Indian Army: 24 గంటలు శ్రమించి కుటుంబానికి సాయం

జమ్మూ కశ్మీర్‌లో మంచుకొండల్లో చిక్కుకున్న ఓ గొర్రెల కాపరుల కుటుంబానికి సైనిక సిబ్బంది 24 గంటలపాటు ట్రెక్కింగ్‌ చేసి ఆహారాన్ని అందించింది....

Published : 18 May 2021 23:28 IST

శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో మంచుకొండల్లో చిక్కుకున్న ఓ గొర్రెల కాపరుల కుటుంబానికి సైనిక సిబ్బంది 24 గంటలపాటు ట్రెక్కింగ్‌ చేసి ఆహారాన్ని అందించింది. బషీర్‌ అహ్మద్‌ అనే వ్యక్తి, అతడి భార్య, ఇద్దరు పిల్లలు గొర్రెల మందతో కలిసి కతువా ప్రాంతం నుంచి మారువా లోయకు వెళుతున్నారు. ఈ క్రమంలో 11 వేల మీటర్ల ఎత్తులో ఉన్న నాల్కెన్‌సుర్‌ శిఖరం వద్ద మంచులో ఈ కుటుంబం చిక్కుకుంది. కాగా సహాయం కోసం ఆర్మీకి చెందిన చత్రు సబ్‌డివిజన్‌కు సమాచారం ఇచ్చారు. వెంటనే స్పందించిన సైన్యం ప్రతికూల వాతావరణంలో 24 గంటలపాటు ప్రయాణించి బషీర్‌ కుటుంబానికి ఆహారం, మందులు, ఇతర వస్తువులు అందించింది. తక్షణ సాయం అందించిన సైన్యానికి గొర్రెల కాపరి కుటుంబం కృతజ్ఞతలు తెలిపింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని