వడివడిగా ప్రైవేట్ అంతరిక్ష యాత్ర దిశగా...
ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్ విషయంలో స్పేస్ఎక్స్ మరో ముందడుగు వేసింది. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్ను 2021 నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు తెలిపింది......
స్పేస్ఎక్స్ కీలక ప్రకటన
వాషింగ్టన్: ప్రైవేటు వ్యక్తులను అంతరిక్షంలోకి పంపేందుకు చేపట్టిన మిషన్ విషయంలో స్పేస్ఎక్స్ మరో ముందడుగు వేసింది. తొలి ప్రైవేటు అంతరిక్ష యాత్రగా భావిస్తున్న ఈ మిషన్ను 2021 నాలుగో త్రైమాసికంలో చేపట్టనున్నట్లు తెలిపింది. డ్రాగన్ క్రూ క్యాప్సుల్ ద్వారా నలుగురిని కక్ష్యలోకి పంపనున్నట్లు వెల్లడించింది.
‘షిఫ్ట్4 పేమేంట్స్’ సంస్థ సీఈఓ, పైలట్ జేర్డ్ ఐసాక్మన్ ఈ వ్యోమనౌకకు నాయకత్వం వహిస్తారని స్పేస్ఎక్స్ తెలిపింది. మరో ముగ్గురి పేర్లను ఈయన ఖరారు చేస్తారని వెల్లడించింది. త్వరలోనే వారి వివరాలను ప్రకటిస్తామని పేర్కొంది. ‘‘జేర్డ్ ఐసాక్మన్ డ్రాగన్వ్యోమనౌకలోని మూడు సీట్లను సాధారణ ప్రజలకు కేటాయిస్తారు. ఇన్స్పిరేషన్-4 సిబ్బంది డ్రాగన్ వ్యోమనౌకతో పాటు ఫాల్కన్ 9 వ్యోమనౌకలో వాణిజ్య శిక్షణను పొందుతారు. ఆర్బిటాల్ మెకానిక్స్, శూన్య గురుత్వాకర్షణ(జీరో గ్రావిటీ)ను తట్టుకోవడం సహా ఇతర అంశాలపై వారికి శిక్షణ ఇవ్వనున్నాం. అత్యవసర సన్నద్ధత, స్పేస్సూట్-స్పేస్క్రాఫ్ట్ ప్రవేశం, పూర్తిస్థాయి సిమ్యులేషన్పై శిక్షణ అందనుంది’’ అని స్పేస్ఎక్స్ తెలిపింది. మిషన్ పూర్తయిన తర్వాత డ్రాగన్ స్పేస్క్రాఫ్ట్.. ఫ్లోరిడాలోని తీరంలో నీటిపై సురక్షితంగా ల్యాండ్ అవుతుందని వెల్లడించింది.
ఇవీ చదవండి...
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మోదీ హయాంలో హక్కుల ఉల్లంఘన
ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో భారత్లో మానవ హక్కుల ఉల్లంఘన పెచ్చుమీరిందని అమెరికాకు చెందిన స్వతంత్ర సంస్థ- ‘కాంగ్రెషనల్ రీసెర్చ్ సర్వీస్’ (సీఆర్ఎస్) ఆరోపించింది. -
రెండోదశ పోలింగ్కు ఎండ ముప్పు
దేశంలోని పలు రాష్ట్రాల్లో శుక్రవారం నుంచి అయిదు రోజుల పాటు ఎండ తీవ్రత అధికంగా ఉండే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ గురువారం తెలిపింది. -
పాకిస్థాన్ యువతికి భారతీయుడి గుండె
అనారోగ్యంతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పాకిస్థాన్ యువతిని భారతీయుడి గుండె కాపాడింది. పాక్కు చెందిన ఆయిషా రషాన్(19) గుండె జబ్బుతో బాధపడుతూ 2019లో చెన్నై అడయారు మలర్ ఆసుపత్రిని ఆశ్రయించారు. -
జైలు అధికారుల నిర్లక్ష్యం.. ఖైదీకి రూ.2లక్షల పరిహారం ఇవ్వాలంటూ ఎంహెచ్ఆర్సీ ఆదేశం
విచారణ ఖైదీ ప్రాథమిక హక్కును ఉల్లఘించారంటూ మహారాష్ట్ర మానవ హక్కుల కమిషన్(MHRC) మండిపడింది. సదరు ఖైదీకి రూ. 2 లక్షల పరిహారం అందించాలని రాష్ట్ర హోంశాఖను ఆదేశించింది.
తాజా వార్తలు (Latest News)
-
తితిదే వద్దనున్న రూ.2 వేల నోట్లు మార్పిడి!
-
సివిల్స్ ఫలితాల్లో వికారాబాద్ జిల్లా యువకుడి పొరపాటు
-
ఎంత దెబ్బకు అంత బ్యాండేజ్ కాదా!
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
-
ముయిజ్జు పార్టీకి ‘సూపర్ మెజార్టీ’.. భారత్ స్పందనిదే...
-
బంగ్లాదేశ్ను చూసి సిగ్గు పడుతున్నాం - పాకిస్థాన్ ప్రధాని