Gujarat Tragedy: కేబుల్ బ్రిడ్జి విషాదం.. టాప్ 10 పాయింట్లు..
గుజరాత్లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం తీగల వంతెన కుప్పకూలిన(Cable bridge collapse) ఘటన దేశంలో పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో భారీ ప్రాణ నష్టం సంభవించగా.. మచ్చు నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
ఇంటర్నెట్ డెస్క్: గుజరాత్లోని మోర్బీలో ఆదివారం సాయంత్రం తీగల వంతెన కుప్పకూలిన(Cable bridge collapse) ఘటన దేశంలో పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో భారీ ప్రాణ నష్టం సంభవించగా.. మచ్చు నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మరోవైపు, ఈ దుర్ఘటన జరిగిన ప్రాంతానికి చేరుకున్న ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) కూలిన తీగల వంతెన(Cable bridge)ను పరిశీలించారు. అనంతరం సివిల్ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించిన తర్వాత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ఈ దుర్ఘటనకు సంబంధించి అరెస్టయిన తొమ్మిది మందిలో నలుగురికి కోర్టు నాలుగు రోజుల పోలీస్ కస్టడీ విధించింది.
- వంతెన కూలిన ఘటనపై అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేయాలని అధికారులను ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ఆదేశించారు. ఈ మేరకు అధికారులు, ప్రజాప్రతినిధులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. బాధిత కుటుంబాలతో టచ్లో ఉంటూ వారికి అవసరమైన సాయం అందేలా చూడాలని ఆదేశించారు. మోదీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో సీఎం భూపేంద్ర పటేల్, హోమంత్రి హర్ష్ సంఘ్వి, మంత్రి బ్రిజేశ్ మెర్జా, సీఎస్, డీజీపీ, ఎస్పీ, ఐజీ, పలువురు ఎమ్మెల్యేలు, ఎంపీలు పాల్గొన్నారు.
- కేబుల్ బ్రిడ్జి కూలిన ఘటనలో ఇప్పటివరకు 135మంది మృతిచెందగా.. 170 మందిని కాపాడినట్టు గుజరాత్ మంత్రి రాజేంద్ర త్రివేది మంగళవారం వెల్లడించారు. మచ్చు నదిలో సాయుధ బలగాలు, ఎన్డీఆర్ఎఫ్, ఇతర సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని వెల్లడించారు.
- మృతుల కుటుంబాలకు ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రూ.4లక్షల పరిహారం చెల్లించామని.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన రూ.2లక్షల పరిహారం బాధిత కుటుంబాల ఖాతాల్లో తర్వలోనే డీబీటీ విధానంలో జమ అవుతాయని మంత్రి రాజేంద్ర త్రివేది గాంధీనగర్లో తెలిపారు. ఈ ప్రమాదం నుంచి బయటపడిన వారిలో 17మంది ఇంకా గాయాలతో వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
- ప్రధాని నరేంద్ర మోదీ మోర్బిలో పర్యటించారు. ఆదివారం సందర్శకుల తాకిడి ఎక్కువ కావడంతో తెగిపడిన చారిత్రక తీగల వంతెనను పరిశీలించారు. నదిలో గల్లంతైనవారి కోసం కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీశారు. ఈ వంతెన ఎలా కూలిందన్న వివరాలను అధికారులు ఆయనకు వివరించారు. అనంతరం అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్న అధికారులతో మోదీ మాట్లాడారు. ప్రధాని వెంట గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్, ఇతర ఉన్నతాధికారులు ఉన్నారు.
- అనంతరం సివిల్ ఆస్పత్రికి చేరుకున్న మోదీ అక్కడే దాదాపు 15 నిమిషాల పాటు ఉన్నారు. ఆరుగురు క్షతగాత్రులతో మాట్లాడి వారికి ఆస్పత్రిలో అందుతోన్న వైద్యం గురించి ఆరా తీశారని గుజరాత్ ఆరోగ్య శాఖ కార్యదర్శి మనోజ్ అరగ్వాల్ మీడియాకు వెల్లడించారు. అక్కడి నుంచి మోర్బి జిల్లా ఎస్పీ కార్యాలయానికి వెళ్లిన ప్రధాని.. స్థానిక అధికారులతో పాటు బాధితుల బంధువులను కలిసి మాట్లాడారు. అనంతరం అహ్మదాబాద్కు హెలికాప్టర్లో బయల్దేరి వెళ్లారు.
- మచ్చు నదిపై తీగల వంతెన కూలిన దుర్ఘటనపై విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో జ్యుడిషియల్ కమిషన్ ఏర్పాటు చేసి దర్యాప్తు జరిపేలా ఆదేశాలు జారీ చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం(పిల్) దాఖలైంది. దీన్ని సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ పిల్పై నవంబరు 14న సర్వోన్నత న్యాయస్థానంలో విచారణ జరగనుంది.
- ఈ వంతెన కూలడం వెనుక మానవ తప్పిదాలతో పాటు నిర్వహణ లోపాలు కూడా బయటపడటంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. గుజరాత్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ ఘటనపై జ్యుడిషియల్ దర్యాప్తు చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
- దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కూడా ఘటనపై తీవ్రంగానే స్పందించారు. ఈ దుర్ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
- ప్రధాని సందర్శన నేపథ్యంలో మోర్బీలోని ప్రభుత్వ ఆసుపత్రిలో లోపాలను సరిచేయడం, మెరుగులు దిద్దడం వంటి చర్యలపై కాంగ్రెస్, ఆప్ తీవ్ర విమర్శలు చేయడంపై ఆస్పత్రి అధికారులు స్పందించారు. ఇది రొటీన్గా జరిగే పనేనని.. ఎక్కడైనా ఇది జరుగుతుంటుందని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ప్రదీప్ దుద్రేజియా అన్నారు.
- మచ్చు నదిలో భారీ సంఖ్యలో సహాయక సిబ్బంది రంగంలోకి దించారు. 12 బోట్లతో 125 మందితో వెతికిస్తున్నట్టు ఎన్డీఆర్ఎఫ్ కమాండెంట్ ప్రసన్నకుమార్ తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఓటేయకపోయినా పర్లేదు.. మీ కుమారుడిని ఆశీర్వదించండి: ఏకే ఆంటోనీకి రాజ్నాథ్ సూచన
రక్షణ శాఖ మాజీ మంత్రి ఏకే ఆంటోనీ (AK Antony)కి కేంద్రమంత్రి రాజ్నాథ్ సింగ్ (Rajnath Singh)కు ఓ సూచన చేశారు. -
నూతన నావికాదళాధిపతిగా వైస్ అడ్మిరల్ దినేశ్ త్రిపాఠి
Navy Chief: అడ్మిరల్ దినేశ్ కుమార్ త్రిపాఠి త్వరలో భారత నేవీ చీఫ్గా బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం ఆయన వైస్ చీఫ్గా వ్యవహరిస్తున్నారు. -
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
సిద్దిపేటలో సెర్ప్ ఉద్యోగుల సస్పెన్షన్పై హైకోర్టు స్టే
-
తొలి విడత పోలింగ్.. కొన్ని రాష్ట్రాల్లో ఉద్రిక్తతలు..!
-
చంద్రబాబు తరఫున నామినేషన్ వేసిన నారా భువనేశ్వరి
-
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
-
ట్రెక్కింగ్ చేస్తూ జారిపడి.. స్కాట్లాండ్లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మృతి
-
మీ ప్రాంతంలో బ్రాడ్బ్యాండ్ సేవలందించే సంస్థలేవో ఎలా తెలుసుకోవాలి?