Supreme Court: కొలీజియం నచ్చకపోతే ఇంకో వ్యవస్థను తెండి: సుప్రీంకోర్టు
సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను సైతం కేంద్రం వెనక్కి పంపడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది.
దిల్లీ: సుప్రీంకోర్టు, హైకోర్టు న్యాయమూర్తుల నియామకాలకు సంబంధించి కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను సైతం కేంద్రం వెనక్కి పంపడంపై సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆందోళన వ్యక్తంచేసింది. అభ్యంతరం వ్యక్తం చేయడానికి ఎలాంటి కారణాలు లేకున్నా సిఫార్సులను అడ్డుకోవడం సరికాదని పేర్కొంది. కొలీజియం కంటే మెరుగైన వ్యవస్థను తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తే, ఎవరూ నిరోధించరని, కానీ ఆ సమయం వరకు అమల్లో ఉన్న చట్టాన్ని కచ్చితంగా అమలుపరచాల్సిందేనని స్పష్టంచేసింది. కొలీజియం సిఫార్సు చేసిన పేర్లను ఆమోదించకుండా కేంద్రం ఆలస్యం చేస్తోందంటూ దాఖలైన పలు పిటిషన్లపై శుక్రవారం జరిగిన విచారణ సందర్భంగా జస్టిస్ ఎస్.కె.కౌల్, జస్టిస్ ఎ.ఎస్.ఓకా ధర్మాసనం ఈ మేరకు వ్యాఖ్యలు చేసింది. కొలీజియం పునరుద్ఘాటించిన పేర్లను కేంద్రం వెనక్కి పంపిస్తోందని ధర్మాసనం దృష్టికి పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తీసుకువచ్చారు. ‘‘ఇది ఆందోళన కలిగించే విషయం. ఈ విషయాన్ని గత ఉత్తర్వుల్లోనూ లేవనెత్తాం’’ అని న్యాయమూర్తులు పేర్కొన్నారు. దీంతో పేర్లను ఆమోదించే ప్రక్రియను సుప్రీంకోర్టు నిర్దేశించిన కాలావధుల్లో పూర్తి చేస్తామని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్రం హామీ ఇచ్చింది.
అభ్యంతరాలుంటే చెప్పండి..ఆపకండి
సిఫార్సు చేసిన పేర్లపై ప్రభుత్వానికి సొంత అభిప్రాయాలు ఉంటే వాటిని వ్యక్తం చేయాలని..అంతేగానీ ప్రతిపాదనలను పెండింగులో ఉంచడం సరికాదని జస్టిస్ కౌల్ అన్నారు. ‘‘మీ అభిప్రాయాలను తెలుపుతూ వెనక్కి పంపండి. పరిశీలిస్తాం. ఆ పేరును తిరిగి సిఫార్సు చేయాలా, తప్పించాలా అనే విషయంపై నిర్ణయం తీసుకుంటాం. అయితే ఆ పేరును మేం పునరుద్ఘాటించామంటే.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నియామకాన్ని ఏదీ ఆపలేదు’’ అని తెలిపారు. సిఫార్సుల ఆమోదంలో విపరీతమైన జాప్యం కారణంగా ప్రతిభావంతులైన జడ్జీలు న్యాయవ్యవస్థకు దూరం అవుతున్నారని జస్టిస్ కౌల్ ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘పెండింగులో ఉంచుకోవడం.. పునరుద్ఘాటించిన పేర్లను వెనక్కి పంపడం ఆరోగ్యకరమైన వాతావరణం కాదు. దీని వల్ల ప్రతిభావంతులైన వారు జడ్జీలుగా ఉండేందుకు సమ్మతిని తెలపడం లేదు’’ అని జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.
ఆ పేర్లను ఎందుకు పెండింగులో ఉంచారు
సుప్రీంకోర్టుకు కొలీజియం సిఫార్సు చేసిన ఐదుగురు న్యాయమూర్తుల పేర్ల పరిస్థితేంటని ఏజీని ధర్మాసనం ప్రశ్నించింది. ఇందుకు కొంత గడువు కావాలని వెంకటరమణి అభ్యర్థించారు. ‘‘ఇందులో సమయం తీసుకోవడానికి ఏముంది. వారంతా ప్రస్తుత హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, సీనియర్ జడ్జీలే కదా’’ అని జస్టిస్ కౌల్ అన్నారు. పది మంది హైకోర్టు న్యాయమూర్తులను బదిలీ చేస్తూ కొలీజియం చేసిన సిఫార్సులను పెండింగ్లో పెట్టడంపైనా ధర్మాసనం అభ్యంతరం వ్యక్తం చేసింది.
భావజాలం ఆధారంగా అంచనా సరికాదు
న్యాయవాదుల పదోన్నతిని వారు వివిధ సందర్భాల్లో చేసిన వ్యాఖ్యలు లేదా వాదించిన కేసులు ఆధారంగా అడ్డుకోవడం తగదని ధర్మాసనం అభిప్రాయపడింది. ‘‘మంచి క్రిమినల్ న్యాయవాది నేరగాళ్ల తరఫునా వాదిస్తాడు. అంత మాత్రాన అతనిపై ఓ అభిప్రాయానికి రావడం సరికాదు. విభిన్న భావజాలాలు ఉన్న వ్యక్తులు న్యాయవాదులుగా ఉంటారు. న్యాయమూర్తిగా నియమితులైన తర్వాత అవి పక్కకిపోతాయి. ఏ రాజకీయ పార్టీ భావజాలానికి సంబంధించిన వారైనా, ఎలాంటి ఆలోచనా ధోరణి ఉన్నవారైనా.. న్యాయమూర్తిగా స్వతంత్రంగానే వ్యవహరించాల్సి ఉంటుంది. ఒక రకమైన భావజాలం ఉన్నంత మాత్రాన వారు ఎవరితోనో కలిసిపోయారని అంచనాకు రావడం సరికాదు’’ అని ఏజీని ఉద్దేశించి జస్టిస్ కౌల్ పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
క్రికెట్ అభిమానులు జాగ్రత్తగా ఉండండి..! చెన్నై ఆటగాడు ధోనీ (MS Dhoni) పేరుతో ఓ ఇన్స్టా మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. -
హోటల్లో భారీ అగ్ని ప్రమాదం.. ఆరుగురి సజీవ దహనం
పట్నాలోని ఓ హోటల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మరికొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. -
విద్యార్థుల చిరునవ్వుల కోసం ఓ టీచర్ ఫన్నీ యాక్ట్.. వీడియో వైరల్
Students smile: విద్యార్థులంటే పుస్తకాలు ముందేసుకొని, టీచర్లు చెప్పే పాఠాలు వినడమే గుర్తుకువస్తుంది. కానీ ఆన్లైన్లో వైరల్గా మారిన ఓ వీడియో మాత్రం అందుకు భిన్నంగా ఆకట్టుకుంటోంది. -
కొండచరియల బీభత్సం.. చైనా సరిహద్దుల్లోని జిల్లాకు దేశంతో సంబంధాలు కట్
Arunachal Pradesh: హైవేపై కొండచరియలు విరిగిపడటంతో చైనా సరిహద్దుల్లోని ఓ జిల్లాకు మిగిలిన ప్రాంతాలతో సంబంధాలు తెగిపోయాయి. -
కేంద్రమంత్రి ఆడియో క్లిప్ లీక్ చేయమన్నారు: రాజస్థాన్ మాజీ సీఎం గహ్లోత్పై ఆరోపణలు
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ అధికారి ఒకరు రాజస్థాన్ మాజీ సీఎం అశోక్ గహ్లోత్ (Ashok Gehlot)పై తీవ్ర ఆరోపణలు చేశారు. -
ఐపీఎల్ స్ట్రీమింగ్ కేసు.. నటి తమన్నాకు సమన్లు
Tamannaah: నిబంధనలకు వ్యతిరేకంగా ఐపీఎల్ను ప్రసారం చేసిన కేసులో నటి తమన్నాకు మహారాష్ట్ర సైబర్ పోలీసులు సమన్లు జారీ చేశారు. -
ప్రైవేటు ఆస్తి.. సమాజ వనరు కాదని అనలేం: సుప్రీంకోర్టు వ్యాఖ్య
ప్రైవేటు ఆస్తిని సమాజ వనరుగా పరిగణించజాలరని, దాన్ని ఉమ్మడి ప్రయోజనం కోసం స్వాధీనం చేసుకోకూడదన్న వాదన ‘ప్రమాదకరమ’వుతుందని సుప్రీంకోర్టు బుధవారం పేర్కొంది. -
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాల్లో పెట్టుబడులు పెట్టాలి: ప్రధాని
ప్రకృతి వైపరీత్యాలు రానురాను మరింత పెరుగుతూ తీవ్రత కూడా ఎక్కువగా ఉంటోందని, ప్రజాజీవితంపై వాటి ప్రభావం ఎన్నో రెట్లు పెరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. -
హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ సుప్రీంకోర్టుకు హేమంత్ సోరెన్
తన అరెస్టును వ్యతిరేకిస్తూ దాఖలు చేసిన పిటిషన్పై హైకోర్టు తీర్పివ్వడంలేదంటూ ఝార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. -
ప్రజల కలలకు రెక్కలు తొడుగుతాం
గ్రామీణ భారతదేశ రూపురేఖలను మార్చి ప్రజలకు మెరుగైన జీవితాన్ని అందించడానికి క్షేత్రస్థాయిలో విశేష కృషి చేస్తున్న ప్రతి ఒక్కరికీ పంచాయతీ రాజ్ దినోత్సవ శుభాకాంక్షలు. -
ఎన్నికల బాండ్ల పథకం భారీ కుంభకోణమే
రాజకీయ పార్టీలకు అపారదర్శకంగా నిధులు అందించిన ఎన్నికల బాండ్ల పథకాన్ని సర్వోన్నత న్యాయస్థానం రద్దు చేసినప్పటికీ ఆ వ్యవహారం అంతటితో సద్దుమణగలేదు. -
ఈవీఎం, వీవీప్యాట్ విడి పరికరాల తయారీదారుల వివరాలను మేం బహిర్గతపరచలేం..
ఈవీఎం, వీవీప్యాట్ యంత్రాల విడి పరికరాల తయారీదారుల వివరాలను బహిర్గతపరచలేమని ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్(ఈసీఐఎల్), భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(బీఈఎల్) స్పష్టం చేశాయి. -
రూ.25వేల కోట్ల అవకతవకల కేసు.. సునేత్రా పవార్కు క్లీన్చిట్
లోక్సభ ఎన్నికల వేళ మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ సతీమణి, బారామతి ఎన్డీయే అభ్యర్థి సునేత్ర పవార్కు భారీ ఊరట లభించింది. -
మణిపుర్లో వంతెనపై ఐఈడీ పేలుడు
మణిపుర్లోని 2వ జాతీయ రహదారిపై ఉన్న ఓ కీలక వంతెనపై ఐఈడీ పేలుడు సంభవించింది. ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని, వంతెన స్వల్పంగా దెబ్బతిన్నట్లు అధికారులు తెలిపారు. -
సంజయ్ రౌత్ సన్నిహితుడి ఆస్తుల జప్తు
శివసేన (ఉద్ధవ్) ఎంపీ సంజయ్ రౌత్ సన్నిహితుడు ప్రవీణ్ రౌత్కు చెందిన రూ.73 కోట్ల ఆస్తులను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జప్తు చేసింది. -
రామకృష్ణ మఠం నూతన అధ్యక్షుడిగా స్వామి గౌతమానంద్జీ మహారాజ్
రామకృష్ణ మఠం, రామకృష్ణ మిషన్ నూతన అధ్యక్షుడి (17వ)గా స్వామి గౌతమానంద్జీ మహారాజ్ ఎన్నికయ్యారు. ఈ మేరకు సంబంధిత వర్గాలు ఓ ప్రకటనలో వెల్లడించాయి. -
ఆకాశంలో.. అమ్మకు హ్యాపీ బర్త్డే!
ఎయిరిండియా ఎక్స్ప్రెస్ విమానంలో ఇటీవల జరిగిన ఓ హృద్యమైన ఘటన వీడియో వైరల్గా మారింది. తల్లి పుట్టినరోజును మరపురాని జ్ఞాపకంగా చేయాలనుకున్నాడు ఓ బుడతడు. -
ఎన్నికలను మేం నియంత్రించలేం
దేశంలో జరిగే ఎన్నికల ప్రక్రియను తాము నియంత్రించలేమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. అలాగే ఎన్నికల సంఘం పని తీరునూ నిర్దేశించలేమని స్పష్టం చేసింది. -
25 వేల ఉపాధ్యాయుల రద్దు తీర్పుపై సుప్రీంను ఆశ్రయించిన పశ్చిమబెంగాల్
పశ్చిమబెంగాల్లో 25,753 మంది ప్రభుత్వ ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది నియామకాలను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు ఇచ్చిన తీర్పును ఆ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో సవాలు చేసింది. -
జేఈఈ మెయిన్ ఫలితాల్లో తెలుగు విద్యార్థుల సత్తా.. 22 మందికి 100 పర్సంటైల్
జేఈఈ మెయిన్ సెషన్ (2) పరీక్ష ఫలితాలను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ ఫలితాల్లో తెలుగు రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు సత్తా చాటారు.
తాజా వార్తలు (Latest News)
-
నా వ్యాఖ్యలను అపార్థం చేసుకోవడంతోనే సమస్య: అంబటి రాయుడు
-
‘రాంచీలో ఉన్నా.. రూ.600 కావాలి’.. ధోనీ పేరుతో మెసేజ్ వైరల్
-
బౌలర్ల విషయంలో రాజీ పడొద్దు.. అలా చేస్తే కష్టమే: నవ్జ్యోత్ సిద్ధూ
-
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
-
అలా చేస్తే ఆయుధాలు వీడతాం.. హమాస్ కీలక ప్రతిపాదన!
-
జగన్.. బ్యాండేజ్ ఎక్కువ రోజులు ఉంటే సెప్టిక్ అవుతుంది: సునీత