అంచనాలు లేని స్థాయి నుంచి అంతా తానై
అప్రతిహత విజయాలకు చిరునామా ఇస్రో. చేపట్టిన ప్రతి ప్రయోగాన్ని విజయపథంలో నడిపిస్తూ దిగ్గజ దేశాల సరసన నిలిచింది. ప్రపంచదేశాల చూపు తనవైపు తిప్పుకుంది...
ఇంటర్నెట్డెస్క్: అప్రతిహత విజయాలకు చిరునామా ఇస్రో. చేపట్టిన ప్రతి ప్రయోగాన్ని విజయపథంలో నడిపిస్తూ దిగ్గజ దేశాల సరసన నిలిచింది. ప్రపంచదేశాల చూపు తనవైపు తిప్పుకుంది. ఒకప్పుడు ఎలాంటి అంచనాలు లేకుండా... సాధారణంగా మొదలైన ఈ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ..ఇప్పుడు విశ్వసనీయమైన PSLV వాహకనౌకతో చరిత్రలో నిలిచిపోయే విజయాలు సాధించింది.. సాధిస్తూనే ఉంది. ప్రపంచదేశాలన్నీ కరోనా కోరల్లో చిక్కుకొని..ప్రయోగాల విషయంలో అవస్థలు పడుతుంటే..ఇస్రో ఆశల అస్త్రం పీఎస్ఎల్వీ మాత్రం లక్ష్యాల వైపు విరామం లేకుండా పరుగులు తీస్తోంది. ఎప్పటికప్పుడు సరికొత్త తీరాలను చేరుకుంటూ దేశ సాంకేతిక ప్రగతిలో భాగమవుతోంది. సమాచార రంగంలో విప్లవాత్మకమైన మార్పులకు నాంది పలుకుతూ రాకెట్ వేగానికి అసలైన నిర్వచనంగా నిలుస్తోంది.
నమ్మిన బంటు డిసెంబర్ 17 2020....! భారత అంతరిక్ష పరిశోధన సంస్థకు మరిచిపోలేని ప్రత్యేక విజయాన్ని అందించిన రోజు. ఇప్పటికే ఎన్నో విజయాల్ని ఖాతాలో వేసుకున్న ఇస్రో...పీఎస్ఎల్వీ సి-50 ఉపగ్రహ ప్రయోగం లక్ష్యం చేరుకోవటంతో మరో గెలుపు నమోదు చేసింది. శ్రీహరి కోటలోని సతీశ్ ధావన్ అంతరిక్ష ప్రయోగ కేంద్రం నుంచి డిసెంబర్ 17న ప్రయోగించిన సీఎంఎస్-01 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని ఇస్రో నమ్మిన బంటు పీఎస్ఎల్వీ వాహక నౌక.. కౌంట్డౌన్ అనంతరం నిప్పులు కక్కుకుంటూ నింగిలోకి తీసుకెళ్లింది. 22 నిమిషాల వ్యవధిలోనే ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలోకి ప్రవేశ పెట్టింది. ఇస్రో అమ్ములపొదిలో రామబాణం వంటి PSLV-సీ50 అర్ధశతక విజయాన్ని సగర్వంగా సొంతం చేసుకుంది. |
సరికొత్త చరిత్రకు శ్రీకారం గతేడాది ఇస్రోకు 2వ విజయం అందించిన PSLV సి-50 ఉపగ్రహ వాహక నౌక డిసెంబర్ 17 గురువారం సాయంత్రం 3.41 గంటలకు 320 టన్నుల బరువుతో భూమి నుంచి లక్ష్యం దిశగా దూసుకుపోయింది. భూమికి 35,975 కి.మీ ఎత్తులో ఉన్న జియో ట్రాన్స్ఫర్ ఆర్బిట్లోని దీర్ఘ వృత్తాకార కక్ష్యలో 1,410 కిలోలు బరువున్న సీఎంఎస్-01 కమ్యూనికేషన్ ఉపగ్రహాన్ని విజయవంతంగా ప్రవేశపెట్టింది. పీఎస్ఎల్వీ వాహననౌకల విజయ పరంపరను కొనసాగించింది. ఇస్రోకు బ్రహ్మాస్త్రం లాంటి పీఎస్ఎల్వీ.. 52వ సారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా విజయ బావుటా ఎగురవేసింది. ఆ రోజు ప్రత్యేకం ఏమిటంటే... పీఎస్ఎల్వీ సిరీస్లో 52 ప్రయోగాలు చేపట్టగా...50 ప్రయోగాలు సఫలమై...సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాయి. 11 ఏళ్ల కిందట పంపిన కమ్యూనికేషన్ శాటిలైట్ జీశాట్-12 జీవిత కాలం ముగియడంతో దాని స్థానంలో సీఎంఎస్-01 ఉపగ్రహన్ని పీఎస్ఎల్వీ సీ-50 ద్వారా అంతరిక్షంలోకి పంపారు. సీఎంఎస్-01 ఉపగ్రహం ఫ్రీక్వెన్సీ స్ప్రెక్ట్రంలో విస్తరించిన సీ-బ్యాండ్ సేవలను ఏడేళ్ల పాటు అందించనుంది. దీని పరిమితి దేశంలోని అన్ని ప్రధాన భూభాగాలు, అండమాన్-నికోబార్ దీవులు, లక్షద్వీప్ల వరకూ విస్తరించి ఉంది. ఇప్పటివరకూ 41 సమాచార ఉపగ్రహలు అంతరిక్షంలోకి పంపగా.. సీఎంఎస్-01 భారతదేశపు 42వ కమ్యునికేషన్ ఉపగ్రహం. కొవిడ్-19 వేళ అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ అద్భుతమైన పనితీరు చూపి విజయంలో కీలకపాత్ర పోషించిన శాస్త్రవేత్తలను ఇస్రో ఛైర్మన్ శివన్ అభినందించారు. మరిన్ని విజయాలకు నాంది పలకాలని సూచించారు. |
1993లో తొలిసారి.. పీఎస్ఎల్వీ వాహననౌక విషయానికి వస్తే... 1993, సెప్టెంబరు 20న షార్ నుంచి తొలిసారి గగనయాత్ర ప్రారంభించింది. ఈ రాకెట్ డిసెంబర్ 17న ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ50తో కలిపి 52 సార్లు రోదసిలోకి పయనించింది. వీటిలో 1993లో తొలి రాకెట్ పీఎస్ఎల్వీ-డీ1, 2017లో ప్రయోగించిన పీఎస్ఎల్వీ-సీ39 రాకెట్లు మాత్రమే లక్ష్యం చేరుకోలేకపోయాయి. మిగిలిన 50 పీఎస్ఎల్వీలు విజయవంతంగా గమ్యాన్ని చేరుకుని...అంతర్జాతీయ పరిశోధన రంగంలో ఇస్రో ఖ్యాతిని ఇనుమడింపజేశాయి. అయితే ఇస్రో...పీఎస్ఎల్వీ రాకెట్ను అంచెలంచెలుగా అభివృద్ధి చేసుకుంది. తొలుత PSLV-జీ.. జనరిక్ పేరిట రూపొందించింది. ఆ తరువాత PSLV-సీఎ.. కోర్అలోన్ను తయారుచేసింది. అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో PSLV-ఎక్స్ఎల్, PSLV-డిఎల్, PSLV-క్యూఎల్ రాకెట్లుగా అభివృద్ధి చేసింది. |
ఇతర దేశాలకు ప్రత్యామ్నాయంగా.. ఇస్రో తన ప్రయోగాల్లో భాగంగా ఇప్పటివరకూ 12 PSLV-జీ, 14 PSLV-సీఎ, 22 PSLV-ఎక్స్ఎల్, రెండు PSLV-డీఎల్, రెండు PSLV-క్యూఎల్ రాకెట్లు ప్రయోగించింది. వీటిలో ఒక PSLV-జీ, ఒక PSLV-ఎక్స్ఎల్ రాకెట్లు మాత్రమే లక్ష్యాన్ని చేరుకోవటంలో విఫలమయ్యాయి. పీఎస్ఎల్వీ రాకెట్ల ద్వారా ఇస్రో ఇప్పటికి దాదాపుగా 439 ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యల్లోకి చేరవేయడం ఈ వాహకనౌక సామర్థ్యాన్ని తెలుపుతోంది. అందులో 111 స్వదేశీ ఉపగ్రహాలు ఉండగా, 328 విదేశీ ఉపగ్రహాలున్నాయి. ఈ సంఖ్య PSLVపై ఇస్రోతో పాటు ఇతర దేశాలకు ఉన్న నమ్మకానికి ప్రతీకగా నిలుస్తోంది. ఒకే PSLV రాకెట్ ద్వారా 104 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇస్రో.. పీఎస్ఎల్వీ సత్తాను ప్రపంచానికి గర్వంగా చాటింది. PSLVసీ37 ద్వారా వివిధ దేశాలకు చెందిన 104 ఉపగ్రహాలు ఏకకాలంలో నింగిలోకి పంపిన ఇస్రో...తక్కువఖర్చుతో ఉపగ్రహ ప్రయోగాలకు ఇతరదేశాలకు ప్రత్యామ్నాయంగా మారింది. అంతరిక్ష పరిశోధనలో భారత కీర్తిప్రతిష్ఠలు రోదసిలోకి మోసుకెళ్లడంలో PSLV పాత్ర తిరుగు లేనిది. భారత్కు విదేశీ మారకద్రవ్యం రాబట్టడంలోనూ ఇస్రోకు ఎంతోగానో ఉపయోగపడుతోంది. ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన చంద్రయాన్-1, మంగళయాన్, ఆస్ట్రోశాట్ వంటి కీలక ప్రయోగాల కు సైతం PSLVనే వాహకనౌకగా ఎంచుకోవటం విశేషం. ఈ రాకెట్ తయారీకి 130 కోట్ల రూపాయల ఖర్చు అవుతుండగా.. అంతకు ఎన్నో రెట్ల ఆదాయం దేశానికి ఈ రాకెట్ అందిస్తోంది. ఇస్రోకు అటు పేరు ప్రఖ్యాతుల్ని పెంచటంలో, ఇటు విదేశాల నమ్మకం చూరగొనటంలో తనదైన ప్రత్యేకత నిలబె ట్టుకుంటున్న PSLV ద్వారా మరిన్ని అద్భుత ప్రయోగాలకు ఇస్రో ప్రణాళికలు రచిస్తోంది. |
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈడీ కేసు.. శిల్పాశెట్టి దంపతుల రూ.98 కోట్ల ఆస్తులు అటాచ్
Shilpa Shetty: బాలీవుడ్ నటి శిల్పాశెట్టి దంపతులకు చెందిన రూ.98కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. -
రాహుల్ స్పూన్ ఫీడింగ్ కిడ్.. సురక్షిత స్థానాలనే ఎంచుకుంటున్నారు: ఆజాద్
కాంగ్రెస్ మాజీ నేత గులాం నబీ ఆజాద్.. రాహుల్ గాంధీ (Rahul Gandhi)ని తీవ్ర స్థాయిలో విమర్శించారు. అలాగే ఆయన భాజపాపై పోరాడే తీరును ఎద్దేవా చేశారు. -
ఎన్కౌంటర్ల ‘లక్ష్మణ్’.. మావోయిస్టులకు సింగం
Encounter Specialist: బస్తర్లో మంగళవారం చోటుచేసుకున్న భారీ యాంటీ నక్సల్స్ ఆపరేషన్కు ఓ ఇన్స్పెక్టర్ నేతృత్వం వహించారు. ఆయన ఓ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్..! మావోయిస్టులకు సింగంగా ఆయనకు పేరుంది. -
టైమ్ జాబితాలో సత్య నాదెళ్ల, ఆలియాభట్
ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల, బాలీవుడ్ నటి ఆలియాభట్, నటుడు, డైరెక్టర్ దేవ్ పటేల్ టైమ్ మేగజీన్ 2024 ఏడాదికి రూపొందించిన ప్రపంచంలోనే అత్యంత ప్రభావశీలురైన 100 మంది వ్యక్తుల జాబితాలో చోటు సంపాదించారు. -
పదేళ్లలో పెరిగిన ఈడీ జోరు
ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జోరు గత పదేళ్లలో పెరిగింది. సోదాలు, అరెస్టుల సంఖ్య భారీగా హెచ్చింది. యూపీఏ హయాంతో పోలిస్తే భాజపా పాలనలో దేశవ్యాప్తంగా 86 రెట్లు ఎక్కువగా ఈడీ సోదాలు నిర్వహించింది. -
భద్రతా బలగాల మానసిక యుద్ధం!
మావోయిస్టులపై భద్రతా బలగాలు మానసిక యుద్ధానికి తెరదీశాయి. ప్రస్తుతం దేశంలో మావోయిస్టులకు ఆయువుపట్టుగా ఉన్న అబూఝ్మాడ్లోకి చొచ్చుకెళ్లడమే లక్ష్యంగా ప్రత్యేక వ్యూహాలతో ముందుకెళ్తున్నాయి. -
ఎన్నికల సభల్లో ‘పర్యావరణ స్ఫూర్తి’
రాజకీయ పార్టీల బహిరంగ సభలు, రోడ్షోలు ముగియగానే.. రోడ్లపై వేసిన చెత్తాచెదారం అలాగే వదిలేసి ఎవరి దారి వారు చూసుకొంటారు. -
ప్రొఫెసర్ శోమా సేన్ జైలు నుంచి విడుదల
ఎల్గార్ పరిషద్-మావోయిస్టు సంబంధాల కేసులో నిందితురాలు, నాగపుర్ విశ్వవిద్యాలయం మాజీ ప్రొఫెసర్ శోమా సేన్ (66) బుధవారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. -
త్వరలోనే నక్సలైట్లను పూర్తిగా ఏరివేస్తాం: అమిత్షా
రానున్న అతి కొద్ది కాలంలో నక్సలైట్లను వందశాతం ఏరివేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
దేశ జనాభా 144 కోట్లు
దేశ జనాభా ఈ ఏడాదికి సుమారుగా 144 కోట్లు ఉంటుందని యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ (యూఎన్ఎఫ్పీఏ) స్టేట్ ఆఫ్ వరల్డ్ పాపులేషన్-2024 నివేదికలో అంచనా వేసింది. -
పంజాబ్లో రైల్వేట్రాక్పై రైతుల బైఠాయింపు
హరియాణా పోలీసులు అరెస్టు చేసిన ముగ్గురు రైతులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పంజాబ్లోని పటియాలా జిల్లాలో సంయుక్త కిసాన్ మోర్చా (రాజకీయేతర), కిసాన్ మజ్దూర్ మోర్చాల నేతృత్వంలో అన్నదాతలు బుధవారం ఆందోళన చేపట్టారు. -
పర్యావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటేయండి
పర్యావరణానికి సంబంధించిన అంశాల్లో దేశ పురోగతిని దృష్టిలో పెట్టుకొని సార్వత్రిక ఎన్నికల్లో ఓటేయాలని దేశ ప్రజలకు 70కిపైగా పర్యావరణ, పౌర సమాజ బృందాలు బుధవారం పిలుపునిచ్చాయి. -
జాబిల్లిపై భారతీయుడు కాలుమోపే వరకూ చంద్రయాన్ యాత్రలు: ఇస్రో ఛైర్మన్
చంద్రుడిపైకి భారత వ్యోమగామిని దించేవరకూ చంద్రయాన్ శ్రేణి ప్రయోగాలు కొనసాగుతూనే ఉంటాయని భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ఛైర్మన్ ఎస్.సోమనాథ్ తెలిపారు. -
ముంబయి మహిళకు పాక్లో చిత్రహింసలు
పాకిస్థాన్లోని పంజాబ్ ప్రావిన్సులో భారతీయురాలైన భార్యను చిత్రహింసలు పెడుతున్న భర్తపై కేసు నమోదు చేసినట్లు లాహోర్ పోలీసులు బుధవారం వెల్లడించారు. -
సంక్షిప్త వార్తలు (5)
లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ నేపథ్యంలో కూచ్ బిహార్లో తలపెట్టిన పర్యటనను రద్దు చేసుకోవాలని ఎన్నికల సంఘం (ఈసీ) పశ్చిమ బెంగాల్ గవర్నర్కు స్పష్టంచేసింది. -
పీవీ, మన్మోహన్లపై మోదీ ప్రభుత్వం ప్రశంసలు
మాజీ ప్రధానులు పి.వి.నరసింహారావు, మన్మోహన్ సింగ్లపై మోదీ సర్కారు ప్రశంసల జల్లు కురిపించింది. -
అయోధ్య రాముడికి తిలకం దిద్దిన సూరీడు
శ్రీరామనవమి వేళ అయోధ్యలోని రత్నకిరీట ధారి బాలరాముడి నుదుటిపై బుధవారం మధ్యాహ్నం 12 గంటలకు సూర్యకిరణాలతో తిలకం 4 - 5 నిమిషాలు సాక్షాత్కరించింది. -
ఖైదీలకు స్మార్ట్ కార్డులు... వాటితో ఏం చేయొచ్చంటే?
మహారాష్ట్రలోని హర్సుల్ సెంట్రల్ జైలు అక్కడ ఉండే ఖైదీలు తమ వారితో మాట్లాడుకోవడానికి స్మార్ట్ కార్డులను జారీ చేసింది.
తాజా వార్తలు (Latest News)
-
జాబిల్లిపై చైనా ముందే కాలుమోపితే.. అక్రమణలే: నాసా అధిపతి వ్యాఖ్యలు
-
తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికలు.. తొలిరోజు నామినేషన్ వేసిన కీలక నేతలు
-
భారత క్రికెట్లో నీ భాగస్వామ్యం ఏంటి?: హర్షా భోగ్లేపై మాజీ క్రికెటర్ ఆగ్రహం
-
జగన్పై రాయి దాడి కేసు.. ఆ ఆరుగురి వివరాలు తెలపాలంటూ కోర్టులో పిటిషన్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
ప్రపంచంలో బెస్ట్ ఎయిర్పోర్టులివే.. భారత విమానాశ్రయాలు ఏ స్థానంలో..?