US NEWS: పెంటగాన్‌లో కాల్పుల కలకలం

అమెరికాలోని పెంటగాన్‌ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్‌లోని మెట్రో బస్‌స్టేషన్‌ వద్ద..

Updated : 03 Aug 2021 22:15 IST

యూఎస్‌: అమెరికాలోని పెంటగాన్‌ సమీపంలో కాల్పులు కలకలం రేపాయి. వాషింగ్టన్‌లోని మెట్రో బస్‌స్టేషన్‌ వద్ద దుండగులు పలుమార్లు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడినట్టు సమాచారం. దీంతో  ట్రాఫిక్‌ను పెంటగాన్‌ నగరం వైపు మళ్లించారు. అమెరికా మిలటరీ కార్యాలయం సమీపంలో ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.దీంతో అప్రమత్తమైన అధికారులు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా లాక్‌డౌన్‌ విధించారు. పోలీసు బలగాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని