Supertech: ఆ 40 అంతస్తుల ట్విన్ టవర్స్ కూల్చివేత గడువు పొడిగింపు
ఉత్తర్ప్రదేశ్లోని నోయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల (ట్విన్ టవర్స్) కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు .....
* ఆగస్టు 28 కల్లా కూల్చివేయాలని సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు
దిల్లీ: ఉత్తర్ప్రదేశ్లోని నొయిడాలో అక్రమంగా నిర్మించిన 40 అంతస్తుల జంట భవనాల (ట్విన్ టవర్స్) కూల్చివేత అంశంపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. కూల్చివేత గడువును మూడు నెలల పాటు పొడిగించింది. గతంలో మే 22న కూల్చి వేయాల్సిందేనంటూ ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ ట్విన్ టవర్స్ కూల్చివేతకు ఇంకా ఐదు రోజులు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో కీలక ఆదేశాలు ఇచ్చింది. అయితే, ఈ భవనాల కూల్చివేత కోసం నియమించిన ఏజెన్సీ ఎడిఫైస్ ఇంజినీరింగ్ మూడు నెలల సమయం కోరుతోందని, అందువల్ల కూల్చివేత గడువు పెంచాలంటూ ఇంటీరియం రిజల్యూషన్ ప్రొఫెషనల్ (ఐఆర్పీ) అనే సంస్థ సర్వోన్నత న్యాయస్థానానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై జస్టిస్ డీవై చంద్రచూడ్, పీఎస్ నరసింహలతో కూడిన బెంచ్ మంగళవారం విచారణ జరిపింది. భవనాల కూల్చివేతకు ముందు నిర్వహించిన టెస్ట్ బ్లాస్ట్ తర్వాత ఈ నిర్మాణాలు ఊహించిన దానికన్నా దృఢంగా, స్థిరంగా ఉన్నట్టు ఎడిఫైస్ సంస్థ గుర్తించిన విషయాన్ని ఐఆర్పీ తరఫు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే, గడువు పొడిగింపునకు అమికస్ క్యూరీ అడ్వకేట్ గౌరవ్ అగర్వాల్ కూడా అంగీకరించడంతో ఆగస్టు 28 కల్లా ఈ 40 అంతస్తుల భవనాలను కూల్చివేత ప్రక్రియను పూర్తి చేయాలని బెంచ్ ఆదేశించింది. అలాగే, స్టేటస్ రిపోర్టు సమర్పించాలని కోరింది.
నిబంధనలు ఉల్లంఘిస్తూ నొయిడాలోని సెక్టార్ 93లో సూపర్టెక్ సంస్థ నిర్మించిన ట్విన్ టవర్స్ను అక్రమ నిర్మాణాలని సుప్రీంకోర్టు గతేడాది ఆగస్టులో తేల్చిన విషయం తెలిసిందే. ఈ భవన నిర్మాణాలపై దాఖలైన పిటిషన్లు విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. 3 నెలల్లోగా వాటిని కూల్చివేయాలని తొలుత ఆదేశించింది. ఈ మేరకు గతంలో అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్థించింది. కూల్చివేత ఖర్చు మొత్తాన్ని సూపర్టెక్ భరించాలని సూచించింది. అంతేగాక, జంట టవర్లలో దాదాపు వెయ్యి ఫ్లాట్లు ఉండగా.. వాటిని కొన్న వారందరికీ రెండు నెలల్లోగా 12శాతం వడ్డీతో నగదును తిరిగి చెల్లించాలని ఆదేశించిన విషయం తెలిసిందే.
ఈ ట్విన్ టవర్స్లో 915 ఫ్లాట్లు, 21 దుకాణాలు ఉన్నాయి. వీటిని కూల్చివేసేందుకు మే 22న మధ్యాహ్నం 2.30 గంటలకు సమయం కూడా ఫిక్స్ చేశారు. స్థానిక అధికారులు ఆ బాధ్యతను ఎడిఫైస్ ఇంజినీరింగ్ సంస్థ చేతిలో పెట్టారు. అలాగే ఈ టవర్స్ను కూల్చివేసేందుకు 2,500 నుంచి 4,000 కిలోల పేలుడు పదార్థాలు అవసరమవుతాయని అంచనా. అంతటి భారీ నిర్మాణాల కూల్చివేతకు కేవలం 9 సెకన్ల సమయం మాత్రమే పడుతుందని సంస్థ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు తాజా నిర్ణయంతో కూల్చివేత ప్రక్రియ వాయిదా పడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వీవీప్యాట్ స్లిప్పులను వేగంగా లెక్కించలేరా?
ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో(ఈవీఎం) నమోదైన ఓట్లతో వీవీప్యాట్ల స్లిప్పులను సరిపోల్చి లెక్కించే అంశంతో పాటు ఎన్నికల ప్రక్రియపై వస్తున్న సందేహాల నివృత్తి విషయంలో సుప్రీంకోర్టు పలు కీలక ప్రశ్నలు సంధించింది. -
శిల్పాశెట్టి-రాజ్కుంద్రాల రూ.98 కోట్ల ఆస్తుల జప్తు
బిట్కాయిన్ల మోసాలకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి శిల్పా శెట్టి, ఆమె భర్త రాజ్కుంద్రాకు చెందిన రూ.97.79 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తుచేసింది. -
బెయిల్ కోసం మిఠాయిలు తింటున్నారు
తిహాడ్ జైల్లో ఉన్న దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆరోగ్య కారణాలు చూపి బెయిల్ పొందేందుకు ప్రయత్నిస్తున్నారని గురువారం ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)ఆరోపించింది. -
నిన్న అమీర్ఖాన్.. నేడు రణ్వీర్సింగ్
లోక్సభ ఎన్నికల సమయంలో కృత్రిమ మేధ ద్వారా రూపొందిస్తున్న డీప్ఫేక్ వీడియోలు సరికొత్త సవాళ్లు విసురుతున్నాయి. -
సంక్షిప్త వార్తలు (5)
మద్యం కుంభకోణం కేసులో ఆప్ నేత మనీశ్ సిసోదియాకు కోర్టు మరోసారి జుడిషియల్ కస్టడీని పొడిగించింది. -
హిమాచల్లో గ్రామానికి తొలిసారి మొబైల్ సౌకర్యం
హిమాచల్ప్రదేశ్లోని స్పిటీ ప్రాంతంలో మారుమూల గ్రామమైన గీవుకు తొలిసారిగా మొబైల్ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం గ్రామస్థులతో 13 నిమిషాలకుపైగా మొబైల్లో ముచ్చటించారు. -
స్వదేశీ క్రూజ్ క్షిపణి పరీక్ష విజయవంతం
స్వదేశీ పరిజ్ఞాన క్రూజ్ క్షిపణి (ఐటీసీఎం)ని భారత్ గురువారం విజయవంతంగా పరీక్షించింది. ఒడిశాలోని చాందీపుర్లో ఉన్న ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్ (ఐటీఆర్) ఇందుకు వేదికైంది. -
చెవిటి, మూగ నిందితుల విచారణకు మార్గదర్శకాల జారీని పరిశీలిస్తాం: సుప్రీం
చెవిటి, మూగ నిందితుల విచారణ కోసం మార్గదర్శకాల జారీ అంశాన్ని పరిశీలించాలని సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయించింది. -
నాలుగు నెలల్లో 80 మంది మావోయిస్టుల హతం!
ఛత్తీస్గఢ్లో ఈ ఏడాది దాదాపు 80 మంది మావోయిస్టులు మృతిచెందారని, 125 మందికి పైగా అరెస్టు కాగా, 150 మంది లొంగిపోయారని కేంద్ర హోంశాఖ గురువారం తెలిపింది. -
ఇండిగో ప్యాకేజ్డ్ ఆహారంలో అధిక ఉప్పు!
ప్రముఖ విమానయాన సంస్థ ఇండిగో అందించే ఆహారంలో మోతాదుకు మించి ఉప్పు ఉంటోందంటూ ఓ ఇన్ఫ్లుయెన్సర్ చేసిన వీడియోపై ఆ సంస్థ స్పందించింది. -
ఇరాన్ అదుపులో ఉన్న భారతీయ మహిళ విడుదల
ఇరాన్ స్వాధీనం చేసుకున్న ఇజ్రాయెల్ కుబేరుడికి చెందిన ఎంఎస్సీ ఏరీస్ వాణిజ్య నౌకలోని 17 మంది భారతీయ సిబ్బందిలో ఏకైక మహిళ అయిన అన్ టెస్సా జోసెఫ్ సురక్షితంగా విడుదలయ్యారు. -
స్వీపర్ తనయుడు.. సివిల్స్లో సత్తా చాటాడు
స్వీపర్ తనయుడు సివిల్స్లో సత్తా చాటాడు. మహారాష్ట్రకు చెందిన ప్రశాంత్ సురేశ్.. 849వ ర్యాంకు సాధించాడు. -
ఏమిటీ ‘బీ’ ఫారం.. దీనివల్ల ప్రయోజనమేంటీ?
నామినేషన్ సమయంలో ఎన్నికల అధికారులకు అభ్యర్థులు తమ పార్టీ ఇచ్చిన ఫారాన్ని దాఖలు చేస్తే ఆ పార్టీకి సంబంధించిన ఎన్నికల గుర్తును కేటాయిస్తారు.
తాజా వార్తలు (Latest News)
-
నిప్పుల గుండంలా తెలంగాణ.. ఆరు జిల్లాల్లో 45 డిగ్రీల కంటే ఎక్కువే..
-
నటుడు మన్సూర్ అలీఖాన్కు అస్వస్థత.. పండ్లరసంలో విషం కలిపారని ఆరోపణ
-
జూబ్లీహిల్స్, బంజారాహిల్స్లో పగులుతున్న అద్దాలు.. అంతుచిక్కని అనుమానాలు
-
‘మా మావయ్యను నరమాంస భక్షకులు తినేశారు’
-
సీఎం తెచ్చిన నరకయాతన.. రెండున్నర గంటలపాటు కదలని బస్సులు
-
గులకరాయికి.. రాజకీయ రంగు!