వారి చేతికి అమెరికా కీలక డేటా..!
అమెరికాలో కొన్ని నెలలపాటు జరిగిన సోలార్ విండ్ హ్యాకింగ్లో కీలక సమాచారం రష్యల చేతికి వెళ్లినట్లు భావిస్తున్నారు. ట్రంప్ కార్యవర్గంలోని హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్(డీహెచ్ఎఫ్) ,
ఇంటర్నెట్డెస్క్ : అమెరికాలో కొన్ని నెలలపాటు జరిగిన సోలార్ విండ్ హ్యాకింగ్లో కీలక సమాచారం రష్యా చేతికి వెళ్లినట్లు భావిస్తున్నారు. ట్రంప్ కార్యవర్గంలోని హోంల్యాండ్ సెక్యూరిటీ చీఫ్(డీహెచ్ఎఫ్), సైబర్ సెక్యూరిటీ విభాగంలోని కీలక సిబ్బందికి చెందిన ఈమెయిల్స్ను హ్యాక్ చేసినట్ల తెలిసింది. దీనిపై రిపబ్లికన్ సెనెటర్ రాబ్పార్ట్మన్ మాట్లాడుతూ ‘‘సోలార్ విండ్ హ్యాకింగ్ మన విదేశీ శత్రువులకు పెద్ద విజయం.. మన డీహెచ్ఎఫ్కు భారీ పరాజయం’’ అని వ్యాఖ్యానించారు. ఆయన హోంల్యాండ్ సెక్యూరిటీ కమిటీ సభ్యుడు కూడా.
ఓ పక్క బైడెన్ కార్యనిర్వాహకవర్గం.. మరోసారి రష్యా హ్యాకర్లకు సోలార్ విండ్ లాంటి అవకాశం ఇవ్వకుండా కఠిన చర్యలు తీసుకొంటున్న సమయంలో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. హ్యాకర్ల చేతికి వెళ్లిన వాటిల్లో ఎనర్జీ డిపార్ట్మెంట్ సమాచారం కూడా ఉంది. కాకపోతే ఈ హ్యాకింగ్లో ఎటువంటి సమాచారాన్ని తస్కరించారన్న విషయం చెప్పడం కష్టమని కాలిఫోర్నియాలోని వెక్ట్రా అనే సైబర్ సెక్యూరిటీ సంస్థ ది గార్డియన్ పత్రికకు వెల్లడించింది. కీలక డేటా ఈమెయిల్స్ రూపంలో బయటకు వెళ్లకుండా ప్రభుత్వ కంప్యూటర్లలోని ప్రొటోకాల్ అడ్డుకుంటుంది. అయినా కానీ.. చాలా డేటాను హ్యాకర్లు చేజిక్కించుకున్నారని వెల్లడించింది. ఇప్పటికే దీనిపై ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై బైడెన్ సర్కారు చర్చిస్తోందని పెంటగాన్ సైబర్ ఫోర్స్ అధిపతి జనరల్ పాల్ నకాసోనే తెలిపారు. ఇప్పటికే సాంకేతికంగా వెనుకబడిన అంశాలపై దృష్టిపెట్టాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ఇటీవల కాలంలో అమెరికాలో హ్యాకింగ్లు ఎక్కువైపోయాయి. ఫిబ్రవరి నెలలో ఫ్లోరెడాలోని ఓ పట్టణంలో మంచినీటి సరఫరా వ్యవస్థలో విషం కలపాలని ఓ హ్యాకర్ తీవ్రంగా ప్రయత్నించారు. ఈ విషయాన్ని మార్చిలో గుర్తించారు. చైనా బృందాలే హ్యాకింగ్కు ప్రయత్నించినట్లు తర్వాత నిపుణుల బృందాలు తెలిపాయి.
కొన్ని నెలల నుంచి హ్యాకింగ్ జరుగుతున్నా..
డిసెంబర్ రెండో వారంలో భారీ సైబర్ దాడి బయటపడింది. 2020 మార్చి-జూన్ మధ్యలో హ్యాకర్లు సోలార్ విండ్ అనే నెట్వర్కింగ్ సేవల సంస్థకు చెందిన ‘ఓరియన్’ సాఫ్ట్వేర్లోకి ‘సన్బరస్ట్’ అనే మాల్వేర్ను చొప్పించారు. అక్కడి నుంచి ఓరియన్ పంపిన సమాచారం స్వీకరించిన కంప్యూటర్లు హ్యాకర్ల అధీనంలోకి వెళ్లాయి. ఈ తరహా ప్రక్రియలను ‘సప్లై చైన్’ దాడులు అంటారు. డిసెంబర్ ఎనిమిదో తేదీన ‘ఫైర్ ఐ’ అనే సంస్థ తొలిసారి ఈ హ్యాకింగ్ను గుర్తించే వరకు అగ్రరాజ్యానికి దీనిపై స్పృహ లేదు. తాజా దాడి బాధితుల జాబితాలో అమెరికా ఎనర్జీ, కామర్స్, ట్రెజరీ, స్టేట్ డిపార్ట్మెంట్లతో పాటు, ఫార్చ్యూన్ 500లోని కీలక సంస్థలతో సహా 18,000 నెట్వర్క్లలోకి వైరస్ చొరబడటం అమెరికాలో గుబులు రేకెత్తించింది!. కొన్ని నెలల పాటు కంప్యూటర్లు హ్యాకర్ల అధీనంలో ఉండటంతో నష్టాన్ని అంచనా వేయడానికే చాలా సమయం పట్టనుండటం తీవ్రతను తెలియజేస్తోంది. ఈ దాడి వెనక బలమైన సైబర్ ఆయుధ వనరులున్న రష్యా హస్తం ఉందని అమెరికా నిఘావర్గాలు అనుమానిస్తున్నాయి. ఎందుకంటే 2016లో ఉక్రెయిన్పై రష్యా విదేశీ నిఘా విభాగంలోని ‘కోజీబేర్’ లేదా ‘ఏపీటీ 29’గా పిలిచే బృందం ఇలాంటి దాడికి పాల్పడినట్లు అనుమానిస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మామిడిపండ్లను మూడుసార్లే తిన్నా
బెయిల్ కోసం ఉద్దేశపూర్వకంగా చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నానని ఈడీ తనపై చేసిన ఆరోపణలపై దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఘాటుగా స్పందించారు. -
మూడు రోజుల్లో తేల్చాలి
ఎన్నికలు సమీపిస్తున్నాయనే ఏకైక సాకుతో సభలు, సమావేశాలు, ఓటరు చైతన్య యాత్రలు, నిరసనలు, ధర్నాలు తదితరాలపై జిల్లా, రాష్ట్ర అధికార యంత్రాంగాలు నిషేధం విధించడాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. -
శరద్ పవార్ వైపు దూసుకొచ్చిన మైక్రోఫోన్!
నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ ఓ సభలో మాట్లాడుతుండగా ఆయన వైపు మైక్రోఫోన్ ఒకటి దూసుకురావడం చిన్నపాటి కలకలం రేపింది. -
నౌకాదళ నూతన అధిపతిగా దినేశ్కుమార్ త్రిపాఠి
నూతన నౌకాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి నియమితులయ్యారు. ఈ నెలాఖర్లో ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. -
వేదమంత్రాల సాక్షిగా శ్రీకృష్ణుడితో యువతి పెళ్లి
మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఓ యువతి చిన్నప్పటి నుంచి తాను ఆరాధించిన శ్రీకృష్ణుణ్ని పెళ్లి చేసుకుంది. -
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
చిన్నపిల్లలు అశ్లీల వీడియోలు చూడటం నేరం కాకపోవచ్చేమో గానీ, పిల్లలను ఉపయోగించి అశ్లీల వీడియోలు తీయడం తీవ్రమైన ఆందోళన కలిగించే విషయమేగాక నేరమని శుక్రవారం సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
తిరస్కృత నామినేషన్లపై పిటిషన్ను తోసిపుచ్చిన సుప్రీం
తిరస్కృత నామినేషన్లకు పరిష్కారం నామినేషన్లు దాఖలు చేయడంలోనే ఉందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
‘సైన్స్శక్తి’గా ఎదిగేందుకు భారత్ సిద్ధం
