బెంగాల్‌లో కొనసాగుతున్న ఆరో దశ పోలింగ్‌

పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆరోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో భాగంగా మొత్తం 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది.

Published : 22 Apr 2021 08:23 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా గురువారం ఆరోదశ పోలింగ్‌ కొనసాగుతోంది. ఈ దశలో భాగంగా మొత్తం 43 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరుగుతోంది. 43 స్థానాల పరిధిలో మొత్తం 1.03 కోట్ల మంది ఓటర్లు ఉన్నారు. ఉదయం ఏడు గంటలకు పోలింగ్‌ ప్రారంభం కాగా, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల వద్ద ఇప్పటికే బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కేంద్ర బలగాలతో పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. మరోవైపు, కరోనా ఉద్ధృతి నేపథ్యంలో ఓటర్లు వైరస్‌ బారిన పడకుండా జాగ్రత్త చర్యలు చేపట్టారు.  ఈ దశలో మొత్తం 306 మంది అభ్యర్థుల భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తం కానుంది. 

ప్రతిఒక్కరూ ఓటు వేయాలి: మోదీ
బెంగాల్‌లో ఆరోదశ పోలింగ్‌ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ట్వీట్‌ చేశారు ‘ఈ రోజు బెంగాల్‌ అసెంబ్లీకి ఆరో దశ ఎన్నికల పోలింగ్‌ జరుగుతోంది. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతున్నా’ అని కోరారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు