Vaccines: సింగిల్ డోసుతో 60శాతం రక్షణ!
ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు ఒక్క డోసుతోనే 60శాతం రక్షణ కల్పిస్తున్నట్లు లండన్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో తేలింది.
లాన్సెట్ జర్నల్లో అధ్యయన ఫలితాలు
వాషింగ్టన్: యావత్ ప్రపంచాన్ని వణికిస్తోన్న కరోనా వైరస్ను ఎదుర్కొనే వ్యాక్సిన్లు అందుబాటులోకి రావడంతో ప్రపంచ దేశాలు ఊపిరి పీల్చుకున్నాయి. అయితే, వైరస్ను నిరోధించడంలో ఈ వ్యాక్సిన్లు ఏమేరకు సమర్థత చూపిస్తున్నాయో తెలుసుకునేందుకు అధ్యయనాలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇందులో భాగంగా లండన్ పరిశోధకులు జరిపిన అధ్యయనంలో.. ఫైజర్, ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్లు ఒక్క డోసుతోనే 60శాతం రక్షణ కల్పిస్తున్నట్లు తేలింది. ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ ‘ది లాన్సెట్’లో ఈ అధ్యయన నివేదిక ప్రచురితమైంది.
ప్రపంచవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్లు అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో వాటి వాస్తవ సామర్థ్యం, రోగనిరోధకత, వైరస్ వ్యాప్తి నియంత్రణలో ఆయా టీకాల ప్రభావాన్ని తెలుసుకునేందుకు యూనివర్సిటీ కాలేజ్ లండన్ నిపుణులు అధ్యయనం చేపట్టారు. ఇందులో భాగంగా బ్రిటన్ సంరక్షణ కేంద్రాల్లో ఉన్న 65 ఏళ్లకు పైబడిన 10వేల మంది వృద్ధుల సమాచారాన్ని పరిగణనలోకి తీసుకున్నారు. వీరిలో 9వేల మంది (88శాతం) ఫైజర్ లేదా ఆస్ట్రాజెనికా వ్యాక్సిన్ను కనీసం ఒకడోసు తీసుకున్నారు. వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత 0-6రోజులు, 7-13రోజులు, 14 నుంచి 20రోజులు.. ఇలా పలు దఫాలుగా వారిలో ఇన్ఫెక్షన్ మూలాలను తెలుసుకునేందుకు పరీక్షలు నిర్వహించారు. ఈ సమాచారాన్ని వ్యాక్సిన్ తీసుకోనివారి సమాచారంతో పోల్చి చూశారు. వ్యాక్సిన్ తీసుకున్న 28రోజుల తర్వాత వారిలో వైరస్ బారినపడే ముప్పు 56శాతం తగ్గగా, 35-48 రోజుల తర్వాత ఈ ముప్పు 60 శాతానికి తగ్గినట్లు నిపుణులు గుర్తించారు.
డోసుల మధ్య వ్యవధిని పెంచవచ్చు
ఫైజర్ లేదా ఆస్ట్రాజెనికా టీకా సింగిల్ డోసు తీసుకున్న వృద్ధులు వైరస్ బారినపడే ప్రమాదం తక్కువగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో తేలిందని పరిశోధకులు స్పష్టం చేశారు. ముఖ్యంగా వ్యాక్సిన్ తొలిడోసు తీసుకున్నాక 4నుంచి 7వారాల వరకు రక్షణ ఉంటుందని చెప్పారు. రెండు డోసుల మధ్య గడువును మూడువారాల కంటే ఎక్కువగా పెంచేందుకు తాజా ఫలితాలను రుజువుగా చూపవచ్చన్నారు. అంతేకాకుండా వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలోనూ వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తోందని ఈ ఫలితాలు వెల్లడిస్తున్నాయని పరిశోధకులు పేర్కొన్నారు. అయితే, వైరస్ వ్యాప్తిని నియంత్రించడంలో రెండో డోసు ప్రభావాన్ని అంచనా వేయడానికి మరిన్ని అధ్యయనాలు జరగాల్సి ఉందన్నారు. సుదీర్ఘ కాలం సంరక్షణ కేంద్రాల్లో ఉండే వృద్ధులకు వ్యాక్సిన్ అందించే విధానంలో మార్పుల కోసం తాజా అధ్యయన ఫలితాలు దోహదం చేస్తాయని కూడా పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
ఇదిలాఉంటే, వైరస్ వ్యాప్తి అధికంగా ఉన్నట్లు భావిస్తోన్న డెల్టా, కప్పా వేరియంట్లపై ఆస్ట్రాజెనికా, ఫైజర్ టీకాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ఆక్స్ఫర్డ్ నిపుణుల అధ్యయనంలో తేలింది. అంతేకాకుండా ఈ రెండు టీకాలను మిశ్రమ పద్ధతిలో ఇచ్చి ప్రయోగాలు జరుపుతున్నారు. ఇక సింగిల్ డోసు విధానంలో అందుబాటులోకి వచ్చిన జాన్సన్ అండ్ జాన్సన్ టీకా 66శాతానికి పైగా సమర్థత చూపించగా, తీవ్రమైన కేసుల్లో 76శాతం ప్రభావశీలత చూపినట్లు తేలింది. కొవిడ్ ఇన్ఫెక్షన్తో ఆస్పత్రిలో చేరే ప్రమాదం నుంచి ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన టీకాలన్నీ 100శాతం రక్షణ కల్పిస్తున్నట్లు అంతర్జాతీయ నివేదికలు వెల్లడిస్తున్నాయి.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్, బెంగళూరు మ్యాచ్.. మెట్రో రైళ్ల సమయం పొడిగింపు
-
రూ.8500కే మూడు రోజుల శిర్డీ టూర్.. ఐఆర్సీటీసీ ప్యాకేజీ వివరాలు ఇవీ..
-
కెమెరామెన్కు సారీ చెప్పిన పంత్.. ఎందుకో తెలుసా?
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీప్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో