Hijab Row: మైనారిటీల గురించి పాకిస్థానా మాట్లాడేది?: నఖ్వీ
కర్ణాటకలో జరుగుతోన్న హిజాబ్ వివాదంపై పాకిస్థాన్ మంత్రులు చేసిన విమర్శలను కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ తిప్పికొట్టారు.
పాకిస్థాన్పై నిప్పులు చెరిగిన కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ
దిల్లీ: కర్ణాటకలో జరుగుతోన్న హిజాబ్ వివాదంపై కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ స్పందించారు. డ్రెస్ కోడ్ అంశాన్ని కొందరు రాజకీయం చేస్తున్నారన్న ఆయన.. ఇది భారతీయ సమ్మిళిత సంప్రదాయాన్ని కించపరిచే కుట్రలో భాగమేనని ఆరోపించారు. ఇక ఇదే అంశంపై పాకిస్థాన్ మంత్రులు చేసిన విమర్శలను ముక్తార్ అబ్బాస్ తిప్పికొట్టారు. మైనారిటీలను నేరస్థులుగా, క్రూరంగా చూసే పాకిస్థాన్.. సహనం, లౌకికవాదం గురించి భారత్కు బోధించడం విడ్డూరమన్నారు.
ముస్లింలతోపాటు మైనారిటీలకు సమాన హక్కులు, గౌరవం, శ్రేయస్సు అనేది భారతీయ సహనం, సామరస్యం, కలుపుకుపోయేతత్వంలో ఒక భాగమని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ ఉద్ఘాటించారు. ప్రపంచంలో ప్రతి పదిమంది ముస్లింలలో ఒకరు భారత్లోనే ఉన్నారన్న ఆయన.. దేశంలో 3లక్షలకుపైగా మసీదులు ఉన్నాయని గుర్తుచేశారు. ఇవి ప్రపంచంలో ఉన్న అన్ని ముస్లిం ప్రార్థనా స్థలాలతో సమానమన్నారు. వీటితోపాటు దేశంలో 50వేలకు పైగా మదర్సాలు, 50వేలకు పైగా మైనార్టీ విద్యాసంస్థలు ఉన్నాయని చెప్పారు.
స్వాతంత్ర్యం రాకముందు పాకిస్థాన్లో 1288 మంది దేవాలయాలు ఉంటే ప్రస్తుతం కేవలం 31 మాత్రమే మిగిలాయని కేంద్ర మంత్రి ముక్తార్ అబ్బాస్ నఖ్వీ పేర్కొన్నారు. ఇక దేశ విభజన సమయంలో పాకిస్థాన్లో మైనారిటీ జనాభా 23శాతంగా ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 3శాతానికంటే తక్కువేనని దుయ్యబట్టారు. భారత్లో మాత్రం ఇతర పౌరులతో సమానంగా మైనారిటీలు సమాన హక్కులు, సమాన ప్రయోజనాలు పొందుతున్నారని స్పష్టం చేశారు. దేశంలో డ్రెస్కోడ్ అంశానికి కొందరు మతం రంగు పూస్తున్నారన్న కేంద్రమంత్రి.. భారతీయ నిబద్ధత, సంస్కృతికి అపఖ్యాతి కలిగించే కుట్రేనని ఆరోపించారు.
ముందు మీ సమస్యల్ని పరిష్కరించుకోండి: అసదుద్దీన్
లఖ్నవూ: కర్ణాటకలో జరుగుతున్న ‘హిజాబ్’ వివాదంపై విషం చిమ్మేందుకు ప్రయత్నించిన పాకిస్థాన్కు మజ్లిస్ పార్టీ, ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ దీటైన సమాధానం ఇచ్చారు. మీ పని మీరు చూసుకుంటే మంచిదని హితవు పలికారు. ముందు మీ దేశంలోని సమస్యల్ని పరిష్కరించుకోవాలని, మీ అమ్మాయిలకు సరైన రక్షణ ఇవ్వండి అంటూ ఎద్దేవా చేశారు.
హిజాబ్ వస్త్రధారణ వివాదం కారణంగా కర్ణాటకలో అల్లర్లు చెలరేగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మసూద్ ఖురేషి ఈ వివాదంపై ఓ ట్వీట్ చేశారు. ‘ముస్లిం బాలికలకు విద్యను దూరం చేయడం వారి ప్రాథమిక, మానవ హక్కులను తీవ్రంగా ఉల్లంఘించడమే. హక్కులను కాలరాయడం, హిజాబ్ ధరించినందుకు వారిని భయభ్రాంతులకు గురిచేయడం పూర్తిగా అణచివేత. భారత్లో ముస్లింలను చిన్నచూపు చూడటాన్ని ప్రపంచ దేశాలు గ్రహించాలి’ అంటూ ట్విటర్లో పేర్కొన్నారు.
పాక్ విదేశాంగ మంత్రి వ్యాఖ్యలపై అసదుద్దీన్ మండిపడ్డారు. ఉత్తరప్రదేశ్లోని నిర్వహించిన ఎన్నిలక ర్యాలీలో మజ్లిస్ పార్టీ చీఫ్ మాట్లాడుతూ.. మీ పని మీరు చూసుకుంటే మంచిదని దాయాది దేశానికి చురకలంటించారు. ‘బాలికల విద్యపై భారత్కు పాకిస్థాన్ ఉపన్యాసాలు ఇవ్వకూడదు. బాలికల విద్యపై పోరాడే మలాలా యూసఫ్జాయ్పై పాక్లోనే కాల్పులు జరిగాయి. దీంతో ఆమె మరో దేశంలో చదువుకోవాల్సి వచ్చింది. మీ ఆడపిల్లలకు భద్రత కల్పించడంలో విఫలమై.. ఇప్పుడు భారత్కు పాఠాలు చెబుతున్నారు. ముందు మీ దేశంలోని సమస్యలను పరిష్కరించుకోండి’ అంటూ ఒవైసీ మండిపడ్డారు. కర్ణాటక హిజాబ్ వివాదం భారత అంతర్గత సమస్య అని దీంట్లో మీ జోక్యం అనవరమని ఘాటుగా స్పందించారు.
భాజపాపై విపక్షాల మండిపాటు..
దిల్లీ: కర్ణాటకలో ఉద్రిక్త పరిస్థితులకు దారితీసిన హిజాబ్ వివాదంలో విపక్షాలు భాజపాపై విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా ట్విటర్ వేదికగా కమలం పార్టీపై మండిపడ్డారు.
‘కేంద్రం, రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భాజపా ప్రభుత్వాలు.. ఏ దుస్తులు ధరించాలో మాకు చెప్పడం మానుకోవాలి. మాకు నచ్చిన దుస్తుల్ని మేం ధరిస్తాం. మీకు చూడటం ఇష్టం లేకపోతే మీ గుహలను వీడి బయటకు రాకండి’ అంటూ విరుచుకుపడ్డారు. ఇదే తరహాలో కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. నచ్చిన దుస్తులు వేసుకోవడం మహిళల హక్కు అని ఆమె స్పష్టం చేశారు. దుస్తుల ఎంపిక మహిళల ఇష్టమన్నారు. దక్షిణాది రాష్ట్రం కర్ణాటకలో మంగళవారం హిజాబ్ వివాదం తీవ్రరూపం దాల్చింది. వస్త్రధారణపై రెండు వర్గాల విద్యార్థుల మధ్య ఘర్షణలు చోటుచేసుకోవడంతో ఆ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. దాంతో అక్కడి ప్రభుత్వం మూడు రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించింది. అలాగే బెంగళూరులోని పాఠశాలలు, కళాశాలలకు దగ్గర్లో నిరసనలు నిర్వహించడంపై రెండువారాల పాటు నిషేధం విధించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు. -
మనీలాండరింగ్ పరిధిలోకి రాని నేరానికి ఆ చట్టాన్ని వర్తింపజేయలేం
ఒక వ్యక్తిపై మోపిన నేరపూరిత కుట్ర అభియోగాలు మనీలాండరింగ్ చట్టం పరిధిలోకి రానట్లయితే...సదరు నిందితుడిపై ‘ఐపీసీ సెక్షన్ 120బి’ని మోపి పీఎంఎల్ఏ కింద కేసు నమోదు చేయరాదని సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది. -
ఆసుపత్రి నుంచి సద్గురు డిశ్ఛార్జ్
ఈశా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త సద్గురు జగ్గీ వాసుదేవ్ ఆసుపత్రి నుంచి బుధవారం డిశ్ఛార్జ్ అయ్యారు. ఈ విషయాన్ని ఈశా ఫౌండేషన్ ఓ ప్రకటనలో తెలిపింది.
తాజా వార్తలు (Latest News)
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ
-
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
-
తెలంగాణ జెన్కో ఏఈ, కెమిస్ట్ ఉద్యోగ పరీక్ష వాయిదా
-
మస్క్ కీలక ప్రకటన.. వారికి ప్రీమియం సబ్స్క్రిప్షన్ ఫ్రీ!
-
ఎంపీ అవినాష్ ముందస్తు బెయిల్ రద్దు పిటిషన్పై హైకోర్టులో విచారణ