UP Polls: యూపీ ఎన్నికల్లో మళ్లీ తళుక్కుమన్న ఆ ‘పోలింగ్‌’ బ్యూటీ

2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో పసుపు చీరలో.. నల్లద్దాలతో.. ఎన్నికల విధులకు వెళుతూ ఓ మహిళా పోలింగ్ అధికారిణి సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు

Published : 23 Feb 2022 01:27 IST

లఖ్‌నవూ: 2019లో సార్వత్రిక ఎన్నికల సమయంలో పసుపు చీరలో.. నల్లద్దాలతో.. ఎన్నికల విధులకు వెళుతూ ఓ మహిళా పోలింగ్ అధికారిణి సోషల్ మీడియా సెన్సేషన్ అయ్యారు గుర్తుందా. అవునండీ.. ఆ ‘పోలింగ్‌’ బ్యూటీ రీనా ద్వివేది తాజాగా.. యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి తళుక్కుమన్నారు. ఈసారి  టాప్‌లో విధులకు వెళ్తూ కన్పించారు. 

యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా బుధవారం నాలుగో విడత పోలింగ్‌ జరగనుంది. అమేఠీ జిల్లాలోని మోహన్‌లాల్‌గంజ్‌ ఎన్నికల విధులకు బయల్దేరిన రీనా.. నల్ల రంగు టాప్‌, బీగీ ట్రౌజర్స్‌ ధరించి కన్పించారు. ఈ ఫొటోలు కూడా ప్రస్తుతం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి. కొందరు ఆమెతో సెల్ఫీలు కూడా దిగారు.

2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కన్పించిన ఆమె ఒక్క రోజులో సోషల్‌మీడియాలో స్టార్‌ అయ్యారు. ఆమె ఎవరై ఉంటారా అని నెటిజన్లు తెగ వెతికేశారు. అప్పటి నుంచి ప్రతి ఎన్నికల్లో రీనా ప్రత్యేకంగా రెడీ అయ్యి విధులకు వెళ్తున్న తీరు నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ఫ్యాషన్‌ను అమితంగా ఇష్టపడే రీనా.. లఖ్‌నవూలోని పీడబ్ల్యూడీ విభాగంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని