EC: ‘వాటిని ప్రచురించకుండా నిలువరించండి’
దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండో దశ ఉద్ధృతికి ఎన్నికల సంఘమే(ఈసీ) కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన పదునైన వ్యాఖ్యలపై మీడియా ప్రచురించి....
* మౌఖిక వ్యాఖ్యల ప్రచురణకు అనుమతించొద్దు
* మద్రాస్ హైకోర్టులో ఈసీ పిటిషన్
న్యూదిల్లీ: దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండో దశ ఉద్ధృతికి ఎన్నికల సంఘమే(ఈసీ) కారణమంటూ మద్రాస్ హైకోర్టు చేసిన పదునైన వ్యాఖ్యలపై మీడియా ప్రచురించిన కథనాలపై ఈసీ తీవ్ర విచారం వ్యక్తం చేసింది. కరోనా విజృంభణకు ఈసీయే ఏకైక కారణమన్నట్లుగా మీడయా వార్తల్ని ప్రచురించిందని వాపోయింది. ఈ నేపథ్యంలో కోర్టు చేసే మౌఖిక వ్యాఖ్యల్ని ప్రచురించకుండా మీడియా సంస్థల్ని నిలువరించాలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఈసీ పిటిషన్ వేసింది.
రాజ్యాంగబద్ధంగా, పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించే బాధ్యత కలిగిన స్వతంత్ర సంస్థ అయిన ఎన్నికల సంఘం ప్రతిష్ఠ మీడియా కథనాల వల్ల దెబ్బతిందని పిటిషన్లో పేర్కొంది. మద్రాస్ హైకోర్టు ఘాటు మౌఖిక వ్యాఖ్యల తర్వాత పశ్చిమ బెంగాల్లో డిప్యూటీ ఎన్నికల కమిషనర్పై హత్యాయత్నం కేసు కూడా నమోదైందని పేర్కొంది. ఈ నేపథ్యంలో రికార్డుల్లో నమోదుకాని కోర్టు పరిశీలనల్ని నివేదించడానికి ఎవరినీ అనుమతించొద్దని ఈసీ కోరింది. పైగా తమిళనాడులో ఏప్రిల్ 4నే ప్రచారం ముగిసిన నేపథ్యంలో కోర్టు అలాంటి వ్యాఖ్యలు చేయడానికి ఇది సందర్భమూ కాదని వ్యాఖ్యానించింది.
మద్రాస్ హైకోర్టు ఏమందంటే...
అత్యంత బాధ్యతా రాహిత్యంగా వ్యవహరించిన ఎన్నికల సంఘమే (ఈసీ) దేశవ్యాప్తంగా కొవిడ్-19 రెండో దశ ఉద్ధృతికి కారణమని మద్రాస్ హైకోర్టు సోమవారం తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుత పరిస్థితులకు ఆ సంస్థదే బాధ్యతని స్పష్టంచేసింది. ఇందుకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులపై హత్యాభియోగాల కింద కేసు నమోదు చేయవచ్చునని వ్యాఖ్యానించింది. ఎన్నికల ర్యాలీలు, భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసేందుకు రాజకీయ పార్టీలకు ఈసీ అనుమతి ఇవ్వడం.. దేశంలో మహమ్మారి రెండో దశ తీవ్రతకు కారణమైందని పేర్కొంది. ఆ సమయంలో అధికారులు వేరే గ్రహం మీద ఉన్నారా? అని ప్రశ్నించింది. తమిళనాడులోని కరూర్లో ఓట్ల లెక్కింపు సమయంలో కరోనా నిబంధనలు పాటించేలా ఆదేశించాలంటూ ఆ రాష్ట్ర రవాణా శాఖ మంత్రి, కరూర్ నియోజకవర్గ అన్నాడీఎంకే అభ్యర్థి ఎం.ఆర్.విజయభాస్కర్ మద్రాస్ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ బెనర్జీ, జస్టిస్ సెంథిల్కుమార్ రామమూర్తిలతో కూడిన ధర్మాసనం ఆ వ్యాజ్యంపై సోమవారం విచారణ చేపట్టింది. ఈ క్రమంలో ఎన్నికల సంఘంపై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
చెప్పలేని విధంగా వ్యక్తిత్వ హననం.. నీకిది తగునా జగన్?: సీఎంకు వివేకా సతీమణి లేఖ
-
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
-
దేశాల మధ్య డీఫ్ఫేక్ చిచ్చు.. ఫిలిప్పీన్స్-చైనాలో కలకలం సృష్టించిన వీడియో
-
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
-
విమానాలు రద్దయితే ఆటోమేటిక్ రిఫండ్.. అమెరికాలో కొత్త నిబంధనలు
-
హైదరాబాద్కు ‘ఉప్పల్’ అడ్డా.. బెంగళూరుపై ఈసారి స్కోరెంత?