జర్నలిస్ట్ అరెస్ట్: యూపీకి సుప్రీం నోటీసులు!
కేరళ జర్నలిస్టు అరెస్టు వ్యవహారంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్కు బెయిల్ మంజూరు చేయాలంటూ కేరళ జర్నలిస్టు యూనియన్ వేసిన పిటిషన్పై సీజేఐ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది.
దిల్లీ: కేరళ జర్నలిస్టు అరెస్టు వ్యవహారంలో సుప్రీంకోర్టు యూపీ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. జర్నలిస్టు సిద్ధిఖ్ కప్పన్కు బెయిల్ మంజూరు చేయాలంటూ కేరళ జర్నలిస్టు యూనియన్ వేసిన పిటిషన్పై సీజేఐ ఎస్ఏ బోబ్డే నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారించింది. ఈ కేసులో యూపీ ప్రభుత్వం తమ ప్రతిస్పందన తెలియజేయాలని పేర్కొంటూ నోటీసులు జారీ చేసింది. అరెస్టయిన జర్నలిస్టు తరపున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ వాదించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ద్వారా కప్పన్కు అత్యవసరంగా మధ్యంతర బెయిల్ ఇప్పించాలని కపిల్ ధర్మాసనాన్ని కోరారు. దీనికి సీజేఐ స్పందిస్తూ.. ‘భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 32 ప్రకారం మేం ఈ పిటిషన్ను విచారించేందుకు నిరాకరిస్తున్నాం. అయినా ఈ కేసులో మీరు అలహాబాద్ హైకోర్టుకు ఎందుకు వెళ్లకూడదు?’ అని ప్రశ్నించారు. అనంతరం ఈ కేసును నవంబర్ 20, శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు ఆదేశించారు.
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన హాథ్రస్ కేసును కవర్ చేసేందుకు వెళ్లిన కేరళకు చెందిన జర్నలిస్ట్ సిద్ధిఖ్ కప్పన్ను యూపీ పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఆయనపై చట్ట వ్యతిరేక కార్యకలాపాల చట్టం(యూఏపీఏ) కింద కేసు నమోదు చేసి జైలుకు తరలించారు. దీంతో ‘కప్పన్ ఎందుకు అరెస్టు చేశారు.. ఆయనను వెంటనే విడుదల చేయాలంటూ’ కేరళ జర్నలిస్టు సంఘం(కేయూడబ్ల్యూజే) సుప్రీంకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
Teachers recruitment Scam: పశ్చిమ బెంగాల్లో 2016లో నిర్వహించిన ఉపాధ్యాయ నియామక పరీక్ష చెల్లదని కోల్కతా హైకోర్టు స్పష్టం చేసింది. ఆ పరీక్షతో ఉద్యోగాలు సాధించిన టీచర్లంతా తమ వేతనాలను వెనక్కి ఇచ్చేయాలని ఆదేశించింది. -
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
Supreme Court: అత్యాచారానికి గురైన ఓ బాలికకు 30 వారాల గర్భవిచ్ఛిత్తికి సుప్రీంకోర్టు అనుమతినిచ్చింది. ఈ కేసులో బాధితురాలికి సంపూర్ణ న్యాయం అందించేందుకు కోర్టు తన విస్తృత అధికారాలను ఉపయోగించింది. -
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?
Google Doodle: ధరిత్రి దినోత్సవం సందర్భంగా గూగుల్ ప్రత్యేక డూడుల్ను రూపొందించింది. దాని అర్థం ఏంటి? ఆ చిత్రాలు ఏం సూచిస్తున్నాయో చూద్దాం..! -
కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలి
మధుమేహంతో బాధపడుతున్న తమ నాయకుడు అరవింద్ కేజ్రీవాల్కు ఇన్సులిన్ ఇవ్వాలంటూ ఆదివారం ఆప్ కార్యకర్తలు తిహాడ్ జైలు వెలుపల ఆందోళన నిర్వహించారు. -
గాడిద పాలతో నెలకు రూ.3 లక్షలు
గాడిద పాలను విక్రయించి గుజరాత్కు చెందిన ధీరేణ్ సోలంకీ నెలకు రూ.3 లక్షలు సంపాదిస్తున్నారు. చాలా కాలం పాటు ఆయన ప్రభుత్వ ఉద్యోగం కోసం ప్రయత్నించినా విజయం సాధించలేకపోయారు. -
భిన్న జగతిలో విశ్వబంధుగా భారత్
పంచంలో నేడు పలు దేశాలు యుద్ధాలకు కాలు దువ్వుతున్నాయని, ఇటువంటి తరుణంలో భారత తీర్థంకరుల బోధనలకు కొత్త ఔచిత్యం ఏర్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. -
సివిల్ సర్వీసెస్ అధికారుల నిబద్ధత తిరుగులేనిది: నరేంద్ర మోదీ
సివిల్ సర్వీసెస్ దినోత్సవం సందర్భంగా సివిల్ సర్వీసెస్ అధికారులందరికీ శుభాకాంక్షలు. మన దేశానికి సేవ చేయడంలో వారి నిబద్ధత, కృషి ప్రశంసనీయం. -
సీఆర్పీఎఫ్ బస్సు బోల్తా.. పది మంది జవాన్లకు గాయాలు
ఛత్తీస్గఢ్లోని బస్తర్ జిల్లా రాయ్కోట్ వద్ద 32 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు ప్రయాణిస్తున్న బస్సు ఆదివారం మధ్యాహ్నం బోల్తా పడింది. -
అవయవ మార్పిడిలో అక్రమాలపై కొరడా!
అక్రమంగా అవయవ మార్పిడి చేస్తున్న ఆసుపత్రులపై దర్యాప్తు జరిపి, ఉల్లంఘనలను గుర్తించాలని కేంద్ర ఆరోగ్యశాఖ.. రాష్ట్రాలకు స్పష్టంచేసింది. -
ఛత్తీస్గఢ్ మద్యం కుంభకోణం కేసులో విశ్రాంత ఐఏఎస్ అధికారి అనిల్ అరెస్టు
త్తీస్గఢ్లో రూ.2,000 కోట్ల విలువైన మద్యం కుంభకోణంతో సంబంధమున్న నగదు అక్రమ చలామణీ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కేసులో మరో అరెస్టు చోటు చేసుకుంది. -
వాతావరణ వార్తలు చదువుతూ.. సొమ్మసిల్లిన న్యూస్ రీడర్
దేశవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. అధిక ఉష్ణోగ్రతలు, వడగాడ్పులతో ఇంటి నుంచి బయటకు రావాలంటేనే జనం జంకుతున్నారు. -
మహారాష్ట్రలో దివ్యాంగ సిబ్బందితో పోలింగ్ కేంద్రాలు
సాధారణ ఉద్యోగుల కంటే దివ్యాంగ ఉద్యోగులు ఏం తక్కువ కాదని నిరూపించేందుకు ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. మహారాష్ట్రలో ఛత్రపతి శంభాజీనగర్ జిల్లాలో దివ్యాంగులకు ఎన్నికల విధులను అప్పగించనుంది. -
ఇకపై నాలుగేళ్ల డిగ్రీతో పీహెచ్డీ చేయొచ్చు
పీహెచ్డీ చేయాలనుకునే విద్యార్థులకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్(యూజీసీ) తీపి కబురు చెప్పింది. నాలుగేళ్ల బ్యాచిలర్ డిగ్రీతో ఇకపై నేరుగా జాతీయ అర్హత పరీక్ష(నెట్)కు హాజరుకావచ్చని ప్రకటించింది.
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
బెంగాల్లో 26 వేల మంది టీచర్ల ఉద్యోగాలు రద్దు.. జీతాలు వెనక్కి ఇవ్వాలన్న కోర్టు
-
సామ్ కరన్కు 50 శాతం.. డుప్లెసిస్కు రూ. 12 లక్షల ఫైన్
-
రామ్చరణ్ అంటే నాకెంతో ఇష్టం..: బాలీవుడ్ నటి
-
30 వారాల గర్భవిచ్ఛిత్తికి అనుమతి: 14 ఏళ్ల బాలిక కేసులో సుప్రీం అసాధారణ తీర్పు
-
ఈరోజు గూగుల్ డూడుల్ గమనించారా? అక్షరాలను పోలి ఉన్న ఆ చిత్రాలేంటో తెలుసా?