Sharad Pawar: ‘మా ప్రభుత్వాన్ని రద్దుచేసిన మర్నాడే.. ‘వాంఖడే’లో క్రికెట్ మ్యాచ్ ఎంజాయ్ చేశాం’!
మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా పఠనం వంటి వ్యవహారాలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత,.....
అందరూ నాలా ఉండరు: మహారాష్ట్రలో పరిణామాలపై శరద్ పవార్
పుణె: మత ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్లు, హనుమాన్ చాలీసా పఠనం వంటి వ్యవహారాలపై మహారాష్ట్రలో రాజకీయ దుమారం కొనసాగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ఎన్సీపీ అధినేత, కేంద్ర మాజీ మంత్రి శరద్ పవార్ భాజపాను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు. అధికారం కోల్పోయాక కొందరు వ్యక్తులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారన్నారు. సోమవారం పుణెలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న పవార్.. అక్కడ మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో మత సంబంధ ప్రదేశాల్లో లౌడ్ స్పీకర్ల అంశంపై మహా వికాస్ అఘాడీ (శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్ కూటమి) ప్రభుత్వం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయడం మంచి విషయమన్నారు. ఈ భేటీతో ఏదైనా ఫలితం వస్తే తానెంతో సంతోషిస్తానని వ్యాఖ్యానించారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధించే పరిస్థితులు ప్రస్తుతం ఉన్నాయంటూ కొందరు విపక్ష నేతలు వ్యాఖ్యలపై మీడియా ఆయన్ను ప్రశ్నించగా గతంలో తాను సీఎంగా ఉన్నప్పుడు ఎదురైన అనుభవాన్ని చెబుతూ దీటుగా బదులిచ్చారు. 2019లో భాజపా చేతుల్లోంచి అధికారం చేజారిన తర్వాత కొందరు నేతలు ఆందోళన చెందుతున్నారన్నారు.
అందరూ నాలా ఉండరు..
‘మహారాష్ట్రలో ఇలాంటి పరిస్థితులు కొత్త కాదు. అందరూ నాలా ఉండరు. 1980లో రాష్ట్రంలో మా ప్రభుత్వాన్ని రద్దు చేసిన తర్వాత అర్ధరాత్రి 12.30 గంటలకు నాకు ఆ విషయం చెప్పారు. అప్పుడు నాతో పాటు నా స్నేహితులు తక్షణమే ముఖ్యమంత్రి నివాసాన్ని ఖాళీ చేసే వేరే చోటకు వెళ్లిపోయాం. ఆ మరుసటి రోజే అందరం కలిసి వాంఖడే మైదానంలో క్రికెట్ మ్యాచ్కు చూసేందుకు వెళ్లాం. ఆ రోజంతా ఎంతో ఎంజాయ్ చేశాం’’ అని పవార్ చెప్పుకొచ్చారు. ‘‘అధికారం వస్తుంది.. పోతుంది.. దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కొంత కాలంగా కొందరు వ్యక్తులు ఆందోళన చెందుతున్నారు. నేను వాళ్లను నిందించడం లేదు.. ఎందుకంటే 2019 ఎన్నికలకు ముందు అధికారంలోకి తిరిగి వస్తామని వారు అనుకున్నారు. కానీ అది కార్యరూపం దాల్చలేదు. అందుకే ఈ ఆందోళనంతా’’ అని భాజపాను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
మధ్యంతర ఎన్నికలొస్తే.. ఇటీవలి ఫలితం చూశారుగా!
ముంబయిలో ఇటీవల జరుగుతున్న కొన్ని ఘటనల నేపథ్యంలో భాజపా ప్రతినిధులు కేంద్ర హోంశాఖ కార్యదర్శిని కలవడంపైనా పవార్ స్పందించారు. కొందరు ఆతృత కలిగిన వ్యక్తులు ఎక్కడికైనా వెళ్లొచ్చు.. వారి అవకాశాలను అన్వేషించొచ్చని వ్యాఖ్యానించారు. దీని గురించి ఆలోచించాల్సిన అవసరంలేదన్నారు. మహారాష్ట్రలో రాష్ట్రపతి పాలన విధిస్తామంటూ ఎప్పట్నుంచో బెదిరిస్తున్నారనీ.. కానీ ఫలితం లేకపోయిందన్నారు. ఒకవేళ రాష్ట్రంలో మధ్యంతర ఎన్నికల పరిస్థితి గనక వస్తే.. ఇటీవల కొల్హాపూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో ఏమైందో చూశాం కదా.. అందువల్ల అంతవరకు వెళ్లరని తాను అనుకొంటున్నానన్నారు. ఇటీవల కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో తమ మిత్రపక్షమైన కాంగ్రెస్ అభ్యర్థి జయశ్రీ జాదవ్ భాజపా అభ్యర్థి సత్యజీత్ కదమ్పై 18వేల ఓట్ల మెజార్టీతో గెలుపొందిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
గోరఖ్పుర్ భాజపా అభ్యర్థి రవికిషన్ నా తండ్రే
ప్రముఖ నటుడు, ఉత్తర్ప్రదేశ్లోని గోరఖ్పుర్ లోక్సభ నియోజకవర్గ భాజపా అభ్యర్థి రవికిషన్ శుక్లా తన తండ్రి అంటూ తాజాగా జూనియర్ నటి షినోవా సోనీ బొంబాయి హైకోర్టును ఆశ్రయించారు. -
ఈ రాముడి చిత్రపటం.. ఓ భద్రతా పరికరం!
ఇంట్లో చోరీలను అరికట్టేందుకు గృహ భద్రత పరికరాన్ని రూపొందించారు గోరఖ్పుర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ మేనేజ్మెంట్ కళాశాల విద్యార్థినులు. -
తూర్పు నుంచి దక్షిణానికి తీవ్ర వేడిగాలులు: ఐఎండీ
తూర్పు భారత రాష్ట్రాలను కుతకుతలాడిస్తున్న వేడిగాలులు దక్షిణ ప్రాంతాలకు వ్యాపించాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) మంగళవారం వెల్లడించింది. -
రక్షణ వ్యయంలో భారత్ది నాలుగోస్థానం
ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ నాలుగో స్థానంలో నిలిచింది. 2023లో మన దేశం ఈ రంగంపై 8,360 కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. -
తేలికపాటి తూటారక్షణ కవచం సిద్ధం
దేశంలోనే అత్యంత తేలికపాటి తూటారక్షణ కవచాన్ని రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో) విజయవంతంగా రూపొందించింది. -
న్యాయవ్యవస్థ స్వతంత్రతకు ఎదురవుతున్న ముప్పును అడ్డుకోండి
న్యాయమూర్తులు రాజకీయాల్లో చేరేందుకు రెండేళ్లు వేచిఉండడాన్ని తప్పనిసరి చేయడం సహా చట్టంలో అనేక సవరణలు చేయాలని విజ్ఞప్తి చేస్తూ సీనియర్ న్యాయవాది ఆదీశ్ సి.అగర్వాలా మంగళవారం ప్రధాని మోదీకి లేఖ రాశారు. -
‘10 రోజుల్లో ఎంబీఏ’.. ఇలాంటి వాటితో జాగ్రత్త
ఆన్లైన్లో నకిలీ కోర్సులపై యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) ప్రజలకు కీలక హెచ్చరిక చేసింది. -
వచ్చే ఏడాది భారత్కు ‘ఎస్-400’
రష్యా నుంచి మనదేశానికి అందాల్సిన రెండు రెజిమెంట్ల ఎస్-400 ట్రైయాంఫ్ గగనతల రక్షణ వ్యవస్థలు వచ్చే ఏడాదిలో అందే అవకాశం ఉంది. -
శుద్ధ ఇంధన రంగంలో కర్ణాటక, గుజరాత్ జోరు
శుద్ధ ఇంధనం దిశగా అడుగులు వేయడంలో కర్ణాటక, గుజరాత్ ముందంజలో ఉన్నాయని తాజా నివేదిక పేర్కొంది. -
ప్రజావంచనకు అవకాశం ఇవ్వొద్దు
పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల కేసు విచారణ పరిధిని సుప్రీంకోర్టు మరింత విస్తృతం చేసింది. ఇటీవల మరో కంపెనీ ఉత్పత్తి కూడా వివాదాస్పదమైన నేపథ్యంలో... త్వరగా అమ్ముడయ్యే వినియోగ వస్తు పరిశ్రమ(ఎఫ్ఎంసీజీ)ల వాణిజ్య ప్రకటనలనూ ఈ కేసు పరిధిలోకి తీసుకొచ్చింది. -
ఎట్టకేలకు కేజ్రీవాల్కు ఇన్సులిన్
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు తిహాడ్ జైలు అధికారులు ఎట్టకేలకు ఇన్సులిన్ ఇచ్చారు. కేజ్రీవాల్కు సోమవారం రాత్రి షుగర్ స్థాయిలు పెరగడం వల్ల తక్కువ మోతాదులో రెండు యూనిట్ల ఇన్సులిన్ ఇచ్చినట్లు తిహాడ్ జైలు అధికారులు మంగళవారం వెల్లడించారు. -
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణి పరీక్ష విజయవంతం
మధ్యశ్రేణి బాలిస్టిక్ క్షిపణికి సంబంధించిన ఒక నూతన వెర్షన్ను భారత్ మంగళవారం విజయవంతంగా పరీక్షించింది. -
12 ఏళ్ల లోపు పిల్లలకు తల్లిదండ్రుల దగ్గరే సీట్లు
విమానయాన సంస్థలకు పౌర విమానయాన శాఖ డైరెక్టరేట్ జనరల్ (డీజీసీఏ) కీలక ఆదేశాలు జారీ చేసింది. 12 ఏళ్లలోపు పిల్లలకు వారి తల్లిదండ్రుల్లో కనీసం ఎవరో ఒకరి పక్కన సీటు కేటాయించాలని పేర్కొంది. -
మీ క్షమాపణలు.. ఆ ప్రకటనల సైజులో ఉన్నాయా?
యోగా గురు బాబా రాందేవ్, పతంజలి ఎండీ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు ధర్మాసనం మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. -
కేజ్రీవాల్, కవిత జ్యుడిషియల్ కస్టడీ మే 7 వరకు
మద్యం కేసులో మనీ లాండరింగ్కు పాల్పడ్డారన్న ఆరోపణలపై ఈడీ అరెస్టు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, భారాస ఎమ్మెల్సీ కవితల జ్యుడిషియల్ కస్టడీని ఇక్కడి రౌజ్ అవెన్యూ కోర్టు మే 7వ తేదీ వరకు పొడిగించింది. -
ఉచిత పథకాలకు పార్టీలు స్వస్తి పలకాలి
తగిన ఆర్థిక వనరులు లేకుండా ఉచిత పథకాలను ప్రకటించే పద్ధతికి రాజకీయ పార్టీలు స్వస్తి పలకాలని మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. -
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
ఇటీవల యూపీఎస్సీ పరీక్షలో విఫలమైన తన స్నేహితుడిని కలిసిన సందర్భం గురించి ఓ ఐపీఎస్ అధికారి చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
తాజా వార్తలు (Latest News)
-
అక్కడ బుర్ర పగిలిపోతుంది: అంబటి రాయుడు
-
గుంతల దారులు.. బూతు మాటలు!: ఇవే ‘గుడివాడ’లో గెలుపోటములు తేల్చేవి
-
ఇరాన్తో ఒప్పందాలా? జాగ్రత్త..! పాక్కు అమెరికా హెచ్చరిక
-
ఫిర్యాదు రాగానే లావాదేవీ నిలిపివేయాలి: ఆర్బీఐకి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సూచన
-
అంటకాగితే.. అంతే రాణా..!
-
సైబర్ మోసమా.. వారియర్లు పట్టేస్తారు!