వడివడిగా ప్రైవేట్‌ అంతరిక్ష యాత్ర దిశగా...

ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్‌ విషయంలో స్పేస్‌ఎక్స్‌ మరో ముందడుగు వేసింది. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్‌ను 2021 నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు తెలిపింది......

Updated : 02 Feb 2021 09:34 IST

స్పేస్‌ఎక్స్‌ కీలక ప్రకటన

వాషింగ్టన్‌: ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్‌ విషయంలో స్పేస్‌ఎక్స్‌ మరో ముందడుగు వేసింది. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్‌ను 2021 నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు తెలిపింది. డ్రాగన్ క్రూ క్యాప్సుల్ ద్వారా నలుగురిని కక్ష్యలోకి పంపనున్నట్లు వెల్లడించింది.

‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థ సీఈఓ, పైలట్ జేర్డ్ ఐసాక్‌మన్ ఈ వ్యోమనౌకకు నాయకత్వం వహిస్తారని స్పేస్ఎక్స్ తెలిపింది. మరో ముగ్గురి పేర్లను ఈయన ఖరారు చేస్తారని వెల్లడించింది. త్వరలోనే వారి వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది. ‘‘జేర్డ్ ఐసాక్‌మన్ డ్రాగన్​వ్యోమనౌకలోని మూడు సీట్లను సాధారణ ప్రజలకు కేటాయిస్తారు. ఇన్‌స్పిరేషన్-4 సిబ్బంది డ్రాగన్ వ్యోమనౌకతో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకలో వాణిజ్య శిక్షణను పొందుతారు. ఆర్బిటాల్ మెకానిక్స్, శూన్య గురుత్వాకర్షణ(జీరో గ్రావిటీ)ను తట్టుకోవడం సహా ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నాం. అత్యవసర సన్నద్ధత, స్పేస్​సూట్-స్పేస్​క్రాఫ్ట్ ప్రవేశం, పూర్తిస్థాయి సిమ్యులేషన్​పై శిక్షణ అందనుంది’’ అని స్పేస్ఎక్స్ తెలిపింది. మిషన్ పూర్తయిన తర్వాత డ్రాగన్ స్పేస్‌క్రాఫ్ట్‌.. ఫ్లోరిడాలోని తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ అవుతుందని వెల్లడించింది.

ఇవీ చదవండి...

టెస్లాను‌ చీప్‌గా అమ్మేస్తామన్నా..!

చైనా నావికా సిబ్బందిలో మానసిక సమస్యలు

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని