Delhi: మరో వివాదం.. లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలు పాటించొద్దు: ఆప్ సర్కార్
లెఫ్టినెంట్ గవర్నర్ ఆదేశాలను పాటించవద్దని దిల్లీలోని ఆప్ ప్రభుత్వం (APP Govt) అధికారులను ఆదేశించింది. ఎల్జీ కార్యాలయం నుంచి ఎలాంటి ఆదేశాలు వచ్చినా.. సంబంధిత మంత్రులకు తెలియజేయాలని పేర్కొంది.
దిల్లీ: రాజధాని దిల్లీలో ఆప్(AAP) ప్రభుత్వానికి, లెఫ్టినెంట్ గవర్నర్కి మధ్య వివాదాలు సద్దుమణగకపోగా మరింత తీవ్ర రూపం దాల్చుతున్నాయి. ఉపాధ్యాయులను శిక్షణ కోసం విదేశాలకు పంపించే అంశంపై తలెత్తిన వివాదం చల్లారకముందే.. ఎల్జీ విషయంలో ఆప్ కీలక నిర్ణయం తీసుకుంది. లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా నుంచి నేరుగా వచ్చిన ఏ ఆదేశాన్నీ పాటించవద్దని అధికారులను కేజ్రీవాల్ ప్రభుత్వం ఆదేశించింది. ఆయన్నుంచి ఏ ఆదేశాలు వచ్చినా వాటిని సంబంధిత మంత్రులకు తెలియజేయాలని సూచించింది. ఈ తాజా పరిణామం దిల్లీ సర్కార్, ఎల్జీ మధ్య మరో వివాదానికి తెర లేపినట్టయింది.
ప్రభుత్వాన్ని సంప్రందించకుండా లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి నేరుగా ఎలాంటి ఆదేశాలు వచ్చినా అవి రాజ్యాంగాన్ని, సుప్రీంకోర్టు ఆదేశాలను అతిక్రమించినట్లే అవుతుందని దిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోదియా అన్నారు. అలాంటి ఆదేశాలను పాటించడం కూడా సుప్రీంకోర్టును ధిక్కరించినట్లే అవుతుందని, ఈ అంశాన్ని తీవ్రంగా పరిగణిస్తామని ఆప్ ప్రభుత్వం అధికారులను హెచ్చరించింది. ఉపాధ్యాయుల అంశమే కాకుండా వివిధ సందర్భాల్లో ఆప్ ప్రభుత్వానికి, ఎల్జీకి మధ్య పొసగడం లేదు. ప్రభుత్వాన్ని పక్కకు నెట్టి ఎల్జీ నేరుగా ఆదేశాలు జారీ చేస్తున్నారంటూ చాలా సార్లు ఆప్ నేతలు ఆరోపించారు. ఈ వివాదం ప్రస్తుతం సుప్రీం కోర్టు పరిధిలో ఉంది.
‘‘ సేవల నియంత్రణపై కేంద్రం-ఢిల్లీ ప్రభుత్వాల మధ్య వివాదంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. భారత రాజ్యాంగాన్ని, సుప్రీం కోర్టు ఆదేశాలను గౌరవించాలని ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆప్ ప్రభుత్వం అధికారులకు దిశానిర్దేశం చేసింది. లెఫ్టినెంట్ గవర్నర్ నుంచి నేరుగా వస్తున్న ఆదేశాలను అధికారులు అమలు చేయొద్దు’’ అని దిల్లీ ప్రభుత్వం ఓ ప్రకటన విడుదల చేసింది. దీనిపై మంత్రులందరూ సంబంధిత శాఖల అధికారులకు ప్రత్యక్షంగా చెప్పాలని కోరింది. 2018 జులై 4న సుప్రీం కోర్టు విడుదల చేసిన మార్గదేశాలకు అనుగుణంగా ఈ ఆదేశాలు జారీ చేస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!