James Webb Telescope:జేమ్స్ వెబ్ టెలిస్కోపు..ప్రత్యేకతలెన్నో
ఖగోళ పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించగల సామర్థ్యం ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్టీ)’ సొంతం. దీని తయారీ కోసం శాస్త్రవేత్తలు అనేక కొత్త పరిజ్ఞానాలను అభివృద్ధి చేశారు. అత్యాధునిక ఆప్టిక్ వ్యవస్థతోపాటు...
ఖగోళ పరిశోధనలను కొత్త పుంతలు తొక్కించగల సామర్థ్యం ‘జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోపు (జేడబ్ల్యూఎస్టీ)’ సొంతం. దీని తయారీ కోసం శాస్త్రవేత్తలు అనేక కొత్త పరిజ్ఞానాలను అభివృద్ధి చేశారు. అత్యాధునిక ఆప్టిక్ వ్యవస్థతోపాటు పలు శక్తిమంతమైన సైన్స్ పరికరాలను అందులో పొందుపరిచారు. భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరాన సూర్యుడు-భూమి వ్యవస్థకు సంబంధించిన లాంగ్రేంజ్ పాయింట్-2 (ఎల్2) ప్రదేశంలో.. అత్యంత శీతల వాతావరణంలో పనిచేసేలా దాన్ని తీర్చిదిద్దారు. సంబంధిత విశేషాలివీ..
మాయా కవచం
సూర్యకాంతిని అడ్డుకోవడానికి జేడబ్ల్యూఎస్టీలో ఐదు పొరలతో సన్షీల్డ్ అమర్చారు. అది ప్లాస్టిక్ను పోలిన కాప్టాన్ అనే పదార్థంతో తయారైంది. దానికి అల్యూమినియం, డోప్డ్ సిలికాన్ పూతపూశారు. పొరల మధ్య శూన్యం ఉంటుంది. ఆ శూన్యత కూడా ఇన్సులేటర్గా పనిచేస్తుంది. ప్రతి పొరనూ భిన్నంగా తయారుచేశారు. దాని మందం కూడా విభిన్నంగానే ఉంటుంది. సూక్ష్మ ఉల్కలు ఢీ కొట్టినా ఈ కవచంలో సామర్థ్యంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా రూపొందించారు. వెలుపల ఉండే మొదటి పొరపై సూర్యకాంతి నేరుగా పడుతుంది. ఫలితంగా 85 డిగ్రీల సెల్సియస్ వేడిని ఎదుర్కొంటుంది. అయితే ఐదో పొరకు చేరేసరికి ఆ వేడికి అడ్డుకట్ట పడి, అంతరిక్షంలో సహజసిద్ధంగా ఉండే శీతల వాతావరణం ఉంటుంది. ఫలితంగా టెలిస్కోపు దర్పణాలు మైనస్ 233 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలో కొనసాగుతాయి. సూర్యుడి వైపు ఉండే పొర.. 2లక్షల వాట్ల మేర సౌర రేడియోధార్మికత తాకుతుంది. అంతిమంగా అవతలి వైపునకు చేరేది 0.02 వాట్ల మాత్రమే. ఈ సన్షీల్డ్ 22 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు కలిగి ఉంటుంది. అంటే దాదాపు టెన్నిస్ కోర్టు పరిమాణమన్నమాట.
కుదిపేసి చూస్తారు
ఏదైనా ఎలక్ట్రానిక్ సాధనం పనిచేయకపోతే దాన్ని అటూఇటు ఊపడం, తట్టిచూడటం వంటివి చేస్తుంటాం. అదే సూత్రాన్ని జేడబ్ల్యూఎస్టీలో పాటిస్తున్నారు. ఇందులో ఏదైనా ఇబ్బంది వస్తే దాన్ని నిర్దేశిత రీతిలో కుదిపేసేలా అల్గోరిథమ్లను తయారుచేశారు. అప్పటికీ పనిచేయకపోతే.. టెలిస్కోపును పలుమార్లు సవ్య దిశలో, ఆ తర్వాత అపసవ్య దిశలో భ్రమణానికి గురిచేసి చూస్తారు.
అత్యాధునిక పరికరాలు
జేడబ్ల్యూఎస్టీలో దర్పణాలతో కూడిన ఆప్టిక్ వ్యవస్థకు తోడు నాలుగు సైన్స్ పరికరాలు ప్రధానమైనవి. అవి..
నియర్ ఇన్ఫ్రారెడ్ కెమెరా: ఇది అత్యంత సున్నితమైంది.
నియర్ ఇన్ఫ్రారెడ్ స్పెక్ట్రోగ్రాఫ్: ఇది నక్షత్రాలు లేదా గెలాక్సీల కాంతిని నిర్దేశిత సెక్ట్రమ్లోకి మారుస్తుంది. దీనికోసం మైక్రోషట్టర్ అరేను ప్రత్యేకంగా రూపొందించారు. ఒకేసారి వంద గెలాక్సీలను పరిశీలించేలా దీన్ని తీర్చిదిద్దారు.
మిడ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజర్: కొన్ని మూలకాల సంకేతాలను పట్టుకుంటుంది. ఇప్పుడిప్పుడే ఏర్పడుతున్న నక్షత్రాలను స్పష్టంగా చూపుతుంది.
నియర్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్లిట్లెస్ స్పెక్ట్రోగ్రాఫ్: నక్షత్రాల వద్ద ఉండే గ్రహ వ్యవస్థలను అధ్యయనం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. గ్రహాంతర జీవం ఆనవాళ్లను పసిగడుతుంది.
ప్రయోజనాలివీ..
> 1,380 కోట్ల ఏళ్ల కిందట బిగ్బ్యాంగ్ అనే విస్ఫోటంతో విశ్వం ఏర్పడిందని శాస్త్రవేత్తలు నమ్ముతున్నారు. ఆ సిద్ధాంతాన్ని జేడబ్ల్యూఎస్టీ పరిశీలిస్తుంది. బిగ్బ్యాంగ్ అనంతరం తొలి 20 కోట్ల సంవత్సరాలపాటు చీకటి రాజ్యమేలింది. అప్పుడు గ్యాస్, కృష్ణపదార్థం (డార్క్మ్యాటర్) ఆవరించింది. తర్వాత ఒక్కసారిగా నక్షత్రాలు పుట్టుకురావడం మొదలైంది. ఆపై కొన్ని కోట్ల ఏళ్లకు అవి గెలాక్సీలుగా ఏర్పడ్డాయి. తొలితరం తారలు, నక్షత్ర మండలాలను జేడబ్ల్యూఎస్టీ పరిశీలిస్తుంది. సుదూర గెలాక్సీలపై సునిశిత పరిశీలనలు సాగించొచ్చు.
> నక్షత్రాలు, గ్రహ వ్యవస్థలు పుట్టుకొస్తున్న తీరును చూపుతుంది.
> మన పాలపుంత గెలాక్సీలోని నక్షత్రాల వద్ద ఉన్న గ్రహాలను పరిశీలిస్తుంది. ఆవాసయోగ్య పరిస్థితులను గుర్తిస్తుంది.
> ఇతర నక్షత్రాల చుట్టూ ఉన్న గ్రహాల్లోని రసాయన తీరుతెన్నుల గురించి తెలుసుకోవచ్చు. నీరు, కార్బన్ డైఆక్సైడ్, మిథేన్ వంటివాటిని బాగా గుర్తించొచ్చు.
> భూవాతావరణంలోని నిర్దిష్టమైన రసాయన తీరుతెన్నులు జీవం మనుగడకు దోహదపడుతున్నాయి. సహజ చర్యల ద్వారా అటు కార్బన్ డైఆక్సైడ్తోపాటు ఇటు మిథేన్ ఉత్పత్తి అవుతుంటుంది. అయితే జీవుల ద్వారా వంద రెట్లు ఎక్కువ మిథేన్ ఉత్పత్తవుతుంది. భూమి మీద ఈ వాయువు చాలా ఎక్కువగా ఉండటానికి జీవం ఉనికే కారణం. ఇతర గ్రహాల్లో కార్బన్ డైఆక్సైడ్, మిథేన్కు మధ్య ఉన్న సున్నితమైన సమతౌల్యాన్ని నిశితంగా పరిశీలిస్తే అక్కడి జీవం ఉనికికి సంబంధించిన ఆనవాళ్లను పట్టుకోవచ్చు. జేడబ్ల్యూఎస్టీ ఇందుకు సాయపడుతుంది. తద్వారా.. విశ్వంలో మనం ఏకాకులమా అన్న ప్రశ్నకు జవాబులు కనుగొనవచ్చు.
> భూమి పరిమాణంలో ఉండి, ఆవాసయోగ్యత కలిగిన గ్రహాలు మన గెలాక్సీలోనే 1200 కోట్లు ఉండొచ్చని విశ్లేషిస్తున్నారు. జేడబ్ల్యూఎస్టీ.. మనకు 40 కాంతి సంవత్సరాల దూరంలోని ట్రాపిస్ట్-1 వ్యవస్థను వీక్షించనుంది. ఆ నక్షత్రం.. చాలా చిన్నగా గురు గ్రహం పరిమాణంలో ఉంది. దాని చుట్టూ ఏడు గ్రహాలు తిరుగుతున్నాయి. అందులో మూడింటిపై జీవం మనుగడకు అనువైన పరిస్థితులు ఉండొచ్చని అంచనా.