ప్రబల ఆర్థికశక్తిగా ఎదుగుతున్న భారత్.. శాస్త్ర, సాంకేతిక రంగంలోనూ సత్తా చాటేందుకు సిద్ధమవుతోందని ప్రముఖ సైన్స్ వారపత్రిక ‘నేచర్’ పేర్కొంది. -
వివాహేతర సంబంధం విడాకులకు మాత్రమే కారణం.. పిల్లల కస్టడీ మంజూరుకు కాదు
వివాహేతర సంబంధం కారణం చూపి విడాకులు పొందవచ్చు కానీ, పిల్లల కస్టడీని పొందలేరని బొంబాయి హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. -
అభ్యర్థుల మార్కులను వెల్లడించిన యూపీఎస్సీ
సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల వివరాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(యూపీఎస్సీ) శుక్రవారం విడుదల చేసింది. -
దుబాయ్ ప్రయాణాలు వాయిదా వేసుకోండి
అత్యవసరమేమీ కానట్లయితే దుబాయ్కి, ఇక్కడి నుంచి వేరే దేశాలకు వెళ్లేందుకు భారతీయులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలని యూఏఈలోని భారత దౌత్య కార్యాలయం సూచించింది. -
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
ఉత్తర్ప్రదేశ్లోని ఉన్నావ్ జిల్లా దండమౌ గ్రామ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సంగీతాసింగ్ పనివేళల్లో ఫేషియల్ చేయించుకున్నారు. -
ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు ప్రాజెక్టు
మానవుల ఆరోగ్యకర ఆయుర్దాయాన్ని పెంచేందుకు బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) ఒక ప్రాజెక్టును చేపట్టింది. -
ఓటు స్ఫూర్తిని చాటిన సైలెంట్ విలేజ్
ఎన్నికల ప్రక్రియలో పాల్గొనేందుకు వైకల్యం అడ్డుకాదని చాటారు జమ్మూకశ్మీర్లోని ధడ్కాహి గ్రామస్తులు. డోడా జిల్లాలోని ధడ్కాహి.. ఉధమ్పుర్ లోక్సభ స్థానం పరిధిలోకి వస్తుంది. -
రోజూ 15 నిమిషాలు వైద్యుడిని సంప్రదించేందుకు అనుమతివ్వండి
తిహాడ్ జైలులో తాను ఇన్సులిన్ వినియోగించేందుకు అనుమతినిచ్చేలా జైలు అధికారులకు ఆదేశాలు ఇవ్వాలంటూ దిల్లీ కోర్టులో కేజ్రీవాల్ అభ్యర్థనను దాఖలు చేశారు. -
ఫిలిప్పీన్స్ చేతికి భారత్ బ్రహ్మోస్
బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూజ్ క్షిపణుల మొదటి బ్యాచ్ను భారత్.. శుక్రవారం ఫిలిప్పీన్స్కు అందజేసింది. -
యోగాగురు రాందేవ్ కేసుల పరిస్థితేంటి?
యోగాగురు రాందేవ్పై నమోదైన ఫిర్యాదుల పరిస్థితిని, ఎఫ్ఐఆర్ వివరాలను సమర్పించాలని బిహార్, ఛత్తీస్గఢ్ ప్రభుత్వాలను సుప్రీంకోర్టు ఆదేశించింది. -
కోల్కతా హైకోర్టులో న్యాయవాదులు గౌను ధరించాల్సిన అవసరం లేదు
రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో కోల్కతా హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. -
బాలిక 28 వారాల గర్భం తొలగింపుపై వైద్యుల సలహా కోరిన సుప్రీంకోర్టు
అత్యాచార బాధితురాలైన 14 ఏళ్ల బాలిక అభ్యర్థన మేరకు ఆమె 28 వారాల గర్భం తొలగించటానికి అనుమతించే విషయమై సర్వోన్నత న్యాయస్థానం వైద్యుల సలహా కోరింది. -
వేసవి రద్దీకి రైల్వే సిద్ధం.. రికార్డు స్థాయిలో 9,111 అదనపు ట్రిప్పులు!
వేసవి రద్దీని తీర్చేందుకు రైల్వేశాఖ సిద్ధమైంది. ఈ సీజన్లో దేశవ్యాప్తంగా 9,111 అదనపు ట్రిప్పులు నడపనున్నట్లు ప్రకటించింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే..
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు