Sidhu Moose Wala: ది లాస్ట్ రైడ్.. మరణాన్ని ముందుగానే ఊహించి..?
యువతలో క్రేజ్ సొంతం చేసుకున్న సిద్ధూ మూసేవాలా తన మరణాన్ని ముందుగానే ఊహించారని అభిమానులు పేర్కొంటున్నారు.
చివరి పాటను గుర్తుచేసుకుంటున్న అభిమానులు
దిల్లీ: పంజాబీ గాయకుడు, కాంగ్రెస్ నేత సిద్ధూ మూసేవాలా హత్యకు గురికావడం ఆయన అభిమానులను ఎంతగానో కలచివేస్తోంది. అయితే, యువతలో క్రేజ్ సొంతం చేసుకున్న సిద్ధూ మూసేవాలా తన మరణాన్ని ముందుగానే ఊహించారని అభిమానులు పేర్కొంటున్నారు. ఈ సందర్భంగా ఆయన తీసిన చివరి పాటను గుర్తు చేసుకుంటున్నారు. ఇటీవల విడుదల చేసిన ఓ పాటలో మరణం గురించి మూసేవాలా చెప్పిన మాటలను గుర్తుచేసుకుంటూ తన సొంత మరణాన్ని మూసేవాలా ముందుగానే ఊహించుకొన్నారంటూ తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గాయకుడి నుంచి రాజకీయ నాయకుడిగా ఎదిగిన మూసేవాలా ‘ది లాస్ట్ రైడ్’ (The Last Ride) పేరుతో గతనెల ఓ పాటను విడుదల చేశారు. ఇదే ఆయన చివరిపాట కావడం గమనార్హం. అయితే, అందులో మరణం గురించి ప్రస్తావించడాన్ని గుర్తుచేసుకుంటున్న అభిమానులు.. ఇదే ‘మీ అంతిమయాత్ర’ అవుతుందని అనుకోలేదని వాపోతున్నారు. మా సోదరుడు ఆయన మరణాన్ని ముందుగానే ఊహించారు అని ఓ అభిమాని పేర్కొన్నాడు. ఈ పాట ఆయనకే అంకితం చేసుకున్నారు.. కానీ, ఆయన త్వరలోనే చనిపోతారన్న విషయం ఆయనకు తెలియదు. అయినా ఆయన మా హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతాడంటూ మరో అభిమాని చెప్పుకొచ్చాడు.
మరోవైపు తన పాటల్లో ఎక్కువగా గన్ కల్చర్, గ్యాంగ్స్టర్లు వంటి హింసను ప్రేరేపించేవి చూపించే వివాదాస్పద గాయకుడిగా నిలిచాడు. పంజ్ గోలియన్ (Five Bullets) అనే పాటలోనూ ఇటువంటివి చూపించారనే అభియోగాలతో ఆయనపై ఆయుధాల చట్టం కింద కేసు నమోదయ్యింది. మరోవైపు కరోనా లాక్డౌన్ సమయంలోనూ ఫైరింగ్ రేంజ్లో ఏకే-47 రైఫిల్ని ఉపయోగించినందుకు ఆయనపై కేసు నమోదైంది. దిల్లీలో జరిగిన రైతు వ్యతిరేక ఉద్యమంలోనూ మూసేవాలా పాల్గొన్నారు. లెజెండ్, డెవిల్, జస్ట్ లిజన్, బ్రౌన్ బాయ్స్, హత్యార్, టిబేయాన్ దా పుట్, జట్ ద ముఖాబులా వంటి పంజాబీ పాటలు మూసేవాలాకు ఎంతోపేరు తెచ్చిపెట్టాయి.
ఇదిలాఉంటే, కాంగ్రెస్ నేత మూసేవాలా ఇద్దరు స్నేహితులతో కలిసి మాన్సా జిల్లాలోని గ్రామానికి వెళ్తుండగా.. మార్గమధ్యలో గుర్తుతెలియని వ్యక్తులు ఆయన్ను తుపాకీతో కాల్చిచంపారు. ఈ ఘటనలో మిగతా ఇద్దరికి గాయాలయ్యాయి. వీఐపీ సంస్కృతికి తెరదించుతూ రాష్ట్రంలోని ప్రముఖులకు కేటాయించిన పోలీసు భద్రతను ప్రభుత్వం ఉపసంహరించిన మరుసటి రోజే ఈ ఘటన జరగడం గమనార్హం. అయితే, ఆమ్ఆద్మీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై విపక్ష పార్టీలు మండిపడుతున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థులు మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?
-
మహబూబ్నగర్ ఎంపీ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి నామినేషన్.. ర్యాలీలో పాల్గొన్న సీఎం రేవంత్
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM