హ్యాకర్ల నుంచి సొమ్ము కక్కించిన అమెరికా..!
అమెరికాలోని తూర్పుతీర ప్రాంతంలోని అత్యంత భారీ చమురు పైప్లైన్ కంప్యూటర్లను గత నెలలో రాన్సమ్వేర్ ముఠా హ్యాకింగ్కు గురైంది. ఈ కంప్యూటర్లపై
ఇంటర్నెట్డెస్క్ ప్రత్యేకం: అమెరికాలోని తూర్పుతీర ప్రాంతంలోని అత్యంత భారీ చమురు పైప్లైన్ కంపెనీకి చెందిన కంప్యూటర్లు గత నెలలో రాన్సమ్వేర్ ముఠా హ్యాకింగ్కు గురయ్యాయి. ఈ కంప్యూటర్లపై నియంత్రణను తిరిగి యాజమాన్యానికి అప్పజెప్పాలంటే కొంత మొత్తం చెల్లించాలని ఆ ముఠా డిమాండ్ చేసింది. ఆ కంపెనీ యాజమాన్యం గతిలేని పక్షంలో సొమ్మును చెల్లించి.. కంప్యూర్లపై నియంత్రణను పొందింది. కానీ, రెండు రోజుల క్రితం అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్ ఆ హ్యాకర్ల వాలెట్ నుంచి సొమ్మును సీజ్ చేసింది. ఈ ఘటనపై మంగళవారం అమెరికా సెనెట్లో విచారణ జరిగింది.
కలోనియల్ పైప్లైన్ కంపెనీపై గత నెల 7న సైబర్ దాడి జరిగింది. దీంతో దాదాపు 18 రాష్ట్రాలకు చమురు సరఫరాను యద్ధప్రాతిపదికన ఆపేశారు. ఈ సైబర్ దాడి చేసిన ‘డార్క్సైడ్’ అనే రాన్సమ్వేర్ ముఠా 4.4 మిలియన్ డాలర్లను డిమాండ్ చేసింది. దీంతో చేసేది లేక కంపెనీ ఆ మొత్తానికి సమానమైన బిట్కాయిన్లను చెల్లించింది. ఈ విషయాన్ని గతనెల వాల్స్ట్రీట్ జర్నల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కంపెనీ సీఈవో జోసఫ్ బ్లంట్ అంగీకరించారు.
మరోపక్క అమెరికా జస్టిస్ డిపార్ట్మెంట్, ఎఫ్బీఐ దీనిపై కన్నేశాయి. తాజాగా బిట్కాయిన్ వాలెట్ను తెరిచే ప్రత్యేకమైన ‘కీ’ని ఎఫ్బీఐ సంపాదించింది. దీంతో కలోనియల్ పైప్లైన్ చెల్లించిన సొమ్మును సీజ్ చేసింది. ఈ క్రిప్టోకరెన్సీ చిరునామా నార్త్ డిస్ట్రిక్ట్ ఆఫ్ కరోలినాలో ఉంది. కలోనియల్ పైప్లైన్ సుమారు 5 మిలియన్ డాలర్లు బిట్కాయిన్ల రూపంలో చెల్లించగా.. వాటిలో 2.3 మిలియన్ డాలర్ల విలువైన బిట్కాయిన్లను తిరిగి స్వాధీనం చేసుకొంది. అయితే, అప్పటితో పోలిస్తే ఇప్పుడు బిట్కాయిన్ల విలువ క్షీణించడం గమనార్హం.
భారీగా సైబర్ భద్రతా చర్యలు తీసుకొన్నా..
