Mukesh Ambanis driver: అంబానీ డ్రైవర్ జీతం.. తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!
ప్రముఖ వ్యాపారవేత్త ముకేశ్ అంబానీ(Mukesh Ambani) డ్రైవర్ జీతం ప్రస్తుతం వైరల్గా మారింది. దానికి సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది.
ముంబయి: సెలబ్రిటీ.. ఈ పదానికున్న ఆకర్షణే వేరు. సెలబ్రిటీల లైఫ్స్టైల్తో పాటు వారి దగ్గర పనిచేసేవారు అప్పుడప్పుడు వైరల్ అవుతుంటారు. తాజాగా అపరకుబేరుడు ముకేశ్ అంబానీ(Mukesh Ambani) వ్యక్తిగత డ్రైవర్ వార్తల్లో నిలిచారు. అతడి జీతం గురించిన వివరాలతో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న వీడియోపై వార్తా కథానాలు వెలువడ్డాయి.
2017లో ముకేశ్ అంబానీ డ్రైవర్ జీతం నెలకు రెండు లక్షల రూపాయలని దానిని బట్టి తెలుస్తోంది. అంటే ఏడాదికి రూ.24 లక్షలు. బహుళజాతి సంస్థల్లో పనిచేసే వృత్తి నిపుణులకు కూడా ఈరోజుల్లో ఈ స్థాయి జీతం లభించడం లేదు. ఐదేళ్ల క్రితమే రూ.2 లక్షలుంటే.. 2023లో ఇంకా ఎంత పెరిగి ఉంటుందో. అది ఎంతనేదానిపై స్పష్టమైన వివరాలు అందుబాటులో లేవు.
ప్రపంచకుబేరుడు ఇంట్లో పనిచేస్తున్నారంటే.. వారికి పనిలో ఎంతో నైపుణ్యం ఉండాల్సిందే. అంబానీ(Mukesh Ambani) డ్రైవర్లను ఓ ప్రైవేటు కాంట్రాక్టు సంస్థ ద్వారా నియమించుకున్నారని ఆ వార్తా కథనాలు పేర్కొన్నాయి. లగ్జరీ, బుల్లెట్ ప్రూఫ్ కార్లను ఎలావాడాలి..? అని ఆ కాంట్రాక్టు సంస్థలు శిక్షణ ఇస్తుంటాయి. ఏ తరహా రోడ్లపైన అయినా, ఎలాంటి అవాంఛనీయ పరిస్థితుల మధ్య అయినా వాహనాన్ని నడిపేలా వీరికి ట్రైనింగ్ ఇస్తారు. డ్రైవర్లతో పాటు వంటమనుషులు, గార్డ్స్, ఇతర సిబ్బందికి ప్రోత్సాహకాలతో పాటు ఇన్సూరెన్స్ కూడా ఉంటుందని ఆ కథనాలు వెల్లడించాయి.
ఇదే తరహాలో ఇదివరకు సినిమా సెలబ్రిటీల మేనేజర్లు, బాడీ గార్డులు, నానీ(ఆయా)ల జీతాలు బయటకు వచ్చాయి. అక్షయ్ కుమార్, అమితాబ్ బచ్చన్, సల్మాన్ ఖాన్ వంటి స్టార్ హీరోలు తమ బాడీగార్డులకు ఏడాదికి కోట్లల్లో జీతం ఇస్తున్నారు. కరీనా కపూర్(kareena kapoor) తన పిల్లల్ని చూసుకునే నానీకి నెలకు లక్షన్నర రూపాయలు ఇస్తుండగా.. ఎప్పుడైనా ఓవర్ టైమ్ చేస్తే ఆ మొత్తాన్ని రూ.1.75 లక్షలకు పెంచుతారట. ఇక ఇటీవల షారుక్ ఖాన్(Shahrukh khan) మేనేజర్ ఒక విలాసవంతమైన ఇంటిని సొంతం చేసుకున్నారు. ఆమె సంవత్సరానికి రూ. 7 కోట్ల నుంచి 9 కోట్ల జీతం అందుకుంటారని తెలుస్తోంది. ఆమె మొత్తం ఆస్తుల విలువ రూ.50 కోట్ల వరకు ఉండొచ్చని సమాచారం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 మంది ఎమ్మెల్యేలు సహా.. 4 లక్షల ఓటర్లలో ఒక్కరూ ఓటెయ్యలేదు!
నాగాలాండ్లో 6 జిల్లాల్లో సున్నా పోలింగ్ నమోదైంది. స్థానిక ప్రజాప్రతినిధులతో పాటు లక్షల మంది ఓటర్లు ఈ ప్రక్రియకు దూరంగా ఉన్నారు. -
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.