Smriti Irani: అప్పుడు అవినీతి అంటే ద్రోహం అని.. ఇప్పుడు మీ మంత్రికి క్లీన్చిట్ ఏంటి..?
దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు విషయంలో భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పించుకుంటున్నాయి.
కేజ్రీవాల్పై ప్రశ్నలు సంధించిన స్మృతి ఇరానీ
దిల్లీ: దిల్లీ ఆరోగ్యశాఖ మంత్రి సత్యేందర్ జైన్ అరెస్టు విషయంలో భాజపా, ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) విమర్శలు గుప్పించుకుంటున్నాయి. దిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్.. తన మంత్రికి క్లీన్చిట్ ఇవ్వడాన్ని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ దుయ్యబట్టారు. ఇది రాజకీయ దురుద్దేశంతో పెట్టిన నకిలీ కేసుగా కేజ్రీవాల్ అభివర్ణించడాన్ని తప్పుపట్టారు. ముఖ్యమంత్రి తనను తాను న్యాయమూర్తిగా భావిస్తున్నారన్నారు. ఈ సందర్భంగా మీడియా వేదికగా పలు ప్రశ్నలను సంధించారు. అవినీతి అంటే దేశానికి ద్రోహం చేయడమేనంటూ గతంలో కేజ్రీవాల్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. ‘కేజ్రీవాల్జీ.. మీరు ఒక దేశద్రోహికి సహకరిస్తున్నారా..? ఇటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా కొనసాగాలా..?’ అంటూ ప్రశ్నించారు.
సత్యేందర్కు పద్మ విభూషణ్ ఇవ్వాలి: కేజ్రీవాల్
మరోపక్క కేజ్రీవాల్ తన మంత్రి సత్యేందర్ జైన్కు మద్దతుగా నిలిచారు. ఆయన నిర్దోషిగా బయటకు వస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమ మంత్రి చేసిన కృషికి పద్మ విభూషణ్ ఇవ్వాలని దిల్లీ ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు. ఆయనో దేశభక్తుడని, దేశం ఆయన పట్ల గర్వపడాలన్నారు. దిల్లీకి ఆయన మొహల్లా క్లినిక్లు ఇచ్చారని తెలిపారు. వాటి గురించి తెలుసుకొనేందుకు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఆసక్తిగా ముందుకు వస్తున్నాయన్నారు. ‘ఆయనకు పద్మవిభూషణ్ ఇవ్వాలి. దర్యాప్తు సంస్థలను ఆయనపై విచారణ జరుపుకోనివ్వండి. సీబీఐ ఇప్పటికే ఆయనపై కేసుల్ని క్లియర్ చేసింది. ఈడీ కూడా అదే చేస్తుంది’ అని కేజ్రీవాల్ జోస్యం చెప్పారు.
మనీలాండరింగ్ కేసులో సోమవారం సత్యేందర్ జైన్ను ఈడీ అరెస్టు చేసింది. 2015-16 సమయంలో హవాలా నెట్వర్క్ ద్వారా ఆయన కంపెనీలకు.. షెల్ కంపెనీల నుంచి సుమారు రూ.4.81 కోట్ల వరకు ముట్టినట్లు ఈడీ తన దర్యాప్తులో ఆరోపించింది. సీబీఐ నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ.. ఈ హవాలా కేసు దర్యాప్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే దాదాపు రెండు నెలల క్రితం సత్యేందర్, ఆయన కుటుంబానికి చెందిన రూ.4.81 కోట్ల విలువైన ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ.. తాజాగా ఆయన్ను అదుపులోకి తీసుకొంది. ఈ కేసులో తదుపరి విచారణ నిమిత్తం జూన్ 9 వరకు ఆయన కస్టడీలో ఉండాల్సి ఉంది. కాగా, త్వరలో తమ మంత్రి జైన్ను ఈడీ అరెస్ట్ చేసే అవకాశం ఉందని పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.