> మన సౌర కుటుంబంలోని గ్రహాలు, వాటి చందమామలపైనా జేడబ్ల్యూఎస్టీ అధ్యయనం చేయగలదు. తోకచుక్కలు, గ్రహశకలాలు, చిన్నపాటి గ్రహాలనూ శోధిస్తుంది.
ఏమిటీ ఎల్2? అక్కడికే ఎందుకు?
ఆకాశంలో మసకమసకగా ఉన్న నక్షత్రాలను నగరాల నుంచి మనం చూడలేం. విద్యుత్ దీపాల ప్రకాశత్వమే అందుకు కారణం. వాటిని చూడాలంటే గ్రామాలకు వెళ్లాల్సిందే. జేడబ్ల్యూఎస్టీ.. మసకమసకగా ఉన్న గెలాక్సీలను చూడాలి. అయితే భూమి.. పరారుణ కాంతిలో చాలా ప్రకాశవంతంగా ఉంటుంది. అందువల్ల అది భూమి, చంద్రుడి నుంచి దూరం జరగాలి. అదే సమయంలో జేడబ్ల్యూఎస్టీ దర్పణాలు మైనస్ 233 డిగ్రీల సెల్సియస్ చల్లదనాన్ని కలిగి ఉండాలి. అందుకే జేడబ్ల్యూఎస్టీని లాంగ్రేంజ్ పాయింట్-2 (ఎల్2) అనేక ప్రత్యేక ప్రదేశంలోకి పంపుతున్నారు. అది భూమికి దాదాపు 15 లక్షల కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఎల్2 వద్ద సూర్యుడి, భూమి గురుత్వాకర్షణ శక్తులు కలిసి స్థిరమైన పరిస్థితులను ఏర్పరుస్తాయి. ఆ ప్రాంతంలో ఒక భారీ గొడుగు లాంటి కవచాన్ని ఏర్పాటు చేస్తే.. సూర్యకాంతి, భూమి, చంద్రుడి నుంచి వచ్చే వెలుగులను ఏకకాలంలో అడ్డుకోవచ్చు. ఫలితంగా ఈ షీల్డ్కు రెండో పక్క ఉన్న టెలిస్కోపు భాగంలో శీతల పరిస్థితులు నెలకొంటాయి. అక్కడి నుంచి స్థిరంగా విశ్వవీక్షణ చేయవచ్చు. ఎల్2 ప్రదేశంలోకి జేడబ్ల్యూఎస్టీ రెండు వారాల్లో చేరుకుంటుంది. అక్కడ.. భూమి వెంటే ఉంటూ 365 రోజులకోసారి సూర్యుడిని చుట్టి వస్తుంది.
టైమ్ మెషీన్ తరహాలో..
టెలిస్కోపులు టైమ్ మెషీన్ల వంటివి. కాంతి సెకనకు 3 లక్షల కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నప్పటికీ.. సుదూర విశ్వంలోని కొన్ని ప్రాంతాల నుంచి అది మనల్ని చేరడానికి వందల కోట్ల ఏళ్లు పడుతుంది. ఆ పురాతన కాంతిని ఒడిసిపట్టడం ద్వారా మునుపటి పరిస్థితులను తెలుసుకోవచ్చు. కాంతిలో బోలెడు సమాచారం ఉంటుంది. ఒక ప్రదేశానికి సంబంధించిన రసాయన తీరుతెన్నులను.. అక్కడి నుంచి వచ్చే కాంతి తరంగదైర్ఘ్యాలను పరిశీలించడం ద్వారా తెలుసుకోవచ్చు. సౌర కుటుంబానికి అత్యంత సమీపంలోని ఆల్ఫా సెంచోరి నుంచి కాంతి రావడానికే 4 ఏళ్లు పడుతుంది.
- ఈనాడు ప్రత్యేక విభాగం
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
హైదరాబాద్ విమానాశ్రయంలో ఏఏఐ వాటా విక్రయం?
-
20 నుంచి పవన్ రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం
-
మహిళకు శస్త్రచికిత్స చేసి.. తల్లీ బిడ్డను కాపాడిన దర్శి అభ్యర్థి
-
నా భర్తపై రెబల్గా పోటీ చేస్తా.. టెక్కలి వైకాపా అభ్యర్థి దువ్వాడ భార్య వాణి
-
పేదరాలు బుట్టమ్మ ఆస్తులు రూ.161.21 కోట్లు
-
మనిషికి రూ.200.. యువతకు పెట్రోలు కూపన్లు