Third Wave: మూడో వేవ్కు ఇదే సంకేతమా?
కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలన్నీ కఠిన ఆంక్షల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయి. అయితే, మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని.. అందరూ నిబంధనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశాయి.....
ముంబయి: కరోనా రెండో దశ కాస్త తగ్గుముఖం పట్టడంతో రాష్ట్రాలన్నీ కఠిన ఆంక్షల నుంచి ప్రజలకు విముక్తి కల్పించాయి. అయితే, మహమ్మారి ముప్పు ఇంకా తొలగిపోలేదని.. అందరూ నిబంధనల్ని పాటించాల్సిందేనని స్పష్టం చేశాయి. కానీ, ప్రజలకు అవేవీ పట్టనట్లే కనిపిస్తోంది. దేశవ్యాప్తంగా భారీ జనసమూహ కార్యక్రమాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మూడో వేవ్ ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఇదిలా ఉంటే.. గత రెండు వేవ్ల ప్రారంభం తొలి నాళ్లలో మహారాష్ట్ర, ముంబయిలో కేసులు భారీ స్థాయిలో నమోదయ్యాయి. తాజాగా మరోసారి మహారాష్ట్రలో కేసులు పెరుగుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఇదే మూడో వేవ్ ప్రారంభానికి సంకేతమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. జులై నెలలో తొలి 11 రోజుల్లో మహారాష్ట్రలో 88,130 కేసులు నమోదయ్యాయి. కేరళ తర్వాత మహారాష్ట్రలోనే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. రెండో వేవ్ నేపథ్యంలో విధించిన లాక్డౌన్ తర్వాత మహారాష్ట్రలో రోజువారీ కేసులు గణనీయంగా తగ్గాయని.. జులైలో తిరిగి విజృంభిస్తున్నాయని ఫోర్టిస్ హీరానందని ఆసుపత్రిలో ప్రముఖ వైద్యనిపుణుడు డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. రాష్ట్రంలో పలు జిల్లాల్లో మరోసారి భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూస్తున్నాయని పలువురు అధికారులు తెలిపారు. కొల్హాపూర్ జిల్లాలో రోజుకి దాదాపు 3000 కేసులు పాజిటివ్గా తేలడం ఆందోళన కలిగిస్తోందన్నారు. అయితే, ముంబయిలో మాత్రం ఇప్పటికీ రోజువారీ కేసుల సంఖ్య తక్కువగానే ఉంది. గత మూడు రోజుల్లో సగటున రోజుకి దాదాపు 600 కేసులు వెలుగులోకి వచ్చాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో గత రెండు వేవ్లకు ముందు నెలకొన్న పరిస్థితులే ఇప్పుడూ పునరావృతమవుతున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైద్యారోగ్యం, ప్రభుత్వం, పాలనా యంత్రాంగం వెంటనే అప్రమత్తమై మహమ్మారి వ్యాప్తి అదుపునకు కావాల్సిన చర్యలు చేపట్టాలని సూచిస్తున్నారు.
కొవిడ్-19 మార్గదర్శకాలను ఉల్లంఘిస్తూ నిర్వహిస్తున్న భారీ జనసమూహ కార్యక్రమాల విషయంలో ప్రజలు, ప్రభుత్వాలు నిశ్చింతగా ఉండడంపై భారతీయ వైద్య మండలి (ఐఎంఏ) సోమవారం ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇలాంటి కార్యక్రమాలు కొవిడ్ మూడో దశకు దారితీసి విస్తృత వ్యాప్తి కారకాలు కావొచ్చని స్పష్టంచేసింది. తీర్థయాత్రలు, పర్యాటక ప్రాంతాల సందర్శనలు, మతపరమైన కార్యక్రమాలు వంటివి అవసరమేనని, అదే సమయంలో కరోనా నేపథ్యంలో కొద్ది నెలలు ఆగడం మంచిదని స్పష్టంచేసింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గత అనుభవాలు, చరిత్రను పరిశీలిస్తే కొవిడ్-19 మూడో దశ తథ్యమని వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
ఎయిరిండియాకు విమానాలను లీజుకు ఇవ్వడంలో అవకతవకలు జరిగాయంటూ నమోదైన కేసును కొట్టివేస్తూ.. నిందితుడిగా ఉన్న అప్పటి పౌరవిమానయాన శాఖ మంత్రి ప్రఫుల్ పటేల్కు సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. -
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
ఇతరులను వేధించడం, వారిపై కన్నెర్ర చేయడం కాంగ్రెస్ సంస్కృతి అని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. -
నా భర్తను వేధిస్తున్నారు..: సీఎం కేజ్రీవాల్ సతీమణి ఆరోపణలు
అరవింద్ కేజ్రీవాల్ను ఈడీ అధికారులు వేధిస్తున్నారని ఆయన సతీమణి సునీత ఆరోపించారు. -
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
సాయుధ బలగాలపై దేశ ప్రజలకు పూర్తి విశ్వాసం ఉందని, దేశ సరిహద్దులు పూర్తి సురక్షితమని రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh) వెల్లడించారు. -
కేజ్రీవాల్కు ఈడీ కస్టడీ పొడిగింపు.. కోర్టులో సీఎం స్వీయ వాదనలు!
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు ఈడీ కస్టడీని పొడిగిస్తూ రౌస్ అవెన్యూ న్యాయస్థానం నిర్ణయించింది. -
జైలు నుంచి కేజ్రీవాల్ పాలన.. ‘సీఎంగా కొనసాగడానికి అడ్డంకి ఏంటీ?’: దిల్లీ హైకోర్టు
దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్కు న్యాయస్థానంలో ఊరట లభించింది. జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపడాన్ని అడ్డుకోలేమని దిల్లీ హైకోర్టు తేల్చి చెప్పింది. -
‘ఎంపీగా లేకపోతేనేం’.. వరుణ్ గాంధీ భావోద్వేగ లేఖ
Varun Gandhi: ఈ ఎన్నికల్లో టికెట్ కోల్పోయిన భాజపా ఎంపీ వరుణ్గాంధీ తన నియోజకవర్గ ప్రజలకు భావోద్వేగంతో కూడిన లేఖ రాశారు. ఎంపీగా లేకపోయినా.. ఓ కుమారుడిలా ప్రజలకు సేవ చేస్తానన్నారు. -
రాజకీయ ఒత్తిళ్లతో న్యాయవ్యవస్థకు ముప్పు.. సీజేఐకి 600 మంది లాయర్ల లేఖ
Lawyers letter to CJI: సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్కు 600 మంది ప్రముఖ న్యాయవాదులు లేఖ రాశారు. కొందరు స్వార్థమూకలు న్యాయవ్యవస్థను ప్రభావితం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. -
టికెట్ రాలేదని ఆత్మహత్యాయత్నం.. చికిత్స పొందుతూ ఎంపీ కన్నుమూత
Erode MP Ganeshamurthi Suicide: టికెట్ రాలేదన్న మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేసిన ఈరోడ్ ఎంపీ.. చికిత్స పొందుతూ గురువారం కన్నుమూశారు. -
కసబ్ను పట్టుకున్న సదానంద్ దాతెకు ఎన్ఐఏ పగ్గాలు
‘ఉగ్రవాద వ్యతిరేక దళం’ అధిపతిగా ఉన్న సదానంద్ వసంత్ దాతెను ‘జాతీయ దర్యాప్తు సంస్థ’ (ఎన్ఐఏ) డైరెక్టర్ జనరల్గా నియమిస్తూ కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. -
ఆ డబ్బు ఎక్కడుందో కేజ్రీవాల్ నేడు చెబుతారు
మద్యం విధానానికి సంబంధించిన మనీలాండరింగ్ కేసులో తన భర్త, దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో ఆయన సతీమణి సునీత బుధవారం సంచలన ప్రకటన చేశారు. -
నాలుగు చిలుకలకు రూ.444 టికెట్!
స్వేచ్ఛగా విహరించాల్సిన చిలుకలు బస్సులో ప్రయాణించిన కారణంగా వందల రూపాయలతో టికెట్ తీసుకోవాల్సి వచ్చింది. -
రాష్ట్రపతి పాలన విధిస్తే.. అది రాజకీయ ప్రతీకారమే
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ అరెస్టు నేపథ్యంలో దేశ రాజధాని దిల్లీలో రాష్ట్రపతి పాలన విధిస్తే అది రాజకీయ ప్రతీకారమే అవుతుందని దిల్లీ మంత్రి ఆతిశీ పేర్కొన్నారు. -
కేరళ సీఎం కుమార్తెపై ఈడీ కేసు నమోదు
కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మనీ లాండరింగ్ కేసు నమోదు చేసింది. -
‘ఎయిరిండియా’ రెక్కలను ఢీకొన్న ఇండిగో
చెన్నై వెళ్లేందుకు సిద్ధమై రన్వే క్లియరెన్సు కోసం ఆగి ఉన్న ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానం రెక్కలను దర్భంగా (బిహార్)కు బయలుదేరుతున్న ఇండిగో ఎయిర్క్రాఫ్ట్ ఢీకొంది. -
చివరి ఓటరునూ చేరుకోవాలని!
దేశంలోని ప్రతి ఓటరూ తన ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎన్నికల సంఘం భగీరథ ప్రయత్నమే చేస్తుంది. ఓటర్లు ఎక్కడ ఉన్నా వారి కోసం పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తుంది. -
హుక్కా బార్లో సోదాలు.. పోలీసుల అదుపులో బిగ్బాస్ విజేత మునావర్ ఫారూకీ
ప్రముఖ స్టాండప్ కమెడియన్, హిందీ బిగ్బాస్-17 విజేత మునావర్ ఫారూకీ మరోసారి వివాదంలో నిలిచారు. -
ఇలా ప్రవేశం.. అలా ఆమోదం
దేశానికి, ప్రజలకు అవసరమయ్యే శాసనాలు సమర్థవంతంగా, లోపరహితంగా ఉండటం ఎంతైనా అవసరం. అంతటి ప్రాధాన్యం ఉంది కనుకే చట్టసభల్లో వాటిపై విస్తృతమైన చర్చలు, సంప్రదింపులు జరుపుతుంటారు. -
రూ.245 కోట్ల డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్రలోని సాంగ్లీ జిల్లాలో ముంబయి పోలీసులు భారీగా మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నారు. -
మహువా, హీరానందానీలకు మళ్లీ ఈడీ సమన్లు
విదేశీ మారక ద్రవ్య నిర్వహణ చట్టం (ఫెమా) ఉల్లంఘన కేసులో టీఎంసీ నేత మహువా మొయిత్రా, దుబాయ్ వ్యాపారవేత్త దర్శన్ హీరానందానీలకు బుధవారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మళ్లీ సమన్లు జారీ చేసింది. -
ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో ప్రవర్తన మారకూడదు
ప్రజల ప్రవర్తనలో మార్పు ఈడీ సోదాల కోసమో, పోలీసులను చూసో రాకూడదని, అది మనసులో నుంచి వివేకంతో రావాలని ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఎన్నికల ముంగిట.. అవినీతి కేసులో ప్రఫుల్ పటేల్కు క్లీన్ చిట్
-
భవిష్యత్ తరాల కోసం తెదేపాకు ఓటు వేయాలి: భువనేశ్వరి
-
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
-
ఇతరులను బెదిరించడం కాంగ్రెస్ సంస్కృతి.. ‘లాయర్ల లేఖ’పై ప్రధాని మోదీ
-
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్సభ ఎన్నికల్లో పోటీ!
-
భుజంగరావు, తిరుపతన్నకు 5 రోజుల పోలీసు కస్టడీ