Sonia Gandhi: సోనియాతో ముగిసిన ఈడీ విచారణ.. మళ్లీ పిలుస్తారా?
కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో ఈడీ విచారణ గురువారం ముగిసింది. నేషనల్ హెరాల్డ్ (National Herald)కు సంబంధించిన మనీ లాండరింగ్........
దిల్లీ: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ (Sonia Gandhi)తో ఈడీ విచారణ గురువారం ముగిసింది. నేషనల్ హెరాల్డ్ (National Herald)కు సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో దాదాపు రెండు గంటలకు పైగా అధికారులు ఆమెను విచారించారు. ఈ కేసులో ఆమె వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. 75 ఏళ్ల సోనియా గాంధీ ఇటీవల కొవిడ్ నుంచి కోలుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విచారణలో పాల్గొన్న అధికారుల బృందం కొవిడ్ నిబంధనలు పాటించింది. సోనియాను ప్రశ్నించేందుకు మహిళా జాయింట్ డైరెక్టర్ సారథ్యంలోని ఐదుగురు అధికారుల బృందం 50 ప్రశ్నలు రూపొందించినట్టు తెలిసింది.
ఈ రోజు మధ్యాహ్నం సెంట్రల్ దిల్లీలోని అబ్దుల్ కలాం రోడ్డులోని ఈడీ ప్రధాన కార్యాలయానికి సోనియా గాంధీ తన జడ్ ప్లస్ కేటగిరీ భద్రతతో చేరుకోగా.. 12.30గంటలకు విచారణ మొదలైంది. సోనియా వెంట ఆమె కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా (Priyanka Gandhi Vadra) ఉన్నారు. వీరు ఈడీ కార్యాలయానికి చేరుకున్న తర్వాత.. సోనియా విచారణ గదిలోకి వెళ్లారు. అటు రాహుల్ గాంధీ కూడా ఈడీ కార్యాలయానికి వచ్చి కాసేపటికే అక్కడి నుంచి వెళ్లిపోయారు. సోనియా ఆరోగ్య కారణాల దృష్ట్యా ఆమెకు సహకారిగా ఉండేందుకు ప్రియాంకకు ఈడీ అనుమతినిచ్చింది. అయితే విచారణ గదిలో కాకుండా మరో గదిలో ఉండాలని సూచించింది. కొవిడ్ లక్షణాలతో సోనియా ఇటీవల ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. వైరస్ నుంచి కోలుకున్నప్పటికీ.. కొవిడ్ అనంతర సమస్యలతో ఆమె బాధపడుతున్నారు. ప్రతి మూడు నాలుగు గంటలకోసారి నెబ్యులైజేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉండటంతో ప్రియాంకను ఈడీ కార్యాలయం లోపలికి అధికారులు అనుమతించారు. కాంగ్రెస్ అధ్యక్షురాలిని దర్యాప్తు సంస్థలు విచారించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదే కేసులో ఇటీవల రాహుల్ గాంధీని కూడా ఈడీ విచారించిన విషయం తెలిసిందే. మొత్తం 5 రోజుల్లో 10 గంటలపాటు రాహుల్ను అధికారులు ప్రశ్నించారు.
రైళ్లు ఆపి.. కారుకు నిప్పు పెట్టిన కాంగ్రెస్ శ్రేణులు
సోనియాగాంధీని ఈడీ ప్రశ్నించడంపై కాంగ్రెస్ శ్రేణులు తీవ్రంగా మండిపడుతున్నాయి. రాజకీయ ప్రతీకార చర్యగా పేర్కొంటూ బెంగళూరులో యూత్ కాంగ్రెస్ కార్యకర్తలు కారుకు నిప్పంటించారు. ఈ ఘటనలో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేశారు. మరోవైపు, దిల్లీలోని శివాజీ బ్రిడ్జి రైల్వేస్టేషన్లో కాంగ్రెస్ కార్యకర్తలు మూడు రైళ్లను అడ్డుకున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద ఒకింత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కొంతమంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాంగ్రెస్ సీనియర్ నాయకులు అధిర్ రంజన్ చౌధరీ, సచిన్ పైలట్, అశోక్ గెహ్లోత్ తదితరులు ఆందోళనల్లో పాల్గొనగా.. వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ ఆందోళనలు చేపట్టింది. అటు పార్లమెంట్లోనూ ఈ విషయంపై కాంగ్రెస్ ఎంపీలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వం దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
First phase of LS polls: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎన్నికల పోలింగ్ ముగిసింది. -
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ
PM Modi: ప్రచార సభలో తన తల్లి ఫొటోను చూసి ప్రధాని మోదీ ఉద్వేగానికి లోనయ్యారు. ఆ చిత్రాన్ని గీసిన యువకుడిని అభినందించారు. -
‘ఉగ్రవాదులను’ పంపించే దేశం.. ‘పిండి’ కోసం పాట్లు పడుతోంది - మోదీ
ప్రపంచంలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులను దృష్టిలో పెట్టుకుంటే బలమైన, స్థిర ప్రభుత్వం అవసరమని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
నేను తిన్నది మూడు మామిడి పండ్లే: కేజ్రీవాల్
తనకు జైల్లో ఇన్సులిన్ అందించాలని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) దిల్లీ కోర్టులో పిటిషన్ వేశారు. -
స్కూల్లో ఫేషియల్ చేయించుకున్న ప్రిన్సిపల్.. వీడియో తీసిన ఉపాధ్యాయురాలిపై దాడి
ఉత్తరప్రదేశ్లోని ఒక పాఠశాలలో ప్రధానోపాధ్యాయురాలు ఫేషియల్ చేయించుకుంటున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. -
‘సివిల్స్’ టాపర్లకు వచ్చిన మార్కులెన్నో తెలుసా? UPSC పరీక్షల మార్కుల షీట్లు విడుదల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన సివిల్ సర్వీసెస్ పరీక్ష-2023 ఫలితాల్లో తొలి 10 మంది టాపర్లు సాధించిన మార్కులు ఇవే.. -
యూపీఎస్సీ మిస్సయిన వారికి డిట్టో ఇన్సూరెన్స్ జాబ్ ఆఫర్
UPSC: ఏళ్లపాటు కష్టపడి తృటిలో అవకాశం కోల్పోయిన యూపీఎస్సీ అభ్యర్థుల కోసం డిట్టో ఇన్సూరెన్స్ ఉద్యోగ అవకాశం ఇచ్చేందుకు ముందుకువచ్చింది. -
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల కోడ్ ఉల్లంఘనపై షర్మిలకు ఈసీ నోటీసులు
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
-
విప్రో క్యూ4 ఫలితాలు.. లాభంలో 8 శాతం క్షీణత
-
ఎర్రకోటపై కాంగ్రెస్ జెండా ఎగరడం పక్కా: సీఎం రేవంత్రెడ్డి
-
ముగిసిన తొలి విడత ఎన్నికల సమరం.. దాదాపు 60% పోలింగ్ నమోదు
-
ప్రచార సభలో తల్లి ఫొటో.. ఉద్వేగానికి లోనైన మోదీ