ఈ హ్యాకింగ్, మాముళ్ల రూపంలో సొమ్ము చెల్లింపు వంటి అంశాలపై మంగళవారం సెనెటర్లు విచారణ చేపట్టారు. దీనికి కలోనియల్ పైప్లైన్ సీఈవో జోసఫ్ బ్లంట్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన ఘటనను సెనెటర్లకు బ్లంట్ వివరించారు. హ్యాకర్లు వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ (వీపీఎన్)ను వినియోగించి కంప్యూటర్లోకి చొరబడ్డారని తెలిపారు. మల్టీ అథెంటికేషన్ కాకుండా.. ఒకే ఒక అథెంటికేషన్తో చొరబడ్డారని వివరించారు. వాస్తవానికి ఆ సిస్టమ్ పాస్వర్డ్ కూడా అత్యంత పకడ్బందీగా ఉందని వివరించారు. Colonial123 వంటి పాస్వర్డ్ మాత్రం లేదని వెల్లడించారు. సంస్థ సైబర్ సెక్యూరిటీ, సిస్టమ్స్పై గత ఐదేళ్లలో 200 మిలియన్ డాలర్ల (రూ.1,460 కోట్లు) వెచ్చించినట్లు వివరించారు. తప్పని పరిస్థితుల్లో తాము ‘డార్క్సైడ్’కు సొమ్ము చెల్లించినట్లు తెలిపారు. ఇప్పటికీ కంపెనీకి చెందిన 7 ఫైనాన్సియల్ సిస్టమ్స్ సాధారణ స్థితికి రాలేదని తెలిపారు.
ఏమిటీ డార్క్సైడ్?
కరుడుగట్టిన సైబర్ నేరగాళ్ల ముఠా ‘ది డార్క్సైడ్’ ఈ దాడికి పాల్పడినట్లు భావిస్తున్నారు. ఇది రష్యాకు చెందిన సంస్థగా అనుమానిస్తున్నారు. ఇదొక రాన్సమ్వేర్ ముఠా. అంటే సైబర్ దాడి చేసి డబ్బులు వసూలు చేసే గ్యాంగ్ అన్నమాట. తాజా దాడిలో డార్క్సైడ్ ముఠా కలోనియల్ పైప్లైన్ నెట్వర్క్కు చెందిన దాదాపు 100 గిగాబైట్ల డేటాను తన అధీనంలోకి తీసుకుంది. దీనిని గుర్తించిన కలోనియల్ సంస్థ మిగిలిన డేటా హ్యాకర్లు బారినపడకుండా ఆఫ్లైన్ చేసింది. తమ డిమాండ్లు పూర్తి చేయకపోతే ఇంటర్నెట్లో ఆ డేటాను ఉంచుతామని బెదిరించారు. క్రిమినల్ ఐటీ వ్యవస్థలో రాన్సమ్వేర్ అత్యంత ప్రమాదకరమైంది. ఇది దొంగిలించిన డేటాను ఆన్లైన్లో ఆటోమేటిక్గా పబ్లిష్ చేసేందుకు సిద్ధంగా ఉంచి.. ఆధారాలతో ఉన్న ఆ లింక్ను బాధితులకు పంపిస్తుంది. బాధితుడి సిస్టమ్లోని డేటాను ముందే తొలగించేస్తుంది. తమకు డబ్బు ఇవ్వకపోతే స్వాధీనం చేసుకొన్న డేటా లీక్ చేస్తామని చెబుతుంది.
డార్క్సైడ్ ముఠా సైబర్ నేరాల్లో శిక్షణ కూడా ఇస్తుంటుంది. డేటాను ఎన్క్రిప్ట్ చేసి తస్కరించేందుకు వీలుగా ఓ సాఫ్ట్వేర్ను కూడా అభివృద్ధి చేసింది. దీంతో దాడులు ఎలా చేయాలి? డబ్బు ఎలా గుంజాలి? అనే అంశాలపై తమ అనుచర బృందాలకు శిక్షణ ఇస్తోంది. శిక్షణ పొందిన బృందాలు సైబర్ దాడులు చేసి వసూలు చేసిన సొమ్ములో కొంత డార్క్సైడ్కు చెల్లిస్తున్నట్లు నిపుణులు పేర్కొంటున్నారు. మరింత చురుగ్గా దాడులు చేసే ఓ సాఫ్ట్వేర్ను డార్క్సైడ్ ముఠా మార్చిలో సిద్ధం చేసింది. దీనిని పరిశీలించడానికి రావాలని జర్నలిస్టులకు ఓ ప్రెస్నోట్ కూడా విడుదల చేయడం విశేషం.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.