Tamil Nadu: సీఎం స్టాలిన్పై ఆరోపణలు.. భాజపా అధ్యక్షుడిపై పరువునష్టం కేసు
తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin)పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్ అన్నామలైపై (Annamalai) పరువునష్టం దావా దాఖలైంది.
చెన్నై: డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ (MK Stalin)పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్ అన్నామలైపై న్యాయపరమైన చర్యలకు డీఎంకే ఉపక్రమించింది. ఇందులో భాగంగా అన్నామలై నిరాధార ఆరోపణలు చేశారంటూ స్థానిక సిటీ సివిల్ కోర్టులో పరువునష్టం దావా దాఖలైంది. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తరఫున సిటీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ దేవరాజన్ ఈ కేసు వేశారు.
‘ఏప్రిల్ 14న ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై.. ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ పరువుకు భంగం కలిగించే విధంగా వ్యాఖ్యలు చేశారు. దీంతోపాటు కొన్ని వీడియోలు కూడా ప్రదర్శించారు. అవన్నీ అవాస్తవాలే. కేవలం సీఎం స్టాలిన్ ప్రతిష్ఠను దిగజార్చే ఉద్దేశంతో చేసినవే’ అని అన్నామలైకు వ్యతిరేకంగా వేసిన దావాలో పేర్కొన్నారు. మరోవైపు ఇదే అంశంపై మాట్లాడిన డీఎంకే అధికార ప్రతినిధి టీకేఎస్ ఎలాంగోవన్.. అన్నామలైకు తగిన శిక్ష పడాలంటే ఇదే సరైన చర్య అన్నారు.
ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్పై అవినీతి ఆరోపణలు చేసిన భాజపా రాష్ట్ర చీఫ్ అన్నామలై క్షమాపణలు చెప్పాలని అధికార పార్టీ డీఎంకే ఇదివరకే లీగల్ నోటీసులు పంపింది. మంత్రి ఉదయనిధి స్టాలిన్, దురై మురుగన్, ఈవీ వేలు, సెంథిల్ బాలాజీలతోపాటు పలువురు డీఎంకే నేతలు కూడా అన్నామలైకు నోటీసులు పంపించారు. అయితే, క్షమాపణలు చెప్పేందుకు నిరాకరించిన అన్నామలై.. ఈ వ్యవహారంపై చట్టపరమైన చర్యలకు తాను సిద్ధంగానే ఉన్నానని ప్రకటించారు. ఈ క్రమంలోనే ఆయనపై ముఖ్యమంత్రి స్టాలిన్ పరువునష్టం దావా వేశారు.
ఇదిలాఉంటే, 2011లో డీఎంకే అధికారంలో ఉన్న సమయంలో చెన్నై మెట్రో రైల్ కాంట్రాక్టు విషయంలో అవినీతి చోటుచేసుకుందని అన్నామలై ఆరోపిస్తున్నారు. ఆ చెల్లింపులు కూడా షెల్ కంపెనీల ద్వారా జరిగాయన్నారు. వీటితోపాటు డీఎంకే ముఖ్య నేతల ఆస్తులు.. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న దానికంటే భారీ స్థాయిలో పెరిగాయన్నారు. వీటికి సంబంధించి ‘డీఎంకే ఫైల్స్’ పేరుతో అన్నామలై విడుదల చేసిన వీడియోలు, చేసిన ఆరోపణలను తమిళనాడు ప్రభుత్వం తీవ్రంగా పరిగణిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
త్వరలో ఫీల్డింగ్కు వస్తా.. 40 ఓవర్లూ మైదానంలో ఉంటా: సూర్య
-
వైకాపా అడ్డుపడుతోంది.. మీ ఇళ్ల వద్దకు రాలేకపోతే మన్నించండి: సునీత
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
దుబాయ్ నుంచి ఆలస్యంగా పునియా, సుజీత్.. ఒలింపిక్ క్వాలిఫయర్స్ మిస్
-
నెస్లే ఉత్పత్తులపై ఆరోపణలు.. FSSAIకి సీసీపీఏ ఆదేశాలు
-
నేడు చంద్రబాబు తరఫున నామినేషన్.. నారా భువనేశ్వరి ప్రత్యేక పూజలు