Geeta Mukherjee: మహిళా రిజర్వేషన్ బిల్లుకు మార్గదర్శి గీతా ముఖర్జీ.. ఎవరామె?
మహిళా రిజర్వేషన్ బిల్లుకు మూలకారణమైన గీతా ముఖర్జీ గురించి ప్రత్యేక కథనం..
ఇంటర్నెట్ డెస్క్: చట్టసభల్లో రిజర్వేషన్ల కోసం దేశ మహిళలు మూడు దశాబ్దాలుగా ఎదురుచూస్తోన్న బిల్లుకు మోక్షం కలిగే ప్రక్రియ చివరి దశకు చేరింది. తాజాగా ఇది లోక్సభలో ఆమోదం పొందడం.. విపక్షాలు కూడా ఈ బిల్లుకు మద్దతివ్వడంతో మహిళా రిజర్వేషన్ బిల్లు చట్టరూపం దాల్చేందుకు అడుగు దూరంలో ఉంది. ఈ క్రమంలో లోక్సభలో జరిగిన చర్చలో ఈ బిల్లుకు మూలకారణమైన గీతా ముఖర్జీ (Geeta Mukherjee) పేరు పలుమార్లు ప్రస్తావనకు వచ్చింది. ఎవరీ గీతా ముఖర్జీ అని ఒకసారి చరిత్రలోకి తొంగి చూస్తే..
మహిళా బిల్లు.. భాజపాకు ‘రాజకీయ ఎజెండా’ కాదు!
- మహిళా రిజర్వేషన్ బిల్లును 1996లో హెచ్డీ దేవెగౌడ సారథ్యంలోని యునైటెడ్ ఫ్రంట్ ప్రభుత్వం తొలుత లోక్సభలో ప్రవేశపెట్టింది. ఈ బిల్లును సెప్టెంబర్ 12, 1996లో గీతా ముఖర్జీ తొలిసారి లోక్సభలో ప్రవేశపెట్టారు. జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఛైర్మన్గా ఉన్న ఆమె.. బిల్లుపై సమగ్ర సమీక్ష జరిపి, ఏడు కీలక సిఫార్సులు చేశారు. పార్లమెంటు ముందుకు ఈ బిల్లు రావడం ఐదోసారి కావడం గమనార్హం.
- కోల్కతాలో 1924లో జన్మించిన గీతా ముఖర్జీ.. విద్యార్థి దశలోనే రాజకీయాల్లోకి ప్రవేశించారు. సీపీఐ నేత బిశ్వనాథ్ ముఖర్జీని ఆమె వివాహం చేసుకున్నారు. అనంతరం 1946లో బెంగాల్ స్టేట్ కమిటీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. బ్రిటిషర్లకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థి, కార్మిక ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొన్నారు. అరెస్టయి ఆరునెలలపాటు జైల్లో ఉన్నారు.
- 1967లో పశ్చిమబెంగాల్ అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టిన ఆమె.. 1977 వరకు కొనసాగారు. 1980లో పన్స్కుర లోక్సభ స్థానం నుంచి గెలుపొంది.. తన చివరి శ్వాస వరకు (2000) అదే స్థానానికి ప్రాతినిధ్యం వహించారు. సీపీఐ నేషనల్ కౌన్సిల్, నేషనల్ ఎగ్జిక్యూటివ్ కమిటీల్లోనూ సభ్యురాలిగా పనిచేశారు. వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యురాలిగా ఉన్న ఆమె.. మహిళలకు సంబంధించిన అనేక కమిటీల్లో ఉన్నారు. సామాజిక న్యాయం, మహిళల హక్కుల కోసం పోరాటంలో తన బలమైన గళాన్ని వినిపించారు.
- గీతా ముఖర్జీ బెంగాలీలో భారత్ ఉపకథ, చోటోదేర్ రవీంద్రనాథ్ (Children's Rabindranath), ‘నేక్డ్ ఎమాంగ్ వోల్వ్స్’ వంటి ఎన్నో పుస్తకాలు రాశారు. 76 ఏళ్ల వయసులో గుండెపోటుతో గీతా ముఖర్జీ కన్నుమూశారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకోసం ఎంతో పోరాడిన ఆమె.. ఆయా ప్రభుత్వాలు దాన్ని పార్లమెంటులో ఆమోదింపజేయడంలో విఫలం కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ బిల్లును ఎలాగైనా ఆమోదం పొందేందుకు చివరి వరకు తన ప్రయత్నాలను కొనసాగించారు.
- తర్వాత వాజ్పేయీ, మన్మోహన్ సింగ్ ప్రభుత్వాల హయాంలోనూ ప్రవేశపెట్టినప్పటికీ ఈ బిల్లు సభ ఆమోదానికి నోచుకోలేదు. చివరకు ఈ బిల్లు 2010లో రాజ్యసభ ఆమోదం పొందినా లోక్సభలో మాత్రం పెండింగులోనే ఉండిపోయింది. 2014లో లోక్సభ రద్దు కావడంతో అక్కడే బిల్లు మురిగిపోయింది. ఈ నేపథ్యంలో మోదీ సర్కార్.. మహిళా రిజర్వేషన్లపై కొత్త బిల్లును తీసుకురావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
- ఈ బిల్లు చట్టంగా మారితే.. లోక్సభ, రాష్ట్రాల శాసన సభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు అమలవుతాయి. అయితే, ఈ బిల్లు ఉభయ సభల్లో ఆమోదం పొందినప్పటికీ.. 2027 తర్వాత రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయని కేంద్రం చెబుతోంది. నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) తర్వాత రొటేషన్ ప్రక్రియలో రిజర్వు సీట్ల కేటాయింపు ఉంటుందని పేర్కొంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఒక్క ఘటనతో గృహ హింసను నిర్ధారించలేం
ఒకే ఒక్క ఘటన ఆధారంగా...అదీ అంత తీవ్రమైనది కాని పక్షంలో నిందితునిపై గృహ హింస నేరాన్ని మోపలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
డీప్ఫేక్ ఉచ్చులో ప్రియాంకా చోప్రా
డీప్ఫేక్ వీడియోలను కట్టడి చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపడుతున్నప్పటికీ రోజుకో నటి వీటి బారిన పడుతూనే ఉన్నారు. -
గుండెపోట్ల కలవరం.. 10 లక్షల మందికి సీపీఆర్ శిక్షణ
వయసుతో సంబంధం లేకుండా ఇటీవలి కాలంలో ఎక్కువ అవుతున్న గుండెపోటు మరణాలు తీవ్ర కలవరపాటుకు గురిచేస్తున్నాయి. -
భారత పార్లమెంటుపై దాడి చేస్తా
ఖలిస్థానీ ఉగ్రవాది, నిషేధిత ‘సిఖ్స్ ఫర్ జస్టిస్’ నేత గురుపత్వంత్ సింగ్ పన్నూ మరోసారి భారత్పై బెదిరింపులకు పాల్పడ్డాడు. -
మెహుల్ చోక్సీ దంపతులపై ఛీటింగ్ కేసు పునరుద్ధరణ
పంజాబ్ నేషనల్ బ్యాంకు కుంభకోణంలో నిందితుడు, విదేశాలకు పరారైన వ్యాపారి మెహుల్ చోక్సీ, ఆయన భార్యకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. -
దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల్లో మార్పులకు అవకాశముండాలి
అక్రమ వలసలు, హింసతో ఈశాన్య రాష్ట్రాలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నాయని, ఈ విషయంలో దేశ రక్షణ లక్ష్యంగా చట్టాల సవరణకు ప్రభుత్వానికి విశాల దృక్పథముండేలా పరిస్థితులుండాలని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది. -
సుప్రీంకోర్టులో కేసుల లిస్టింగ్లో అసంబద్ధ విధానాలు
సుప్రీంకోర్టులో ఒక ధర్మాసనం ముందు విచారణకు లిస్టైన కేసులను అనూహ్యంగా మరో బెంచ్కు మారుస్తున్నట్లు సీనియర్ న్యాయవాది, సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు దుష్యంత్ దవే ఆవేదన వ్యక్తం చేశారు. -
యునెస్కో జాబితాలో గర్బా నృత్యం
గుజరాత్ సంప్రదాయ నృత్యం గర్బాకు ఐక్యరాజ్యసమితి విద్యా, శాస్త్రీయ సాంస్కృతిక సంస్థ (యునెస్కో) గుర్తింపు లభించింది. -
పాక్ ఆక్రమిత కశ్మీర్ మనదే
కశ్మీర్ దుస్థితికి భారత తొలి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చేసిన రెండు అతి పెద్ద తప్పిదాలే కారణమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఆరోపించారు. -
100కు పైగా మోసకారి వెబ్సైట్ల మూసివేత
చట్టవిరుద్ధ పెట్టుబడులకు మార్గం కల్పించడంతోపాటు పరిమిత కాల ఉద్యోగాల పేరుతో భారత్లో అభ్యర్థులను మోసగిస్తున్న 100కు పైగా వెబ్సైట్లను మూసివేసినట్లు కేంద్ర హోంశాఖ బుధవారం ప్రకటించింది. -
అయోధ్య విగ్రహ ప్రతిష్ఠాపనకు 7వేల మందికి ఆహ్వానం
ఉత్తర్ ప్రదేశ్లోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామాలయంలో విగ్రహ ప్రతిష్ఠాపన కార్యక్రమానికి అతిరథ మహారథులను రామాలయ ట్రస్టు ఆహ్వానిస్తోంది. -
అంబేడ్కర్కు ప్రధాని ఘన నివాళి
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం ప్రధాని మోదీ ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. -
సంక్షిప్త వార్తలు
చంద్రుడి కక్ష్యలో తిరుగుతున్న చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ను తిరిగి భూకక్ష్యలోకి విజయవంతంగా తీసుకువచ్చిన ఇస్రోకు అభినందనలు. -
వరద నుంచి తేరుకోని చెన్నై
మిగ్జాం తుపాను శాంతించినప్పటికీ చెన్నైలోని లోతట్టు ప్రాంతాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. సమస్య ఉన్న చోట నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్డీఆర్ఎఫ్, గ్రేటర్ కార్పొరేషన్, పోలీసు, ఇతర విభాగాల సిబ్బంది సహాయక చర్యల్లో నిమగ్నమయ్యారు. -
Ratan Tata: రిస్క్లేని పెట్టుబడి అంటూ.. రతన్ టాటా నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాలో పోస్టు
రతన్ టాటా మాట్లాడినట్లు ఓ నకిలీ ఇంటర్వ్యూ ఇన్స్టాగ్రామ్లో వెలుగుచూసింది.


తాజా వార్తలు (Latest News)
-
Revanth Reddy: రేవంత్ ప్రమాణస్వీకారం.. నగరానికి చేరుకున్న సోనియా, రాహుల్
-
Telangana New Ministers: మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనుంది వీళ్లే..
-
Bapatla: ఎన్టీఆర్ విగ్రహాన్ని ధ్వంసం చేయడం ఒక సిగ్గుమాలిన చర్య: చంద్రబాబు
-
Stock Market: నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. 20,900 దిగువకు నిఫ్టీ
-
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు
-
ఆ విషయాన్ని గుర్తుపెట్టుకుని.. దివ్యాంగురాలు రజినికి రేవంత్ ప్రత్యేక ఆహ్వానం