MSRTC strike: శరద్ పవార్ ఇంటి ముందు ఉద్రిక్తత.. చెప్పుల దాడి
ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఎంపీ ఇంటి వద్ద నిరసన చేపడుతూ.. చెప్పులు, బూట్లు విసిరారు.......
ముంబయి: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్పవార్ ఇంటి వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహారాష్ట్ర రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(MSRTC)కు చెందిన కొంత మంది ఉద్యోగులు ముంబయిలోని శరద్ పవార్ ఇంటివద్దకు చేరుకున్నారు. తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ నినాదాలు చేశారు. ఆయన ఇంటిపై మరికొందరు చెప్పులు, బూట్లు విసిరారు. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న ఎంఎస్ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వంలో విలీనం చేయాలని, తమను ఆదుకోవాలంటూ గతేడాది నవంబర్ నుంచే వేల మంది ఉద్యోగులు సమ్మె బాటపట్టారు.
తాజాగా దాదాపు 100 మంది ఉద్యోగులు శుక్రవారం మధ్యాహ్నం శరద్ పవార్ ఇంటికి చేరారు. ఆయన ఇంటిముందు నిరసన తెలుపుతూ ఎంపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన ఇంటిపైకి కొందరు చెప్పులు, బూట్లు కూడా విసిరినట్లు తెలుస్తోంది. ‘సమ్మె మొదలైనప్పటి నుంచి దాదాపు 120 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇవి ఆత్మహత్యలు కాదు.. ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలే. ఎంఎస్ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలనే మా డిమాండ్కు కట్టుబడి ఉన్నాం. ఈ సమస్య పరిష్కారానికి ఎన్సీపీ అధినేత ఇప్పటివరకు ఏమీ చేయలేదు’ అని ఆందోళనలో పాల్గొన్న ఓ ఉద్యోగి పేర్కొన్నారు.
సమ్మె విరమించి ఏప్రిల్ 22లోగా విధుల్లో చేరాలని బొంబాయి హైకోర్టు తీర్పు వెలువరించిన నేపథ్యంలో పవార్ ఇంటివద్ద వారు ఈ తరహా నిరసన చేపట్టడం గమనార్హం. కోర్టు ఆదేశాలను అనుసరించి, తిరిగి విధుల్లో చేరిన కార్మికులపై ఎలాంటి చర్యలు తీసుకోబోమని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి అనిల్ పరబ్ హామీ కూడా ఇచ్చారు. దీనిపై ఉద్యోగులు మాట్లాడుతూ.. ‘హైకోర్టు తీర్పును మేం గౌరవిస్తాం. మా సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేసిందేమీ లేదు. మాకు జరిగిన నష్టాలకు శరద్ పవార్ సైతం బాధ్యత వహించాల్సిందే’ అని అన్నారు. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్ల మహా వికాస్ అఘాడీ ప్రభుత్వ ఏర్పాటుకు శరద్ పవార్ కీలకంగా వ్యవహరించిన విషయం తెలిసిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి
-
IPL 2024: కోల్కతా, రాజస్థాన్ జట్లలో ఒక్కో మార్పు.. కొత్తగా ఎవరొచ్చారంటే..
-
మే 31 వరకు వేసవి సెలవులు.. ప్రకటించిన ఇంటర్ బోర్డు
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్