Women Employees: ఏడాదిపాటు మాతృత్వ సెలవులు.. మహిళా ఉద్యోగులపై వరాల జల్లు..!
ప్రభుత్వ మహిళా ఉద్యోగులు ప్రసవిస్తే చిన్నారుల బాగోగులను చూసేందుకు ఓ ఆయాను నియమించాలని సిక్కిం ప్రభుత్వం నిర్ణయించింది. అంతేకాకుండా మాతృత్వపు సెలవులను ఏడాదికి పెంచినట్లు ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ వెల్లడించారు.
గాంగ్టక్: సంతానోత్పత్తి (Fertility) రేటును వృద్ధి చేసేందుకు సిక్కిం ప్రభుత్వం (Sikkim Govt) చర్యలు తీసుకుంటోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ మహిళా ఉద్యోగులపై (Govt Women Employees) వరాల జల్లు కురిపించింది. మహిళా ఉద్యోగులకు మాతృత్వపు సెలవులను (Maternity leaves) ఏడాదికి పెంచుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రేమ్సింగ్ తమాంగ్ (Prem Singh Tamang) వెల్లడించారు. అంతేకాకుండా మహిళా ఉద్యోగులు ప్రసవిస్తే ఏడాది పాటు చిన్నారుల బాగోగులను చూసుకునేందుకు ఇంటి వద్ద ఓ ఆయాను కూడా ప్రభుత్వమే నియమిస్తుందని చెప్పారు. దీని కోసం 40 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సున్న మహిళలను రిక్రూట్ చేయనున్నట్లు తెలిపారు. వీరికి నెలకు రూ.10వేల భృతిని ప్రభుత్వమే చెల్లిస్తుందని, ఉద్యోగులు ఎలాంటి డబ్బులు ఇవ్వాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. ‘‘ రాష్ట్రంలో సంతానోత్పత్తి రేటు అనూహ్యంగా పడిపోతోంది. దీనిని పునరుద్ధరించడానికి అన్ని చర్యలు చేపట్టాల్సిందే’’ అని సీఎం స్పష్టం చేశారు.
అంతేకాకుండా ఒకరి కంటే ఎక్కువ మంది పిల్లలకు జన్మనిచ్చే మహిళా ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు కూడా ఇవ్వనున్నట్లు సీఎం ప్రేమ్సింగ్ వెల్లడించారు. దీంతోపాటు సాధారణ ప్రజలు కూడా ఎక్కువ మంది పిల్లల్ని కంటే..ఆరోగ్య, మహిళా శిశు సంక్షేమ శాఖ నుంచి ఆర్థిక సాయం చేస్తామని చెప్పారు. మరోవైపు సంతాన లేమితో బాధపడుతున్న వారికోసం ప్రభుత్వమే ఐవీఎఫ్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని అన్నారు. వాటి ద్వారా సంతానం పొందిన దంపతులకు రూ.3 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 38 మంది మహిళలు ఐవీఎఫ్ ప్రక్రియ ద్వారా సాంతానం పొందినట్లు సీఎం తెలిపారు. సిక్కింలో ప్రస్తుత జనాభా 7 లక్షల కంటే తక్కువగానే ఉంది. ఇందులో 80 శాతం మంది స్థానికులే. సంతానోత్పత్తి రేటు 1.1శాతంగా ఉంది. ఈ నేపథ్యంలో జనాభాను వృద్ధి చేసుకునేందుకు అక్కడి ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.