The Elephant Whisperers: బొమ్మన్, బెల్లీలకు సీఎం స్టాలిన్ ఘన సన్మానం.. నగదు గిఫ్ట్.. ఇంకా..!
ఆస్కార్ అవార్డు సాధించిన ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ (The Elephant Whisperers) డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రధారులైన బొమ్మన్, బెల్లీ దంపతులను తమిళనాడు సీఎం స్టాలిన్ ఘనంగా సన్మానించారు.
చెన్నై: దిక్కులేని ఏనుగులను (Elephants) చేరదీసి వాటి సంరక్షణను చూసే బొమ్మన్, బెల్లి దంపతుల ఇతివృత్తంగా తెరకెక్కిన భారతీయ లఘుచిత్రం ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ (The Elephant Whisperers) ప్రతిష్ఠాత్మక ఆస్కార్ అవార్డు (Oscar 2023) సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఇంత గొప్ప అవార్డు సాధించడంపై దేశ వ్యాప్తంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్న వేళ తమిళనాడు సీఎం స్టాలిన్(Stalin) కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ డాక్యుమెంటరీలో ప్రధాన పాత్రధారులైన బొమ్మన్, బెల్లీ దంపతులను కలిసి వారికి నగదు బహుమతితో ఘనంగా సత్కరించారు. నీలగిరి జిల్లాలోని మదుమలైలో ఏనుగులను తమ సొంత బిడ్డల్లా సాకుతూ ప్రశంసలు అందుకొంటున్న ఆ దంపతులకు ఒక్కొక్కరికీ రూ.లక్ష చొప్పున నగదు చెక్కులను అందజేశారు. వారికి శాలువా కప్పి జ్ఞాపికతో సత్కరించి గౌరవించినట్టు ప్రభుత్వ అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. ఈ డాక్యుమెంటరీ తమిళనాడు అటవీ శాఖ పనితీరును, ఏనుగుల సంరక్షణకు చేస్తున్న ప్రయత్నాలను చూపించిందని పేర్కొన్నారు.
తమిళనాడులోని మదుమలై, అన్నామలై ఏనుగు శిబిరాల్లో పనిచేస్తున్న 91మందికి ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున సాయాన్ని సీఎం స్టాలిన్ ప్రకటించారు. అలాగే, వారందరికీ ఇళ్ల నిర్మాణం కోసం రూ.9.10 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు. కోయంబత్తూరు జిల్లాలోని అన్నామలై టైగర్ రిజర్వ్లో ఉన్న ఏనుగుల శిబిరాన్ని రూ.5కోట్లతో అప్గ్రేడ్ చేయనున్నట్టు పేర్కొన్నారు. దీంతో పాటు కోయంబత్తూరు జిల్లాలోని సవాడివాయల్లో అవసరమైన అన్ని సౌకర్యాలతో ఏనుగుల శిబిరాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు.
సీఎం సన్మానం అనంతరం బొమ్మన్ మీడియాతో మాట్లాడారు. ఏనుగుల పెంపకం అంత సులువేం కాదని.. పిల్లలపై చూపించిన శ్రద్ధే వీటిపట్ల కూడా చూపించాల్సి ఉంటుందని తెలిపారు. మరోవైపు, సీఎం స్టాలిన్ ఆ దంపతులను కలిసి సన్మానించడం పట్ల ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ డాక్యుమెంటరీ డైరెక్టర్ కార్తికి గోంజాల్వెస్ హర్షం వ్యక్తంచేశారు. 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' 95వ అకాడమీ అవార్డు గెలుచుకున్న తర్వాత సీఎం స్టాలిన్ బొమ్మన్, బెల్లీని సత్కరించినందుకు ఆనందంగా ఉందని.. తాను గర్వపడుతున్నానని పేర్కొంటూ ట్వీట్చేశారు.
తమిళనాడులోని ముదుమలై రిజర్వ్ ఫారెస్ట్లో మావటిగా పనిచేస్తున్న బెల్లీ, బొమ్మన్ దంపతుల వాస్తవ జీవనం ఆధారంగా ‘ది ఎలిఫెంట్ విష్పరర్స్’ (The Elephant Whisperers) అనే లఘుచిత్రం రూపొందింది. రఘు, అమ్ము అనే రెండు అనాథ ఏనుగు పిల్లలు, వాటిని ఆదరించిన ఈ దంపతులే ప్రధాన పాత్రలుగా ఈ కథ రూపుదిద్దుకుంది. నిర్మాత గునీత్ మోగ్న నేతృత్వంలో దర్శకురాలు కార్తికి గోంజాల్వెస్ ఈ కథను తెరకెక్కించారు. 42 నిమిషాల నిడివి కలిగిన ఈ చిత్రం ఆస్కార్ 2023లో ఉత్తమ లఘు చిత్రంగా అవార్డు సొంతం చేసుకుంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
కేసీఆర్ను బద్నాం చేయాలనే కాఫర్ డ్యామ్ కట్టడంలేదు: కేటీఆర్
-
మల్కాజిగిరిలో భారీ మెజారిటీతో ఈటల గెలుపు: కిషన్రెడ్డి
-
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
-
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
-
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
-
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై