MLAs Dance: మహారాష్ట్ర సీఎంగా శిందే.. ఎగిరి గంతులేసిన రెబల్ ఎమ్మెల్యేలు
తమ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తను మీడియాలో చూసిన శిందే వర్గం ఎమ్మెల్యేలు సంతోషంతో ఉబ్బితబ్బిపోయారు.
వైరల్గా మారిన వీడియోలు
ముంబయి: మహారాష్ట్రలో (Maharashtra) నెలకొన్న రాజకీయ అస్థిరతకు అనూహ్య పరిణామాలతో చివరకు ముగింపు పడింది. ఏక్నాథ్ శిందే (Eknath Shinde)కు పూర్తి మద్దతు ఇవ్వడంతోపాటు ఆయనే కొత్త ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడతారని భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్ ప్రకటించడం రెబల్ ఎమ్మెల్యేలతో పాటు అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. తమ నేత ముఖ్యమంత్రి కాబోతున్నారనే వార్తను మీడియాలో చూసిన శిందే వర్గం ఎమ్మెల్యేలు సంతోషంతో ఉబ్బితబ్బిపోయారు. గోవా హోటల్లో ఉన్న రెబల్ నేతలంతా ఈ వార్త విని ఎగిరి గెంతులేశారు. కొంతమంది ఎమ్మెల్యేలు ఏకంగా టేబుళ్లపైకి ఎక్కి నృత్యాలు చేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి.
శివసేన నాయకత్వంపై తిరుగుబాటు చేసిన ఎమ్మెల్యేలు తొలుత గుజరాత్, అక్కడనుంచి అస్సాం హోటళ్లలో క్యాంపు వేశారు. తొమ్మిది రోజుల అనంతరం.. తాజాగా బలపరీక్ష నిరూపించుకోవాలని గవర్నర్ ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో వారంతా ముంబై రావాలని నిశ్చయించుకున్నారు. దీంతో తమ క్యాంపును గుహవాటి నుంచి గోవాలోని ఓ హోటల్కు మార్చారు. అదే సమయంలో మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే రాజీనామా చేయడంతో రాజకీయ పరిణామాలు పూర్తిగా మారిపోయాయి. రెబల్ నేతలు గోవాలోనే ఉండిపోవడంతో వారికి నాయకత్వం వహిస్తోన్న ఏక్నాథ్ శిందే మాత్రం గురువారం మధ్యాహ్నం ముంబయికి చేరుకున్నారు. తొలుత భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్తో చర్చించిన అనంతరం గవర్నర్ను కలిసి నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. అదే సమయంలో ముఖ్యమంత్రిగా ఏక్నాథ్ శిందేనే ప్రమాణస్వీకారం చేస్తారని ఫడణవీస్ ప్రకటించడంతో రెబల్ ఎమ్మెల్యేలు ఒక్కసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. సీఎంగా ఫడణవీస్.. ఉపముఖ్యమంత్రిగా శిందే ఉంటారనే ఊహాగాలు వచ్చినప్పటికీ.. చివరకు శిందేనే సీఎం కావడంతో రెబల్ ఎమ్మెల్యేలు సంతోషంతో ఎగిరి గంతులేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
భారత నేవీకి చెందిన రిమోట్లీ పైలెటెడ్ ఎయిర్క్రాఫ్ట్ (RPA) కొచ్చిలోని ఐఎన్ఎస్ గరుడ బేస్ వద్ద కూలిపోయింది. -
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
బెంగళూరులో రోజుకు 2600 ఎంఎల్డీ (మిలియన్ లీటర్స్ పర్ డే) నీటి అవసరం ఉండగా.. దాదాపు 500 ఎంఎల్డీ కొరత ఉందని కర్ణాటక సీఎం సిద్ధరామయ్య వెల్లడించారు. -
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
కోల్కతాలో భవనం కుప్పకూలిన ఘటనలో 9 మంది మృతి చెందారు. 17 మందికి గాయాలు అయ్యాయి.
తాజా వార్తలు (Latest News)
-
Indian Navy: కొచ్చిలో కుప్పకూలిన నిఘా ఎయిర్క్రాఫ్ట్
-
Munitions: ఉత్తర కొరియా నుంచి రష్యాకు.. ఏడు వేల కంటెయినర్ల ఆయుధాలు!
-
Bengaluru: రోజుకు 50 కోట్ల లీటర్ల నీటి కొరత.. బెంగళూరు కష్టాలపై కర్ణాటక సీఎం
-
Kolkata: భవనం కుప్పకూలిన ఘటనలో తొమ్మిదికి చేరిన మృతులు
-
WhatsApp: వాట్సప్ పేమెంట్స్ ఇక మరింత సులువుగా.. ఇక చాట్ లిస్ట్లోనే
-
AAP: పదేళ్లలో దిల్లీకి ఏం చేశారు?.. భాజపా ఎంపీలకు ఆప్ ప్రశ్న!