Sputnik V: వచ్చే వారం నుంచి మార్కెట్లోకి..!
రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ను వచ్చే వారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
కేంద్ర ప్రభుత్వం వెల్లడి
దిల్లీ: దేశంలో కరోనా వైరస్ మహమ్మారి విలయతాండవం చేస్తున్న వేళ వ్యాక్సిన్ కొరత రాష్ట్రాలను వేధిస్తోంది. ఈ సమయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్ వ్యాక్సిన్ను వచ్చే వారం నుంచి మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందని వెల్లడించింది. అంతేకాకుండా అమెరికా ఎఫ్డీఏ, ప్రపంచ ఆరోగ్య సంస్థ అనుమతి పొందిన ఏ టీకానైనా రాష్ట్రాలు దిగుమతి చేసుకోవచ్చని పేర్కొంది. వీటికి ఒకటి, రెండు రోజుల్లోనే రాష్ట్రాలకు అనుమతి ఇస్తామని తెలిపింది. వ్యాక్సిన్ల దిగుమతి కోసం ఇప్పటివరకూ ఎలాంటి దరఖాస్తులు పెండింగ్లో లేవని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. భారత్లో వ్యాక్సిన్ పంపిణీ చేసేందుకు ఇప్పటికే ఫైజర్ సంస్థ సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా నీతి ఆయోగ్ (హెల్త్) సభ్యుడు డాక్టర్ వీకే పాల్ మాట్లాడుతూ.. ‘విదేశీ టీకాల దిగుమతికి ఒకట్రెండు రోజుల్లో అనుమతి మంజూరు అవుతుంది. డబ్ల్యూహెచ్వో, ఎఫ్డీఏ ఆమోదించిన టీకాల దిగుమతికి అనుమతి ఇస్తాం. టీకాల దిగుమతి కోసం ఎలాంటి దరఖాస్తులు పెండింగ్లో లేవు. ఫైజర్, మోడెర్నా టీకా సంస్థలు ఎంఈఏను ఇప్పటికే సంప్రదించాయి. భారత్లో టీకా ఉత్పత్తికి జాన్సన్ అండ్ జాన్సన్ సిద్ధంగా ఉంది. ఇతర సంస్థలకు కొవాగ్జిన్ తయారీ అప్పగించాలనే డిమాండ్ ఉంది. ఇతర సంస్థల్లో కొవాగ్జిన్ ఉత్పత్తిపై భారత్ బయోటెక్తో చర్చించాం. అందుకు ఆ కంపెనీ సానుకూలంగా స్పందించింది. కొవాగ్జిన్ను తయారీకి బీఎస్ఎల్3 ప్రమాణాలు కలిగిన ల్యాబ్ అవసరం’’ అని వివరించారు.
ఇక, రష్యా అభివృద్ధి చేసిన స్పుత్నిక్-వీ టీకా వినియోగానికి భారత్ ఇదివరకే ఆమోదం తెలిపింది. ఇప్పటికే టీకాలు మాస్కో నుంచి హైదరాబాద్ చేరుకున్నాయి. తొలి విడతలో భాగంగా 1.5 లక్షల వయల్స్ భారత్కు అందాయి. భారత్లో స్పుత్నిక్-వి క్లినికల్ ట్రయల్స్ నిర్వహించిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్కు చేరాయి. కేంద్ర ఔషధ నియంత్రణ సంస్థ ఆమోదం తర్వాత పంపిణీ చేసేందుకు రెడ్డీస్ ల్యాబ్స్ సిద్ధంగా ఉంచింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముక్తార్ అన్సారీ మృతి
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్