Sputnik Light: స్పుత్నిక్‌ లైట్ పరీక్షలకు డీసీజీఐ ఓకే..!

రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్ ఒక్క డోసు టీకా మూడో దశ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించేందుకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి మంజూరు

Published : 15 Sep 2021 10:43 IST

దిల్లీ: రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్‌ లైట్ ఒక్క డోసు టీకా మూడో దశ ప్రయోగాలను భారత్‌లో నిర్వహించేందుకు కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ(డీసీజీఐ) అనుమతి మంజూరు చేసినట్లు సమాచారం. ఈ మేరకు కొన్ని ఆంగ్ల మీడియా కథనాలు పేర్కొన్నాయి. డీసీజీఐ అనుమతులు రావడంతో అతి త్వరలో ఈ టీకా ప్రయోగాలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ వారంలోనే ప్రయోగాల్లో పాల్గొనే వారి ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ ప్రారంభించనున్నట్లు సదరు కథనాలు పేర్కొన్నాయి. మూడో దశ ట్రయల్స్‌ నిమిత్తం ఇప్పటికే కొన్ని టీకాలను నాణ్యత, భద్రత తనిఖీలకు పంపినట్లు సమాచారం. 

కరోనా మహమ్మారి నియంత్రణ కోసం రష్యాకు చెందిన రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌(ఆర్‌డీఐఎఫ్‌) ఈ స్పుత్నిక్‌ లైట్‌ టీకాను అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాల మాదిరి కాకుండా ఇది ఒక్క డోసు వ్యాక్సిన్‌. ఇది కరోనాపై 78.6శాతం నుంచి 83.7శాతం సమర్థతతో పనిచేస్తుందని ఆర్‌డీఐఎఫ్‌ వెల్లడించింది. దీన్ని భారత్‌లోకి తీసుకొచ్చేందుకు డాక్టర్‌ రెడ్డీస్‌ రష్యాతో ఒప్పందం చేసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని