Sidhu Moose Wala: వారి పేర్లు ఎందుకు బయటకు వచ్చాయి?.. నివేదిక కోరిన పంజాబ్ హరియాణా హైకోర్టు!
పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు రాజకీయంగా దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. పోలీసు భద్రతను కుదించడంతోనే ఈ ఘటన జరిగినట్లు ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే...
చండీగఢ్: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్య కేసు రాజకీయంగా దుమారం రేపుతోన్న విషయం తెలిసిందే. పోలీసు భద్రతను కుదించడంతోనే ఈ ఘటన జరిగినట్లు ఆప్ ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే.. భద్రతను ఉపసంహరించిన, కుదించిన వారి పేర్లు ఎందుకు బహిరంగంగా బయటకు వచ్చాయో చెప్పాలంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు.. రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. భద్రత తగ్గింపుపై ఏ ప్రాతిపదికన నిర్ణయం తీసుకున్నారో వివరించాలని జస్టిస్ రాజ్ మోహన్ సింగ్ ధర్మాసనం ఆదేశించింది. జూన్ 2లోగా సీల్డ్ కవర్లో పూర్తి నివేదిక సమర్పించాలని తెలిపింది.
తన భద్రతను జడ్- కేటగిరీ నుంచి తగ్గిస్తూ జారీ చేసిన మే 11 నాటి ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ పంజాబ్ మాజీ ఉప ముఖ్యమంత్రి ఓపీ సోనీ దాఖలు చేసిన పిటిషన్ను హైకోర్టు ప్రస్తుతం విచారిస్తోంది. సోనీ సహా 184 మంది మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలకు భద్రతను ఉపసంహరించారని ఆయన తరఫు న్యాయవాది వాదించారు. ఎవరి ప్రాణాలకు ముప్పు ఉందో చూడకుండా.. ఎంపిక విధానంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ క్రమంలోనే.. ఎవరి భద్రతను కుదించారో తదితర సున్నిత వివరాలను ప్రచారం చేయరాదని భారత అదనపు సొలిసిటర్ జనరల్ సత్యపాల్ జైన్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీంతో.. ధర్మాసనం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది.
అంతకుముందు.. ఆప్ ప్రభుత్వం 424 మంది భద్రతను తగ్గించే నిర్ణయాన్ని ప్రకటిస్తూ.. తన అధికారిక ట్విటర్ ఖాతాలో సంబంధిత పోస్టర్ను షేర్ చేసింది. అందులో మూసేవాలా పేరును పొందుపర్చడం గమనార్హం. పోలీసు భద్రతను తగ్గించిన మరుసటి రోజే మూసేవాలా హత్యకు గురైన విషయం తెలిసిందే. దీంతో ప్రతిపక్షాలు రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడుతున్నాయి. ఈ హత్య ఘటనపై విచారణకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం భగవంత్ మాన్ ప్రకటించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్