జేఈఈ, నీట్ నిర్వహణపై సుప్రీంలో రివ్యూ పిటిషన్
దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్), సాంకేతిక విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ-మెయిన్)లను వాయిదా వేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది...........
వాయిదా వేయాల్సిందేనన్న ఆరు రాష్ట్రాల మంత్రులు
దిల్లీ: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సుల జాతీయ అర్హత-ప్రవేశ పరీక్ష (నీట్), సాంకేతిక విద్యా కోర్సుల ఉమ్మడి ప్రవేశ పరీక్ష (జేఈఈ-మెయిన్)లను వాయిదా వేయడం కుదరదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై శుక్రవారం రివ్యూ పిటిషన్ దాఖలైంది. ఈ మేరకు ఆరు భాజపాయేతరపాలిత రాష్ట్రాలకు చెందిన మంత్రులు కోర్టును ఆశ్రయించారు. కొవిడ్ మహమ్మారి విజృంభణను పరిగణనలోకి తీసుకొని తీర్పు సమీక్షించాలని కోరారు. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, పంజాబ్, మహారాష్ట్రకు చెందిన మంత్రులు పిటిషన్ వేసిన వారిలో ఉన్నారు.
విలువైన విద్యా సంవత్సరాన్ని విద్యార్థులు కోల్పోకూడదని వ్యాఖ్యానించిన సుప్రీకోర్టు నీట్, జేఈఈ పరీక్షల్ని వాయిదా వేయలేమంటూ ఆగస్టు 17న తీర్పు వెలువరించింది. దీంతో పరీక్షల నిర్వహణకు నేషనల్ టెస్టింగ్ ఏజేన్సీ(ఎన్టీఏ) అన్ని ఏర్పాట్లు చేస్తోంది. షెడ్యూలు ప్రకారం.. జేఈఈ (మెయిన్) సెప్టెంబర్ 1-6 తేదీల మధ్య; నీట్ సెప్టెంబర్ 13న జరుగనున్నాయి. ఇప్పటికే జేఈఈ అభ్యర్థులకు అడ్మిట్ కార్డులు కూడా జారీ అయ్యాయి.
మరోవైపు ఈ ప్రవేశ పరీక్షల్ని వాయిదా వేయాలంటూ దేశవ్యాప్తంగా కాంగ్రెస్ సహా పలు ప్రతిపక్ష పార్టీలు ఆందోళన చేపడుతున్నాయి. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ భాజపాయేతర పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించారు. ఎట్టిపరిస్థితుల్లో విద్యార్థుల ప్రాణాలకు ముప్పు వాటిల్లకుండా చూడాలని నిర్ణయించారు. ఆ మేరకు నేడు దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లో ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు నాయకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. కేంద్రం విద్యార్థుల ఆవేదనను అర్థం చేసుకునే వరకు పరీక్షల నిర్వహణకు వ్యతిరేకంగా గళం వినిపించాల్సిందేనని పిలుపునిచ్చారు. ప్రతిఒక్కరూ విద్యార్థులకు అండగా ఉండాలని కోరారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
మాజీ ప్రధానులపై మోదీ ఆరోపణలు చేయడంపై ఎన్సీపీ (శరద్చంద్ర పవార్) అధినేత శరద్ పవార్ మండిపడ్డారు. -
‘పచ్చని’ పోలింగ్ బూత్.. వినూత్న ప్రయత్నానికి ఓటర్లు ఫిదా!
ఎన్నికల వేళ.. ఎండలో నిలబడి ఓటు వేయాలంటే ఎంతో ఇబ్బందిగా ఉంటుంది. ఆహ్లాదకర వాతావరణంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు తమిళనాడు అధికార యంత్రాంగం చేసిన వినూత్న ఆలోచన ఆకర్షిస్తోంది. -
8 ఏళ్ల జీతం 4 వారాల్లో తిరిగివ్వాలా?.. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తాం: మమత
Mamata Banerjee on HC order: ఉపాధ్యాయ నియామక పరీక్ష రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సవాల్ చేస్తామని మమతా బెనర్జీ పేర్కొన్నారు. -
డీప్ఫేక్ వీడియోపై రణ్వీర్ సింగ్ పోలీస్ కేసు
తాను ఓ రాజకీయ పార్టీ తరపున ప్రచారం చేస్తున్నట్లుగా ఉన్న డీప్ఫేక్ వీడియోపై బాలీవుడ్ నటుడు రణ్వీర్ సింగ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
కోర్సు ఎందుకు.. హైస్కూల్ తర్వాతే లా ప్రాక్టీస్ చేయండి: సుప్రీం ఆగ్రహం
Supreme Court: లా కోర్సును మూడేళ్లకు తగ్గించాలన్న పిటిషన్పై సుప్రీంకోర్టు మండిపడింది. అప్పుడు కోర్సులు ఎందుకని.. నేరుగా హైస్కూల్ తర్వాతే ప్రాక్టీస్ చేయండంటూ పిటిషనర్పై ఆగ్రహం వ్యక్తం చేసింది. -
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
Supreme Court: అత్యాచారానికి గురైన ఓ బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. -
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?
Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..! -
కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలి
మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్ కార్యకర్తలు తిహాడ్ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు
గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేణ్ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. -
భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్
పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ
సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. -
సీఆర్పీఎఫ్ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా రాయ్కోట్ వద్ద 32 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. -
అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!
అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. -
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ అరెస్టు
త్తీస్గఢ్లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది. -
వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లిన న్యూస్ రీడర్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. -
మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలు
సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. -
ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ చేయొచ్చు
పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(నెట్)కు హాజరుకావచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
పవన్ తాడేపల్లిగూడెం, ఉంగుటూరు సభలు వాయిదా
-
బాబాయినే హతమార్చిన వారు.. మీరు వేలు కోసుకుంటే స్పందిస్తారా?: లోకేశ్
-
‘మామయ్య కుటుంబాన్ని గ్యాంగ్స్టర్లు చంపేశారు’.. ఐపీఎల్ నిష్క్రమణపై రైనా స్పష్టత
-
నాకు కారు లేదు.. అమ్మేశా : విశాల్
-
‘మరో పుతిన్ తయారవుతున్నారు’.. మోదీపై శరద్ పవార్ విమర్శలు
-
నిఘా వైఫల్యం ఎఫెక్ట్..! ఇజ్రాయెల్ మిలటరీ ఇంటెలిజెన్స్ చీఫ్ రాజీనామా