రైల్వే బోర్డుకు కొత్త ఛైర్మన్‌ నియామకం

రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే జనరల్‌ మేనేజర్‌ సునీత్‌శర్మను రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌, సీఈవోగా ఎంపికచేసింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను సునీత్‌కు అప్పగించారు. సునీత్‌ శర్మ 1978 బ్యాచ్‌కు 

Updated : 01 Jan 2021 03:05 IST

దిల్లీ: రైల్వే బోర్డుకు కేంద్రం కొత్త ఛైర్మన్‌ను నియమించింది. తూర్పు రైల్వే జనరల్‌ మేనేజర్‌ సునీత్‌శర్మను రైల్వే బోర్డు నూతన ఛైర్మన్‌, సీఈవోగా ఎంపికచేసింది. ప్రస్తుతం ఛైర్మన్‌గా కొనసాగుతున్న వినోద్‌ కుమార్‌ యాదవ్‌ పదవీ కాలం ముగియడంతో ఆ బాధ్యతలను సునీత్‌కు అప్పగించారు. సునీత్‌ శర్మ 1978 బ్యాచ్‌కు చెందిన స్పెషల్‌ క్లాస్‌ రైల్వే అప్రెంటిస్‌ అధికారి.

భారతీయ రైల్వే సంస్థలో ఆయన దాదాపు 34ఏళ్లకు పైగా వివిధ హోదాల్లో పనిచేశారు. సాంకేతిక అంశాలపై ఆయనకు మంచి అవగాహన ఉండటంతో పాటు పనిచేసిన విభాగాల్లో కొన్ని పాలనాపరమైన సంస్కరణలు తీసుకొచ్చిన వ్యక్తిగా ఆయనకు పేరుంది. రాయ్‌బరేలీలోని మోడర్న్‌ కోచ్‌ ఫ్యాక్టరీకి జనరల్‌ మేనేజర్‌గానూ సేవలందించారు. అంతేకాకుండా సెంట్రల్‌ రైల్వేలో పుణె డీఆర్‌ఎంగా, చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌గా, వారణాసిలోని డీజిల్‌ లోకోమెటివ్‌ వర్క్స్‌లో ప్రిన్సిపల్‌ చీఫ్‌ మెకానికల్‌ ఇంజినీర్‌గా పనిచేశారు. విదేశాల్లో జరిగిన పలు రైల్వే సంస్థల శిక్షణా కార్యక్రమాలకూ ఆయన  హాజరయ్యారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని