New Jobs: 10లక్షల ప్రభుత్వ ఉద్యోగాల కల్పనే లక్ష్యం: బిహార్ గవర్నర్
బిహార్లో పది లక్షల ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు మొత్తంగా 20లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడమే నీతీశ్ కుమార్ సారథ్యంలోని ప్రభుత్వం ప్రాధాన్యంగా పెట్టుకుందని గవర్నర్ ఫాగూ చౌహాన్ అన్నారు. రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఆయన ప్రసంగించారు.
పట్నా: రాష్ట్రంలో నిరుద్యోగ యువతకు 20లక్షల ఉద్యోగాలు కల్పించడమే సీఎం నీతీశ్ కుమార్(Nitish kumar) సారథ్యంలోని ప్రభుత్వ ప్రాధాన్యమని బిహార్ (Bihar) గవర్నర్ ఫాగూ చౌహాన్(Phagu Chouhan) అన్నారు. ప్రభుత్వ రంగంలో పది లక్షల ఉద్యోగాలు(Jobs) కాగా.. ఇతర రంగాల్లో మరో పది లక్షల ఉద్యోగావకాశాలు కల్పించడమే లక్ష్యమన్నారు. గురువారం పట్నాలోని గాంధీ మైదాన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల(Republic Day celebrations) సందర్భంగా జాతీయ జెండాను ఎగురవేసిన అనంతరం గవర్నర్ ప్రసంగించారు. గత ఐదు నెలల వ్యవధిలోనే వివిధ ప్రభుత్వ శాఖల్లో ఖాళీల భర్తీకి సంబంధించి యువతకు 28వేల ఉద్యోగ నియామక పత్రాలు పంపిణీ చేసినట్టు వెల్లడించారు. రాష్ట్రంలో ఓ వైపు ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేస్తుండగా.. మరోవైపు అవసరమైన చోట అదనపు ఉద్యోగాలను కూడా సృష్టిస్తోందన్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రభుత్వం నిరంతరం కృషిచేస్తోందన్న ఆయన.. మత సామరస్యతను కాపాడేందుకు కట్టుబడి ఉందన్నారు. పోలీసు బలగాల బలం కూడా పెరిగిందని.. చట్టవిరుద్ధ పనులకు పాల్పడుతున్న మాఫియాలపై చర్యలు తీసుకుంటున్నారన్నారు.
2020లో సీఎం నీతీశ్ కుమార్ ప్రవేశపెట్టిన విజన్ డాక్యుమెంట్ ‘సాత్ నిశ్చయ్ పార్ట్-2’లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో సోలార్ స్ట్రీట్ లైట్లను ఏర్పాటు చేయడం, ఇది వరకే ఉన్న సాంకేతిక సంస్థల్ని ఎక్స్లెన్సీ కేంద్రాలుగా మార్చడం, ఆరోగ్య, మౌలికవసతుల రంగాలను మెరుగుపరడమే ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందన్నారు. వ్యవసాయ రంగంలో రైతుల ఆదాయాన్ని పెంచేలా ప్రభుత్వం చేపడుతున్న సంస్కరణలు, ప్రణాళికలు ప్రశంసనీయమన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!