోనే ఉంటారని.. నవంబర్‌ 2న డిశ్చార్జి అయ్యే అవకాశం ఉందని తెలిపారు. పవార్‌ కోసం ఆస్పత్రి వద్ద గుమిగూడొద్దని ఎన్సీపీ పార్టీ నేతలు, కార్యకర్తలకు ఆ పార్టీ విజ్ఞప్తి చేసింది. మరోవైపు, గతేడాది మార్చి నెలలో పొత్తికడుపులో నొప్పి కారణంగా ఇదే ఆస్పత్రిలో చేరగా. ఆయనకు వైద్యులు గాల్‌ బ్లాడర్‌ శస్త్రచికిత్స చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని