అసభ్యత పెరిగిపోతోంది..పర్యవేక్షణ అవసరం

ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాంలలో ప్రసారమయ్యే వీడియోలపై పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు గురువారం వెల్లడించింది. ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది.

Published : 04 Mar 2021 17:53 IST

ఓటీటీల కంటెంట్‌పై సుప్రీంకోర్టు

దిల్లీ: ఓవర్‌ ది టాప్‌ (ఓటీటీ) ప్లాట్‌ఫాంలలో ప్రసారమయ్యే వీడియోలపై పర్యవేక్షణ అవసరమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన విచారణలో భాగంగా ఉన్నత న్యాయస్థానం పలు కీలక సూచనలు చేసింది. ‘‘ ప్రస్తుతం ఇంటర్నెట్‌, ఓటీటీల్లో సినిమాలు, వీడియోలు చూడటం చాలా సాధారణమైపోయింది. కాబట్టి దీనిపై పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాలి. అంతేకాకుండా కొన్ని ప్లాట్‌ఫాంలలో అసభ్యకరమైన కంటెంట్‌ ప్రసారమవుతోంది.’’ అని జస్టిస్‌ అశోక్‌ భూషణ్‌ నేతృత్వంలోని ధర్మాసనం పేర్కొంది.
అమెజాన్‌ ప్రైమ్‌లో ప్రసారమవుతున్న ‘తాండవ్‌’ వెబ్‌సిరీస్‌కు సంబంధించిన కేసులో  అమెజాన్‌ ఇండియా హెడ్‌ అపర్ణా పురోహిత్‌ ముందస్తు బెయిల్‌ను అలహాబాద్ కోర్టు కొట్టేయడంతో ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ విచారణను సుప్రీంకోర్టు రేపటికి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో కేంద్రం తాజాగా ప్రకటించిన ఓటీటీల మార్గదర్శకాలను శుక్రవారం కోర్టుకు సమర్పించాలని సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాను ఆదేశించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని